జియో పేమెంట్ బ్యాంక్

జియో పేమెంట్ బ్యాంక్ ఏప్రిల్ 3 2018 నుంచి దీని సేవలు మొదలయ్యాయి. ఆగస్టు 19, 2015న రిలయన్స్ జియో ఈ పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం - 1949 పరిధిలోని సెక్షన్ 22 (1) కింద రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లైసెన్స్ జారీ చేసింది.[1]

జియో పేమెంట్ బ్యాంక్
Typeపబ్లిక్ రంగం
పరిశ్రమఆర్థిక కార్యకలాపాలు
స్థాపన2018
Foundersస్థాపకుడు
Areas served
భారతదేశం
Productsబ్యాంకింగ్
Parentజియో పేమెంట్ బ్యాంక్

వివరాలు మార్చు

రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ ఈ బ్యాంక్ యొక్క లావాదేవీలు చూస్తుంది. ఈ బ్యాంకు ఎస్‌బిఐతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఆవిర్భవించింది . ఇందులో 70 శాతం నిధులను రిలయన్స్ ఇండస్ట్రీ, 30 శాతం నిధులను ఎస్‌బిఐ సమకూరుస్తుంది.[2] జియో బ్యాంకుతో పాటు ఎయిర్ టెల్, వోడాఫోన్, ఫినో కార్పొరేషన్, పేటిమ్ కంపెనీలు 2015 ఆగస్టు 19న లైసెన్స్ పొందిన జాబితాలో ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "జియో పేమెంట్ బ్యాంక్ సేవలు ఆరంభం". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 4 April 2018.
  2. "ఈ సారి పేమెంట్ బ్యాంకులను టార్గెట్ చేసిన జియో,". telugu.gizbot.com. Retrieved 4 April 2018.