తెరలో తెర (నాటకం)


తెరలో తెర కొర్రపాటి గంగాధరరావు రాసిన సాంఘీక నాటకం. మనసులో తెరలులో తెరలు లేకుండా ఉన్నదున్నట్లుగా మనసా, వాచా ప్రవర్తిస్తే ఎటువంటి ఇబ్బందులు రావు అనేది ఈ నాటక కథాశంతో ఈ నాటకం రాయబడింది.[1]

తెరలో తెర
కృతికర్త: కొర్రపాటి గంగాధరరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు, శ్రీ సత్యనారాయణ బుక్ డిపో, రాజమహేంద్రవరం (శ్రీ కొండపల్లి ముద్రాశాల)
విడుదల: ఫిబ్రవరి, 1957
పేజీలు: 114

కథానేపథ్యం మార్చు

కుటుంబంలోని వ్యక్తులందరూ పూర్తిగా వాళ్ళవాళ్ళ అభిలాషలు బైటపెట్టకుండా స్వప్రయోజనాన్ని సాధిద్దామని అనుకుంటుంటారు.

పాత్రలు మార్చు

  1. సుధాకరం (ఒక నాటక రచయిత, సుందరరామయ్య గారి కుటుంబ స్నేహితుడు)
  2. సుందరరామయ్య (సంవన్నడు 55ఏళ్ళు)
  3. మూర్తి (సుందరరామయ్య కొడుకు 22ఏళ్ళు)
  4. లలిత (సుందరరామయ్య కూతురు 19ఏళ్ళు)
  5. రాము (మూర్తి, లలితల స్నేహితుడు 22ఏళ్ళు)
  6. డాక్టరు (సుందరరామయ్య కుటుబం డాక్టరు 24ఏళ్ళు)
  7. సుఖదేవ్ (17ఏళ్ళ పిల్లవాడు)
  8. డ్రైవర్

ఇతర వివరాలు మార్చు

  1. ఈ నాటకం తొలిసారిగా బాపట్లలోని కళావని నాటక సంస్థచే ప్రదర్శించబడింది. ఈ ప్రదర్శనలో గంగాధరరావు, సింగరాజు నాగభూషణం, ఎన్.ఎన్. ప్రసాద్, డా. ఎస్.వి. చలపతిరావు, ఎన్.కె. శర్మ, డి.వి. కృష్ణమార్తి, సరోజిని నటించారు.

మూలాలు మార్చు

  1. మనసు పొరలను విప్పిన తెరలో తెర, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 10 సెప్టెంబరు 2018, పుట.2

ఇతర లంకెలు మార్చు