మయాన జకియా ఖానమ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా 26 నవంబర్ 2021న బాధ్యతలు చేపట్టింది.[1]

మయాన జకియా ఖానమ్‌

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 నవంబర్ 2021 నుంచి ప్రస్తుతం
నియోజకవర్గం నామినేటెడ్ స్థానం

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
20 ఆగస్టు 2020 నుంచి ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 01 సెప్టెంబర్ 1973
రాయచోటి, వైఎస్‌ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఎం.హజీజ్‌ ఖానమ్, ఎం.దిలావర్‌ఖాన్‌
జీవిత భాగస్వామి దివంగత ఎం.అఫ్జల్‌ ఖాన్
సంతానం ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు

జననం, విద్యాభాస్యం మార్చు

జకియా ఖానమ్‌ 01 సెప్టెంబర్ 1973లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్‌ఆర్ జిల్లా, రాయచోటిలో ఎం.హజీజ్‌ ఖానమ్, ఎం.దిలావర్‌ఖాన్‌ దంపతులకు జన్మించింది. ఆమె ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేసింది.

కుటుంబం మార్చు

జకియా ఖానమ్‌ వివాహం 01 సెప్టెంబర్ 1989లో మయాన అఫ్జల్‌ అలీఖాన్‌ తో జరిగింది. ఆయన రాయచోటి మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌గా పని చేశాడు.వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం మార్చు

జకియా ఖానమ్‌ తన భర్త అఫ్జల్‌ అలీఖాన్‌ మరణాంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. ఆమెను ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా 29 జులై 2020న నియమితురాలైంది.[2][3] జకియా ఖానమ్‌ 26 నవంబర్ 2021న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టింది.[4]

మూలాలు మార్చు

  1. Andhrajyothy (26 November 2021). "మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా ఖానమ్‌ బాధ్యతల స్వీకారం". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  2. Babu (29 July 2020). "ఇద్దరు ఎమ్మెల్సీలుగా గవర్నర్ నామినేట్.. గెజిట్ నొటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల అధికారి". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 20 జనవరి 2021 suggested (help)
  3. Sakshi (29 July 2020). "గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, రవీంద్రబాబు". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  4. Namasthe Telangana (26 November 2021). "ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియాఖానమ్‌." Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.