నౌకా చరితము త్యాగరాజ విరచితం. ఇందులో శ్రీకృష్ణునితో గోపికలు యమునా నదిని దాటు వృత్తాంతము వర్ణించబడి ఉంది. గోపికల ద్వారా శ్రీకృష్ణుడు పరిహసించబడటం, తరువాత అందరు కలిసి నౌకా ప్రయాణం చేయటం, కృష్ణుడు మాయ ద్వారా కల్లోలం సృష్టించడం, తరువాత గోపికలు వారి వస్త్రాలతో నౌకకు గల రంధ్రాలను మూయుట వర్ణించబడ్డాయి.

21 కృతులలో, 13 రాగములలో వేరు వేరు తాళములలో త్యాగరాజు ఈ నృత్య రూపకాన్ని తీర్చిదిద్దారు.