పలనాటి వీర విద్యావంతులు

ఆంధ్ర దేశంలో పలనాడును గురించి, పలనాటి వీరులను గిరించీ వారి వీర చరిత్రను గురుంచి వారి పౌరుషాలను గురించీ తెలియని వారెవరూ లేరు. అది అన్నదమ్ముల మధ్య చెలారేగిన పోరాట గాథ. విశిష్టమైన రెండు మతాల మధ్య చెలరేగిన స్పర్థ. అదే శైవ, వైష్ణవాల మధ్య వచ్చిన సంఘర్షణ, సామాజికి సాంఘిక న్యాయాల మధ్య జరిగిన విప్లవాత్మక పోరాటం. పౌరుషాలకు నిలయం పలనాటి భారతం ఆ వీర గాథల్నీ ప్రచారం చేసే వారే వీర విద్యాంతులు'. ఈ నాటికీ వీర గాధల్ని చెప్పే వీర విద్యావంతులు గుంటూరు జిల్లాలో చెపుతూనే వున్నారు. వీరు గాక వీర శైవ మతానికి చెందిన పిచ్చుకుంటుల వారు, కాటమ రాజు ఖడ్గ తిక్కన కథలు చెప్పే కొమ్మువారు కూడా ఈ వీర కథల్నీ గానం చేస్తున్నారు.; శ్రీనాథుని వీర చరిత్ర: ఎవరు కథలు చెప్పినా అందరూ శ్రీనాథుడు వ్రాసిన పల్నాటి వీర చరిత్రనే ఇరవై అయిదు భాగాలుగా రోజుల తరబడి చెపుతూ వుంటారు. అయితే ఆ వీరుల పౌరుషాలను వల్లిస్తూ చిలువలు పలువలు కల్పించి మరి కొన్ని గాధల్ని కూడ ప్రచారం చేశారు. అలా శ్రీనాథుని చరిత్రను ఆధారం చేసుకుని కొండయ్య కవి మరికొన్ని గాధలను కూడా రచించి ప్రచారంలోకి తెచ్చి నట్లు చెపుతారు. అయితే కొన్నికథలు ఈ నాటికీ కొన్ని కంఠస్థంగా వున్నవీ, తాళపత్ర గ్రంధాలలో వున్నవీ కూడా వున్నాయి. అయితే వీటినన్నిటినీ ఒక చోటుకు చేర్చే ప్రయత్నం జరగక పోయినా, అక్కిరాజు ఉమాకాంతం గారు ప్రథమంలో బాల చంద్రుని కథను ప్రచారంలోకి తీసుక వచ్చారు. ఆతరువాత పింగళి లోక్ష్మీ కాంతం గారు మరికొన్ని గాధల్ని వెలుగు లోకి తెచ్చారు. అలాగే కాటమ రాజు కథల్ని, పరిశోధించిన డా: తంగిరాల సుబ్బా రావు గారు కూడా ఇరవై అయిదు కథల్ని వెలుగు లోకి తెచ్చారు. అలాగే ముదిగొండ వీర భద్ర కవి గారు వీర భారత గ్రంధంలో అనేక గాధల్నీ వర్ణించారు. ఇక మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంధాలయంలో పల్నాటి వీర చరిత్రకు సంబంధించిన వివరాలు కొల్లలుగా దొరుకుతాయి.

కన్నమదాసు వారసులే కథకులు మార్చు

సంప్రదాయంగా ఈ వీర గాధల్ని ప్రచారం చేసేవారు, వీర విద్యా వంతులైన మాల కన్నమ దాసు కులానికి చెందిన వారు చెపుతారు. ఇది వారి పారంపర్య హక్కుగా భావిస్తారుట: బ్రహ్మనాయుడు మాల కన్నమ దాసుని చేరదీసి కుల మత భేదాలు లేవని చాప కూటి సిద్ధాంతాన్ని అమలు పర్చాడు: అందు వల్ల పల్నాటి వీర గాధల్ని ప్రచారం చేయడానికి బ్రహ్మనాయుడు, మాలలే ఆదేశించాడనే కథ ప్రచారంలో వుంది. ప్రచారినికి నిదర్శనం ఈనాటి వీరవిద్యావంతులే. గతించిన చరిత్రలో కాకతీయుల కాలంలో ఓరుగల్లు వీధుల్లో పల్నాటి వీర గాథల్ని చెప్పినట్లూ, వారు పయోగించిన వాయిద్యాలను గురించీ, వాటి ఉధృత ధ్వనులను కూర్చీ క్రీడాభి మారంలో ఉదహరించ బడింది.

