పార్వతీపురం రెవెన్యూ డివిజను

పార్వతీపురం రెవెన్యూ డివిజను, విజయనగరం జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 15 మండలాలు ఉన్నాయి. విజయనగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.ఈ రెవెన్యూ డివిజను పరిధిలో 923 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1][1]

శ్రీకాకుళం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం
ప్రధాన కార్యాలయంవిజయనగరం
మండలాల సంఖ్య15

పరిపాలన మార్చు

పార్వతీపురం రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలన పరిధిలో 15 మండలాలు ఉన్నాయి. విజయనగరం పట్ణణం డివిజను కేంద్రంగా ఉంది.రెవెన్యూ విభాగానికి రెవెన్యూ డివిజినల్ అధికారి అధిపతిగా వ్యవహరిస్తాడు.ఇతను ఐ.ఎ.ఎస్. లేక డిప్యూటీ కలెక్టర్ హోదాలో సబ్ కలెక్టర్ ర్యాంక్ కలిగి ఉంటాడు.ఇతనికి పరిపాలనలో, తహసిల్దారు హోదా కలిగిన ఒక పరిపాలనాధికారి సహకరిస్తాడు. ప్రస్తుత రెవెన్యూ డివిజనల్ అధికారి జె.వెంకటరావు పనిచేస్తున్నాడు.[2]

రెవెన్యూ డివిజను లోని మండలాలు మార్చు

  1. పార్వతీపురం మండలం - 84
  2. కొమరాడ మండలం - 91
  3. గరుగుబిల్లి మండలం - 31
  4. జియ్యమ్మవలస మండలం - 54
  5. కురుపాం మండలం - 89
  6. గుమ్మలక్ష్మీపురం మండలం - 113
  7. బాడంగి మండలం - 26
  8. తెర్లాం మండలం - 46
  9. సాలూరు మండలం - 113
  10. పాచిపెంట మండలం - 50
  11. మక్కువ మండలం - 48
  12. రామభద్రపురం మండలం - 30
  13. బొబ్బిలి మండలం - 76
  14. సీతానగరం మండలం - 41
  15. బలిజిపేట మండలం - 31[3]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 https://www.censusindia.gov.in/2011census/dchb/2812_PART_B_DCHB_VIZIANAGARAM.pdf
  2. "Officials gearing up for coop. polls". Deccan Chronicle. 4 January 2013. Retrieved 16 March 2016.
  3. https://vizianagaram.ap.gov.in/mandal-wise-villages/

వెలుపలి లంకెలు మార్చు