నర్సంపేట మండలం
నర్సంపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన మండలం [1].[2] 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం జనాభా 67,239 వారిలో పురుషులు 33,898, స్త్రీలు 33,341 మంది ఉన్నారు. 2016 పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [3] [4] ప్రస్తుతం ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
నర్సంపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°55′35″N 79°53′49″E / 17.926394°N 79.896941°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రం | నర్సంపేట (నర్సంపేట) |
గ్రామాలు | 12 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 59.85% |
- పురుషులు | 72.12% |
- స్త్రీలు | 47.13% |
పిన్కోడ్ | {{{pincode}}} |
పర్యాటకంసవరించు
వరంగల్ జిల్లాలో నర్సంపేట్ డివిజన్ లోనే పర్యాటకం ప్రధానంగా ఉంది. నర్సంపేట్ టౌన్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో పాకాల సరస్సు, అభయారణ్యం ఉంది. పాకాల అందచందాలు చూసేందుకు రెండు కన్నులు చాలవు. ప్రపంచంలోనే 8వ, భారతదేశంలో 2వ కాలుష్య రహిత సరస్సు పాకాల. తెలంగాణ రాష్త్ర ప్రభుత్వం ఇటీవల బోటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. పాకాల సరస్సు కారణంగా నర్సంపేట్ ప్రాంతాన్ని ధాణ్యాగారంగా పిలుస్తారు. పాకాల సరస్సు ఆయకట్టు సూమారు 30వేలు ఎకరాలు. నిత్యం వందలాది మంది పర్యాటకులతో పాఖాల ఎప్పుడు కిక్కిరిసిపోతుంది. పాకాల అభయారణ్యం విస్తీర్ణం సుమారు 830చ.కి.మీ. ఉంది. అంటే ఇటు నర్సంపేట్ (వరంగల్ రూరల్) జిల్లాతో పాటు మహబూబబాద్, భద్రాద్రికొత్తగూడ జిల్లాల్లో కూడ ఉంది. అదే విదంగా మాధన్నపేట చెరువు కూడ ఈ ప్రాంతానికి ఆదరువే. ఈ చెరువు కింద 10వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మాధన్నపేట చెరువును తెలంగాణ సర్కారు మిని ట్యాంక్ బండ్ గా గుర్తించింది. ఇప్పటికే పనులను కూడ ప్రారంభించారు. నర్సంపేట్-వరంగల్ రహదారి పై కొమ్మాల దేవస్థానం ఉంది. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరారు. ఈ ఆలయం గీసుకొండ మండల పరిధిలోకి వెళ్ళినప్పటికిని నర్సంపేట్ డివిజన్ కు చెందిన భక్తులకి రెండవ పెద్ద దేవాలయంగా ఉంటుంది.
రవాణా వ్యవస్థసవరించు
నర్సంపేట్ నుండి అనేక ప్రాంతాలకి రోడ్డు మార్గం ఉంది. వరంగల్ 36 కి.మీ, హైదరాబాద్ 185 కి.మీ దూరంలో ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు
- కమ్మపల్లి
- భాంజీపేట్
- ఇటికలపల్లి
- ముత్తోజీపేట్
- మాదన్నపేట్
- రామవరం
- లక్నేపల్లి
- మహేశ్వరం
- నర్సంపేట
- పస్పునూర్
- సర్వాపూర్
- రాజుపేట్
- మక్దూంపురం
- గురిజాల
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-09. Retrieved 2018-01-14.
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.