వీర పూజతో వీరుల దినోత్సవం మార్చు

పలనాడులో ప్రతి సంవత్సరం కారెంపూడిలో నాగులేటి ఒడ్డున, బాల చంద్రుని గుడి వద్ద వీరుల దినోత్సవం జరుగుతుంది. ఈ వుత్సవానికి పలనాడులో నున్న ప్రజలందరూ తిరునాళ్ళ లాగ తరలి వస్తారు. ఈ వుత్సవం దాదాపు ఇరరై రోలులు జరుగుతుంది. ఈ నాటికీ పలనాటి వంశీకులమని చెప్పుకునే వీర విద్యా వంతులు ఆ వీరుల్ని, ఆ వీర గాథల్నీ తలచుకుని పులకించి పోతారు. వీర పూజ చేస్తారు. సాంబ్రాణి దూపంతో వివిధ వాయిద్యాల ధ్వనులతో హోరు పూనకం తెప్పించుకుని గణా చారులై ఉగ్రులై పోతారు. పొరుషంతో వూగి పోతారు. వారి వారసులుగా దుఖిస్తారు. చివరి రోజున పలనాటి యుద్ధానికి కారకులైన నాగమ్మ పాత్రను వేషంగా ధరింప జేసి కారెంపూడి వీధుల్లో వెంటబడి తరుముతారు. అలా ఊరి బయటి వరకూ తరిమి నాగమ్మ శిగను కత్తరించి నానా తిట్లూ తిట్టి పరాభివస్తారు. అలా వారికున్న కక్షసంతా తీర్చు కుంటారు. వీరుల దినోత్సవం జరిగినంత కాలం ఎక్కడెక్కడి వీర విధ్యావంతులు, కారెమపూడికి తరలివచ్చి, కారెమ పూడిలో కథలు చెపుతారు. నాగావళిలో స్నానం చేసి బాల చంద్రుని గుడి ముందు బాలుడో, చెన్నూడో...... అంటూ అరుస్తూ వారి వారి మొక్కు బడులు తీర్చు కుంటారు. వారి వీరావేశాన్నంతా వివిధ వాయిద్యాల ధ్వనులలో వెల్లడిస్తారు. ఆ సమయంలో ప్రతి వాడు ఒక వీరుడై పోతాడు. ఆ సమయంలో ప్రతి వాడు ఒక వీరుడై పోతాడు. ఉత్సవానికి వచ్చిన ప్రజలందరూ తన్మయులై పోతారు. ఇలా వీర విద్యా వంతులు ఈ నాటికి పలనాటిలో కొనసాగిస్తున్నారు.

వీర విద్యా వంతుల వేష ధారణ మార్చు

పల్నాటికి చెందిన వీర విధ్యావంతులు చెన్నుని దర్శనానికి చెందిన హరిజనులని, పల్నాటి వీర్ఫ కథా చక్తాన్ని పాడతారనీ ఈ పాడంటంలో వీర జోడు (పంబల జోడు) దాని మీద రెండు గంటలు. తిత్తి, తాళం, కత్తి, డాలు ఉపయోగిస్తారని ప్రధాన కథకునితో పాటు ముగ్గురు వంతలు ఉంటారని, ప్రధాన కథకుడు పల్నాటి వీరుడు లాగా వేషం వేసుకుంటాడనీ, ఇతడు పన్నెండు బిరుదులు ధరించాడనే విషయం వుందనీ, డా: తంగిరాల వెంకట సుబ్బా రావు గారు రాష్ట్ర స్తాయి జానపద కళోత్సవాల సంచికలో వివరించాడు. అంతే కాక కాశి కోక, తలగుడ్డ, కలికి తురాయి. వెండి రేకుతో చేయబడిన ఉమ్మాహో పిట్ట, చంద్రవంక, అందె, కత్తి దాలు, వీర జోడు, తిత్తి, తాళం, బొడ్దు గంట, బంజా గుడ్డ, డాలుకు బదులుగా కొందరు పిడి కత్తిని పుచ్చుకుంటారు. దీనిని అమజాల అంటారు.

