జీ.వీ.ఎల్. నరసింహారావు

గుంటుపల్లి వెంకట నరసింహరావు భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2018లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

జి.వి.ఎల్. నరసింహారావు

పదవీ కాలం
2018 - 2 ఏప్రిల్ 2024
ముందు ప్రమోద్ తివారీ
తరువాత సంజయ్ సేథ్
నియోజకవర్గం ఉత్తరప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం 1964 జులై 5
బల్లికురవ, ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు జి.వెంకటేశ్వర రావు, చౌడేశ్వరి
జీవిత భాగస్వామి మైధిలి రావు
సంతానం 2
నివాసం వసంత్ కుంజ్, న్యూఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

జి.వి.ఎల్. నరసింహారావు భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. అతనికి ఎన్నికల సర్వేలు నిర్వహించడంలో, వ్యూహరచనలో ప్రావీణ్యం ఉంది. జి.వి.ఎల్ 2014లో లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ స్ట్రాటజికల్ టీంలో పని చేశాడు.[2] బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.[3] జి.వి.ఎల్. నరసింహారావు సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడిగా, జనవరి 2022లో పొగాకు బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు మార్చు

  1. Sakshi (12 March 2018). "రాజ్యసభ బరిలో జీవీఎల్‌". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
  2. Andhra Jyothy (20 February 2020). "రాజ్యసభ బరిలో 2 రాష్ట్రాల బీజేపీ నేతలు!". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
  3. Eenadu (14 January 2022). "పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్‌ నరసింహారావు నియామకం". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.