పాశిం సునీల్ కుమార్

పాశిం సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో గూడూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

పాశిం సునీల్ కుమార్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
నియోజకవర్గం గూడూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1969 జులై 6
అశోక్ నగర్, గూడూరు పట్టణం, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు పెంచలయ్య, సరోజనమ్మ
జీవిత భాగస్వామి సంధ్యారాణి
సంతానం జస్వంత్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

పాశిం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గూడూరు పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలిచి 1999 నుండి 2000 వరకు మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశాడు. ఆయన 1997లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుండి ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

పాశిం సునీల్ కుమార్ 2004, 2009 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి దక్కకపోవడంతో ఆయన 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం 2016లో తెలుగుదేశం పార్టీలో చేరి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు మార్చు

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Eenadu (2019). "తొలి జాబితాలో ఆరుగురికి చోటు". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.