తాలిపేరు నది గోదావరి నదికి ఉపనది. ఇది చత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలో పుట్టి, ఖమ్మం జిల్లాలో చర్ల మండలంలో తెలంగాణలో ప్రవేశించి, చర్ల వద్ద గోదావరిలో కలుస్తుంది. ఇది గోదావరికి ఎడమ వైపున ప్రవహించే ఉపనది. ఈ నది పరీవాహక ప్రాంతం 31.46 చ.కి.మీ.

ఈ నదిమీద చర్ల మండలం లోని పెద్దమిడిసిలేరు గ్రామం వద్ద తాలిపేరు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయాన్ని తాలిపేరు జలాశయం అనిపిలుస్తారు. దీని నుండి రెండు కాలువలు - కుడి, ఎడమ - సాగునీటిని తీసుకువెళ్తాయి. కుడి కాలువ పొడవు 46.46 కి.మీ. పొడవుండగా, ఎడమ కాలువ 10.44 కి.మీ దూరం ప్రవహిస్తుంది. ఈ కాలువల ద్వారా చర్ల, దుమ్మగూడెం మడలాల్లోని 17 గ్రామాల్లో 24,700 ఎకరాల భూమికి సాగునీరు అందుతోంది.[1]

మూలాలు మార్చు

  1. "TALIPERU PROJECT" (PDF). తెలంగాణ ప్రభుత్వం. Archived (PDF) from the original on 4 జూన్ 2020. Retrieved 4 జూన్ 2020.