దొంగతనం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 19:
పోలీసులు దొంగలను పట్టుకోలేక, పెరుగుతున్న కేసులను అదుపు చేయడంలో విఫలమై... సంఖ్య తగ్గించేందుకు కొన్ని ఫిర్యాదులను కేసులుగా నమోదు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకొన్ని సందర్భాల్లో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వారితో 'అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా... ఊరెళ్లినప్పుడు పక్కింటి వారికి చెప్పాలి కదా... మాకైనా సమాచారం ఇవ్వవచ్చు కదా.. నిజంగానే దొంగతనం జరిగిందా... వస్తువులు పోవడం వాస్తవమేనా' అంటూ గద్దిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. పోయిన సొత్తు పది తులాలైతే అయిదు తులాలుగానే కేసు కడుతున్నారన్న ఫిర్యాదులూ ఉన్నాయి.
ఓ స్టేషన్ పరిధిలో దొంగతనం జరిగితే మరో స్టేషన్ అధికారి గుంభనంగా ఉంటున్నారు. ప్రతి స్టేషన్లో, సర్కిల్ పరిధిలో ప్రత్యేకంగా క్రైం పార్టీలు ఉన్నా దొంగతనాల నిరోధంలో వారి పాత్ర కనిపించడం లేదు. సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) ఉన్నా... శాంతిభద్రతల విభాగంతో సమన్వయం కొరవడుతోంది. సీసీఎస్ సిబ్బంది నిందితులను పట్టుకుని శాంతి భద్రతల వారికి అప్పిగిస్తున్నారు. శ్రమ తమదైతే... పేరు సీసీఎస్కు వస్తుందన్న భావన శాంతిభద్రతల పోలీసుల్లో నెలకొంటోంది. క్రైం పార్టీ పోలీసులు నేరాన్వేషణలో కొన్ని ఖర్చులు పెడతారు... వివరాలు రాబట్టేందుకు నిందితులను అరెస్టు చూపకుండా ఉన్నన్ని రోజులు వారికి భోజనాలు, ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. వీటి కోసం శాఖాపరంగా కేటాయింపులు లేకపోవడంతో సీసీఎస్ సిబ్బంది చేతి చమురు వదులుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల వారిలో క్రమేణా నిర్లిప్తత చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఈగల్ మొబైల్ అని ఒక దళాన్ని ఏర్పాటు చేసినప్పటికీ దాని వల్ల హడావుడి తప్ప ఉపయోగం కానరావడం లేదు.గాంధీ జయంతి సందర్భంగా పలువురు ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి జైళ్ల నుంచి విడుదల చేశారు. యాదృచ్ఛికమో... వాస్తవమో కానీ అప్పటి నుంచే దొంగతనాలు జోరందుకున్నాయన్న భావనలు వ్యక్తమవుతున్నాయి.(ఈనాడు 25.11.2009)
==చరిత్రలో దొంగల ప్రస్తావన==
ఈ దొంగలు, దొంగ తనము అనేవి అతి ప్రాచీన కాలం నుండి వున్నది. వాటి నివారణకు ఆకాలంలో సామాజికంగా అనేక చర్యలు తీసుకున్నారు. దొంగతనం చేస్తే పలాన శిక్ష నరక లోకంలో విధిస్తారని గ్రంధాలలో వ్రాశారు. రాజుల పరిపాలన కాలంలో కూడ పలాన దొంగ తనానిని పలాన శిక్ష విధించాలని కూడ చట్టాలు చేసి అమలు పరచ బడింది. చారిత్రికంగా [[పిండారీలు]]/ [[థగ్గులు]] అనే ఒక జాతి వారు తమ ప్రధాన వృత్తిగా [[దొంగతనాన్ని ఎంచుకున్నారు]] వారిని అణచి వేయడానికి ఆ యా రాజ్య పాలకులు ఎంతగానో కృషి చేశారు.
== ఏంచెయ్యాలి? ==
* దొంగలను పట్టుకునేందుకు, దొంగతనాల నిరోధానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి.
|