నిర్మల్ వర్మ
నిర్మల్ వర్మ ప్రఖ్యాత హిందీ రచయిత. ఇతను ప్రఖ్యాత నవలా రచయిత, రచయిత, అనువాదకుడు. 1999లో ప్రతిష్ఠాత్మక జ్ఞాన్ పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. హిందీ సాహిత్యపు యొక్క నాయ్ కహానీ (న్యూ స్టోరీ) సాహిత్య ఉద్యమంలో మార్గదర్శకులలో ఒకరిగా ఇతను గుర్తింపు పొందాడు. దీనిలో ఇతని మొదటి కథ సంకలనం పరిందే (బర్డ్స్) .[1]
నిర్మల్ వర్మ | |
---|---|
![]() | |
పుట్టిన తేదీ, స్థలం | సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం. | 1929 ఏప్రిల్ 3
మరణం | 2005 అక్టోబరు 25 న్యూఢిల్లీ | (వయసు 76)
వృత్తి | నవలా రచయిత, రచయిత , అనువాదకుడు |
ఈయన రచన ప్రస్థానం ఐదు దశాబ్దాల పౌ కొనసాగింది. ఇందులో సాహిత్యానికి సంబంధించి, కథ సంపుటాలకు సంబంధించి రచించారు. ఈయన ఐదు నవలలు, ఎనిమిది చిన్న కథలు, తొమ్మిది నాన్ ఫిక్షన్ కి సంబంధించిన రచనను రచించారు. ఇవే కాకుండా వ్యాసారూప కథలు కూడా రచించారు.[2]
తొలినాళ్ళ జీవితంసవరించు
ఈయన 1929 ఏప్రిల్ 3 న షిమ్లాలో జన్మించాడు ఇతని తండ్రి బ్రిటీష్ భారత ప్రభుత్వ సివిల్ అండ్ సర్వీసెస్ విభాగంలో అధికారిగా పనిచేశాడు. ఎనిమిది మంది సంతానంలో ఈయన ఏడవవాడు. అతని సోదరుడు రామ్ కుమార్ భారతదేశపు గొప్ప కళాకారులలో ఒకరు. ఇతని భార్య గగన్ గిల్. ఈయన 1950 ప్రారంభంలో విద్యార్థుల మ్యాగజైన్ పేరుతొ తన మొదటి కథను వ్రాశాడు. ఈయన ఢిల్లీ విశ్వవిద్యాలయములోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసాడు. ఆ తరువాత ఢిల్లీలో పలు సాహిత్య పత్రికలకు సాహిత్య పరమైన రచనలు రచించారు.
ఈయన తన విద్యార్థి దశ నుంచే క్రియాశీల ఆలోచనలలో ముందుడేవాడు. ఈయన 1947-48లో, క్రమం తప్పకుండా ఢిల్లీలోని మహాత్మా గాంధీజీలో నిర్వహించే ఉదయం ప్రార్థన సమావేశాలకు హాజరయ్యేవాడు. అదేకాకుండా, ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో సభ్యునిగా ఉండేవాడు. కానీ, 1956 లో సోవియట్ హంగరీను ఆక్రమించిన తరువాత ఈయన రాజీనామా చేశాడు. అప్పటి నుంచి ఈయన చైతన్యవంతమైన రచనలతో ప్రజానీకాన్ని ఆకట్టుకునేవాడు.
ఈయన పది సంవత్సరాల పాటు పరాగ్వే దేశంలో ఉన్నాడు. అక్కడ ఆయన ఓరేంటల్ ఇన్స్టిట్యూట్లోని చెక్ రచయితలు అయినటువంటి కారెల్ కాపెక్, మిలన్ కుందేర, బోహూమిల్ హరాల్ వారిని తమ రచనలను హిందీలోకి అనువాదించాల్సిందిగా ఆహ్వానించారు. ఇతను చెక్ భాష నేర్చుకున్నాడు. అదేవిదంగా ఆ దేశంలో వాతావరణ మార్పుల కారణంగా 1968 లో స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఈయన తొమ్మిది ప్రపంచ క్లాసిక్లను హిందీలోకి అనువదించాడు.
