జోరం నేషనలిస్ట్ పార్టీ

భారతదేశ రాజకీయ పార్టీ

జోరం నేషనలిస్ట్ పార్టీ అనేది మిజోరంలోని రాజకీయ పార్టీ. పార్టీని గతంలో మిజో నేషనల్ ఫ్రంట్ (నేషనలిస్ట్) అని పిలిచేవారు. దీనిని మాజీ ఎంపీ లాల్దుహోమ స్థాపించాడు. మిజో నేషనల్ ఫ్రంట్‌లో చీలిక ద్వారా 1997లో ఈ పార్టీ ఏర్పడింది.

జోరం నేషనలిస్ట్ పార్టీ
స్థాపన తేదీ1997
ప్రధాన కార్యాలయంట్రెజరీ స్క్వేర్, ఐజ్వాల్, మిజోరం
ఈసిఐ హోదారాష్ట్ర పార్టీ
కూటమి
Election symbol

పార్టీ 2003, 2008 రాష్ట్ర ఎన్నికలలో రాష్ట్ర అసెంబ్లీలో రెండు స్థానాలను గెలుచుకుంది. 2018లో, ఇది వివిధ ప్రాంతీయ పార్టీలతో కలిసి జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ గా ఏర్పడింది, కానీ 2020లో కూటమి నుండి నిష్క్రమించింది.

జోరం నేషనలిస్ట్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్‌తో పొత్తు పెట్టుకుంది. ఎన్.డి.ఎ. భాగస్వామి, అధికార పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్‌కి వ్యతిరేకంగా "మిజోరం సెక్యులర్ అలయన్స్" గా ఏర్పడింది.[1][2][3]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "No merger of ZNP in ZPM according to ECI's official report, dated 23 may 2023". EastMojo (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-20. Retrieved 2023-05-18.
  2. "INC formed alliance with ZNP and MPC in Mizoram". 17 August 2023.
  3. "Regional parties joined hand with Congress in Mizoram". 18 August 2023.

బాహ్య లింకులు

మార్చు
  • జోరం నేషనలిస్ట్ పార్టీ అధికారిక వెబ్‌సైట్ - [1]