పప్పు చెక్కలు ఒక దక్షిణ భారతదేశ వంటకము. ముఖ్యంగా ఇది ఒక పిండివంట

పప్పు చెక్కలు
మూలము
మూలస్థానంఆంధ్రప్రదేశ్
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు బియ్యం పిండి, పుట్నాల పప్పు

కావలసిన పదార్థాలు మార్చు

  • బియ్యప్పిండి: కిలో
  • పుట్నాలపప్పు: 100 గ్రాములు
  • పచ్చిసెనగపప్పు: 100 గ్రాములు
  • పెసరపప్పు: 100 గ్రాములు
  • కారం: 3 టీస్పూన్లు
  • ఉప్పు: 2 టీస్పూన్లు
  • వెన్న: నిమ్మకాయంత
  • నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం మార్చు

  1. పచ్చిసెనగపప్పు, పెసరపప్పు రెండుగంటలపాటు నానబెట్టాలి.
  2. పుట్నాలపప్పు మెత్తని పొడిలా చేయాలి.
  3. ఓ వెడల్పాటి బేసిన్‌లో బియ్యప్పిండి, నానబెట్టిన పప్పులు, జీడిపప్పుముక్కలు, ఉప్పు, కారం, పుట్నాలపప్పులపొడి, వెన్న అన్నీ వేసి కలపాలి.
  4. తరువాత తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేసి నిమ్మకాయసైజు ఉండలుగా చేసుకుని ప్లాస్టిక్ కాగితంమీద నూనె లేదా నెయ్యి రాసి గుండ్రని బిళ్లలుగా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.