తెలుగు విద్యార్థి

తెలుగు విద్యార్థి తెలుగు భాషలో ప్రచురించబడుతున్న విద్యా సాంస్కృతిక మాస పత్రిక. ఇది మచిలీపట్నం నుండి 1956 సంవత్సరం నుండి వెలువడి ముఖ్యంగా విద్యార్థుల అవసరాలకు విశిష్టంగా కృషిచేస్తుంది. ఈ పత్రిక సంపాదకులు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు కొల్లూరి కోటేశ్వరరావు. ఈ పత్రిక 2006 సంవత్సరంలో స్వర్ణోత్సవం జరుపుకున్నది. స్వర్ణోత్సవ వేడుకలు మచిలీపట్నంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఘనంగా జరిగాయి.[1]

తెలుగు విద్యార్థి పత్రిక ముఖచిత్రం.

2009 సంవత్సరంలో ప్రశ్నలు - సమాధానాలు శీర్షికను డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి, చిల్డ్రన్స్ సైన్స్ స్టాట్ ను సి.వి.సర్వేశ్వర శర్మ నిర్వహిస్తున్నారు. ఇవి కాక విద్యార్థుల కోసం ఉపయోగకరమైన సమాచారం అందిస్తున్నారు.

మూలాలు మార్చు