నారాయణపేట పురపాలకసంఘం

నారాయణపేట జిల్లాకు చెందిన పురపాలకసంఘం

నారాయణపేట పురపాలకసంఘం, 2019 ఫిబ్రవరి 17 న ఏర్పడిన నారాయణపేట జిల్లాకు చెందిన పురపాలక సంఘం.గతంలో ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండేది. మహబూబ్‌నగర్ జిల్లాలో మొట్టమొదటగా అవతరించింది. ఈ పురపాలక సంఘం తెలంగాణలోనే హైదరాబాదు తర్వాత రెండవ పురాతన పురపాలక సంఘంగా ఘనతకెక్కింది. 1947లో అవతరించిన ఈ పురపాలక సంఘానికి సమరయోధుడిగా ప్రసిద్ధి చెందిన రామచందర్ రావు కళ్యాణి తొలి చైర్మెన్ గా వ్యవహరించగా ఇప్పటివరకు 10 మంది ఈ విధులను నిర్వహించారు.ప్రస్తుతం ఇది మూడవశ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతుంది. 2014 మార్చి నాటికి ఈ పురపాలక సంఘం పరిధిలో 33 వార్డులు, 48825 ఓటర్లు కలరు. 2014 మార్చి 30న జరగబోయే ఎన్నికలకై చైర్మెన్ స్థానాన్ని బీసి (మహిళ) కు కేటాయించారు.

జనాభా వివరాలు మార్చు

ఈ పురపాలక సంఘం పరిధి 11.87 చకిమీ. 2001 ప్రకారం జనాభా 37,563 ఉండగా, 2011 నాటికి 41,539కు పెరిగింది. 2010-11 నాటికి ఈ పురపాలక సంఘం ఆదాయం 19.5, వ్యయము 19.27 కోట్ల రూపాయలు.

సదుపాయాలు మార్చు

పురపాలక సంఘం పరిధిలో సుమారు 3400 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 67 కిమీ పొడవైన రహదారులు, 71 కిమీపొడవైన మురికి కాల్వలు, ఒక పార్కు, ఒక మార్కెట్, ఒక వధశాల, 11 కమ్యూనిటి భవనాలు ఉన్నాయి.

ఆదాయ వనరులు మార్చు

పురపాలక సంఘానికి ఇంటిపన్ను, నీటిపన్ను, అనుమతి ఫీజు ప్రధాన ఆదాయవనరులు. పురపాలక సంఘం నిర్మించిన 98 దుకాణాల ద్వారా వచ్చే ఆదాయము, ప్రభుత్వం నుంచి వచ్చే పలు గ్రాంటుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

2005 ఎన్నికలు మార్చు

2005లో నిర్వహించిన పురపాలక సంఘం ఎన్నికలలో చైర్-పర్సన్‌గా వై.శశికళ, వైస్-చైర్‌పర్సన్‌గా శిల్లా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు.

2020 ఎన్నికలు మార్చు

2020లో నిర్వహించిన పురపాలక సంఘం ఎన్నికలలో చైర్-పర్సన్‌గా అనసూయ, వైస్-చైర్‌పర్సన్‌గా హరినారాయణ్ బట్టడ్‌ ఎన్నికయ్యారు.[1][2]

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 22 March 2021.
  2. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 22 March 2021.

బయటి లింకులు మార్చు