విలక్షణమైన ఎన్నో హంగులు మార్చు

పెద్ద కత్తిని అడ్డ కత్తి అంటారు. కుడి చేతిలో అడ్డ కత్తి, ఎడమ చేతిలో అమజాల, కుడి కాలికి బిరుదు అందె, పనెండు మూరల తలగుడ్డ, తలగుడ్డలో కలికి తురాయి,కాలికి కుడి ప్రక్క చంద్ర వంక, ఉమ్మాహు పిట్ట, మెడ క్రింద కుడివైపున వున్న రొమ్ముకు తురుమణి అనగా తెలుపు మధ్య ఎరుపు.... ఎడమ వైపున ల్రొమ్మున జంజెం గుడ్డ ..... తెలుపు ఎరుపు రెండు రంగులతో ఏడు మూరలుంటుంది, షరాయి, జంజెము, బొడ్డు గంట, త్రికోణాకారంలో వుండే గుడ్డ, దీని చుట్టూ పూసల మధ్య గంట కట్టబడి వుంటాయి. ఇదీ కథకుని వేషం. ఇలా పన్నెండు బిరుదులు ధరించి కత్తి తిప్పుతూ వీరావేశంతో కథను పాడుతూ వుంటే, నాటి పల్నాటి బాల చంద్రుడు దివి నుండి భువికి దిగివచ్చినట్టుగా వుంటుందట. వంతలో ఒకడు వీర జోడు వాయిస్తాడు. రెండవాడు తిత్తి పడతాడు. మూడవ వాడు తాళం కొడుతూ కొటతాడు. ఈ వీర కథా గానంలో కొంత అభినయం, నాట్యం మిళితమై నడుస్తాయి. కథకుడూ, వంతలూ, అందరూ నిలబడే పాడతారు. పల్నాటి వీర కథలని రాత్రి వేళ వెన్నెల్లో పాడతారే గానీ, దీప కాంతిని ఉపయోగించరట. ఈ ఆచారం ఎందుకు వచ్చిందో తెలియదంటారు డా: తంగిరాల వారు.

ఉత్తేజకర ప్రదర్శనం మార్చు

వీర గాథల్ని వీర విద్యాంతులు అనర్గళగా చూపుతారు. కాథా ప్రారంభంలో కుల దైవమైన మాచర్ల చెన్న కేశవుని ప్రార్థిస్తారు. ఆ తరువాత కథలో వచ్చే వీరులందర్నీ, పేరు పేరునా స్మరిస్తారు. ముఖ్యంగా అంకాళమ్మనూ' ప్రార్థిస్తారు. వీర గాథల్నీ వీర రస ప్రధానమైనవి. కథకులు వీరావేశ పరులైన ప్రేక్షకుల్ని ఉర్రూత లూగిస్తారు. యుద్ధ రంగ భట్టాలలో భయానక బీభత్స రసాలు ఎంతో ప్రాముఖ్యాన్ని వహిస్తాయి. కథకుడు కథా సన్నివేశాలలో పలనాటి పౌరుల పౌరుషాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తాడు. ముఖ్యంగా సాత్విక అంగికాభి నయాలతో సన్ని వేశాన్ని బట్టి నృత్యాన్ని కూడా అభినయిస్తారు. రంగ స్థలాన్నంతా దద్దరిల చేస్తారు. వీర విద్యావంతులు రాష్ట్రంలో మొక చోట ఎక్కడా కనిపించరు. స్థానిక గాథలకే పరిమితమైన కళా రూపమిది. ఈ నాటు వారి వారి ఆర్థిక పరిస్థుల ననుసరించి సాంప్రదాయక మైన వేష ధారణతో కథలు చెప్పలేక పోతున్నారు. నానాటికీ వీర విద్యావంతుల కళ హీన స్థితిలో పడి పోతూ ఉంది. దానిని పునరుద్ధరించాల్సిన అవశ్యకత ఎంతో ఉంది.

మూలాలు మార్చు