పరమేశ్వరన్ అయ్యర్

పరమేశ్వరన్ అయ్యర్ (ఆంగ్లం: Parameswaran Iyer) నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌(CEO).[1] భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడిన వ్యవస్థ నీతి ఆయోగ్.[2] ఆయన 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2009లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొంది ప్రపంచ బ్యాంకులో చేరారు.[3] అక్కడ వాటర్ గ్లోబల్ ప్రాక్టీస్‌లో వ్యూహాత్మక కార్యక్రమాలకు గ్లోబల్ లీడ్‌గా పనిచేశాడు.[4] 2014లో భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్, దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య ప్రచారానికి నాయకత్వం వహించాడు.[5][6] స్వచ్ఛ్ భారత్ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో పరమేశ్వరన్ అయ్యర్ కృషి ప్రశంసలందుకుంది.[7]

పరమేశ్వరన్ అయ్యర్
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)
నీతి ఆయోగ్‌ (NITI Aayog) సీఈఓ
అంతకు ముందు వారుఅమితాబ్ కాంత్
వ్యక్తిగత వివరాలు
జననం (1959-04-16) 1959 ఏప్రిల్ 16 (వయసు 65)
శ్రీనగర్
జాతీయతభారతీయుడు
కళాశాలది డూన్ స్కూల్
సెయింట్. స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ
వృత్తిసివిల్ సర్వెంట్
Known forస్వచ్ఛ భారత్ మిషన్ కి నాయకత్వం వహించడం

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

శ్రీనగర్‌లో 1959 ఏప్రిల్ 16న పరమేశ్వరన్ అయ్యర్ జన్మించాడు. అతని తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి.[8] ఆయన డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఆపై ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదివాడు.[9] సెయింట్ స్టీఫెన్స్ కళాశాల విద్యార్థిగా అతను టెన్నిస్‌లో జరిగిన జూనియర్ డేవిస్ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను నార్త్ కరోలినాలోని డేవిడ్‌సన్ కాలేజీలో ఒక సంవత్సరం ఎక్స్ఛేంజ్ స్కాలర్‌షిప్ పొందాడు.[10]

కెరీర్ మార్చు

1981లో ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో పరమేశ్వరన్ అయ్యర్ చేరారు. 2009లో ప్రపంచ బ్యాంకులో నీటి వనరుల మేనేజర్‌గా పని చేసేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ప్రపంచ బ్యాంకు విధుల కోసం వియత్నాం, చైనా, ఈజిప్ట్, లెబనాన్, వాషింగ్టన్‌లలో పనిచేశాడు.[11] ఆ తరువాత 2016లో భారత ప్రభుత్వంలోని డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మంత్రిత్వ శాఖలో చేరారు. అతను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో కాలమిస్ట్‌గా ఉన్నారు.[12] అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.

గ్రంథసూచిక మార్చు

  • అయ్యర్, పరమేశ్వరన్. మెథడ్ ఇన్ ది మ్యాడ్నెస్. హార్పర్ కోలిన్. ISBN 978-9390327560.[13]
  • అయ్యర్, పరమేశ్వరన్ (2019). ది స్వచ్ఛ్ భారత్ రివల్యూషన్: ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ఇండియా బిహేవియరల్ ట్రాన్స్ఫర్మేషన్. హార్పర్ కోలిన్. ISBN 978-9353572679.[14]

మూలం మార్చు

మూలాలు మార్చు

  1. "NITI Aayog: నీతి ఆయోగ్‌ కొత్త సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌". web.archive.org. 2022-06-25. Archived from the original on 2022-06-25. Retrieved 2022-06-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. DelhiJune 24, India Today Web Desk New; June 24, 2022UPDATED:; Ist, 2022 17:07. "Parameswaran Iyer appointed new CEO of NITI Aayog". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-06-24. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. "Parameswaran Iyer". World Economic Forum.
  4. "Parameswaran Iyer". HarperCollins Publishers India. Retrieved 2022-06-24.
  5. Dhingra, Sanya (January 31, 2021). "Parameswaran Iyer, Modi's IAS man for Swachh Bharat, reveals how the mission was achieved".
  6. "How Swachh Bharat Mission's Parameswaran Iyer Got His Dream Job". www.news18.com. February 26, 2021.
  7. Chitravanshi, Ruchika (July 27, 2020). "Modi's Swachh Bharat man, Param Iyer calls it a day as sanitation secy" – via Business Standard.
  8. Bamzai, Kaveree (October 6, 2019). "Modi's favourite Parameswaran Iyer belongs to the cult of super IAS officers like TN Seshan".
  9. Raj Chengappa (December 20, 2019). "The Swachh Yogi". India Today.
  10. Iyer 2021, p.1
  11. "Parameswaran Iyer | Indian Economy". indianeconomy.columbia.edu.
  12. "Parameswaran Iyer". October 30, 2019.
  13. "Method in the Madness". HarperCollins Publishers India.
  14. "The Swachh Bharat Revolution". HarperCollins Publishers India.