పందిళ్ళపల్లి (బేస్తవారిపేట)
పందిళ్ళపల్లి ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | బేస్తవారిపేట మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
Area code | +91 ( | )
పిన్కోడ్ |
గ్రామ పంచాయతీ మార్చు
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కర్నాటి మోహనరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు.
విద్యా సౌకర్యాలు మార్చు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల- ఈ పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి చదివిన కప్పల రాజకుమారి, చిలకల శరణ్య అను విద్యార్థినులు, 10వ తరగతిలో విశేష ప్రతిభ కనబరచి, ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ప్రతిభా పురస్కారం అందుకున్నారు.
మహాత్మాగాంధీ ఎయిడెడ్ పాఠశాల - ఈ పాఠశాల పందిళ్ళపల్లిలోని ఎస్.సి.కాలనీలో ఉంది.
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల - ఈ పాఠశాల గ్రామం లోని పంచాయతీ కార్యాలయం దగ్గర ఉంది. ఇందులో ఆనంద లహరి అభ్యసనం ద్వారా బోధన జరుగుతుంది. ఈ విధమైన అభ్యసన బెస్తవారిపేట మండలంలో రెండు పాఠశాలలో మాత్రమే జరుగుతుంది. అందులో ఈ పాఠశాల ఒకటి.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు
- శ్రీ కోదండరామస్వామివారి ఆలయం
- శ్రీ ఉగ్ర ఆంజనేయస్వామివారి ఆలయం - ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవం (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. ఉదయం అభిషేకం, ఆకుపూజలు, అర్చనలు నిర్వహించెదరు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో, రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శనలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేయుదురు.
గ్రామ విశేషాలు మార్చు
ఈ గ్రామాభివృద్ధికి హోథ్స్ సంస్థవారు తమ అంగీకారాన్ని తెలియజేసినారు.
పందిళ్ళపల్లి టోల్ ప్లాజా మార్చు
పందిళ్ళపల్లి పల్లె గ్రామ బస్ స్టాండ్ వద్ద ఒక టోల్ ప్లాజా నిర్మాణానికై 2020, నవంబరు-10న శంకుస్థాపన నిర్వహించారు.