పరాగ్వే దేశంలో ఉన్న సమయంలో ఈయన ఐరోపా దేశాలను కూడా పర్యటించాడు. ఈ క్రమంలో ఈయన చీరోన్ పార్ చాందిని (1962), హర్ష్ బార్ష్ మెయిన్ (1970), డుండ్ సే ఉత్తన్న్ వంటి రచనలు రచించాడు.
1980-83 లో నిరలా సృజనాత్మక రచన విభాగంలో చైర్మన్ గా వ్యవహరించాడు . 1988-90లో షిమ్లాలోని యశ్పాల్ క్రియేటివ్ రైటింగ్ సహా దర్శకుడిగా వ్యవహరించిన మాయ దర్పన్ (1972) చలన చిత్రం ఉత్తమ చిత్రంగా ఫీలింఫేయిర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకుంది.
ఈయన తన సహచరులైన మోహన్ రాకేష్, భీష్ం సాహిని, కమలేశ్వర్, అమర్ కాంత్, రాజేంద్ర యాదవ్ కలిసి హిందీ సాహిత్యంలో నాయి కహాని అనే సంస్థను స్థాపించాడు .
పురస్కారాలుసవరించు
- 1999 లో జ్ఞానపీఠ్ పురస్కారం.
- 1985 లో సాహిత్య అకాడెమీ పురస్కారం- 'కవవ్ ఔర్ కల్ పాని'
- 2002 లో పద్మ భూషణ్
- 1991 లో జ్ఞానపీఠ్ ట్రస్ట్ యొక్క "ముర్దదేవి అవార్డు"
- 2005 లో ఫ్రాన్స్ దేశానికి చెందిన చెవాలియర్ డి ఎల్ ఆర్కెర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్ట్రెస్ పురస్కారం.
రచనలుసవరించు
నవలలుసవరించు
- 'పరేంద్' (పక్షులు) - (1959)
- జల్టి ఝరి - (1965)
- లండన్ కి రాట్
- పిచ్లి గార్మీయోన్ మెయిన్ - (1968)
- అకాల పర్యటన
- 'దత్ ఇచ్ ఊదర్' '
- బీచ్ బాహాస్ మెయిన్ - (1973)
- మేరీ ప్రియా కహేనియన్ - (1973)
- ప్రతిని కహానియన్ - (1988)
- కవ్వ ఔర్ కాలా పాని - (1983)
- సుఖ ఔర్ అన్య కహనియన్ - (1995).
- ధగే - (2003)
కథా సంపుటాలుసవరించు
- చీరోన్ పర్ చాందిని
- హర్ష్ బార్ష్ మెయిన్ (1989)
నాటకాలుసవరించు
- తీన్ ఏకంత్ (1976)
వ్యాసరూప రచనలుసవరించు
- షబ్డా ఔర్ స్మ్రితి (1976) - సాహిత్య వ్యాసం
- కాళా కా జోకిమ (1981) - 20 వ శతాబ్దంలో ఇండిక్ ఆర్ట్స్ పరిశోధన
- దుంధ శ సే ఉతాటి ధన్ - హిందీ సాహిత్యం . - సాహిత్య విమర్శ
- ధాలన్ సే ఉటరేట్ హుయే - సాహిత్య విమర్శ
- భారత్ ఔర్ యూరోప్: ప్రతిష్ఠుతి కే క్షేత్ర (1991) - వ్యాసం
మరణంసవరించు
ఈయన అక్టోబర్ 25, 2005 న న్యూఢిల్లీలో మరణించాడు.
మూలాలుసవరించు
- ↑ Ode to Nirmal Verma Archived 2006-11-07 at the Wayback Machine The Hindu, 6 November 2005.
- ↑ AUTHOR SPEAKS:"I cater to several layers of sensibilities" The Tribune, 10 March 2002.