ఎ.ఆర్.కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1992 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
కొన్ని లింకులు
పంక్తి 1:
'''ఎ.ఆర్.కృష్ణ''' ప్రముఖ నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. 1954లో హైదరాబాదులో[[హైదరాబాదు]]లో ఆంధ్ర ప్రదేశ్ నాట్య సంఘాన్ని స్థాపించి రాష్ట్రంలో నాటకాల అభివృద్ధికి విశేష కృషిచేశాడు<ref>[http://dspace.vidyanidhi.org.in:8080/dspace/bitstream/2009/1111/5/UOH-2003-194-4.pdf Telugu Theatre: Politics Of Representation]</ref>. ఆధునిక తెలుగు సామాజిక నాటకానికి కృష్ణ ఆద్యునిగా భావిస్తారు.<ref>[http://www.hindu.com/thehindu/fr/2008/11/21/stories/2008112150080200.htm Stage act] - The Hindu 21/11/2008</ref>.
 
 
ఎ.ఆర్.కృష్ణ, 1926 నవంబర్ 13న [[గుంటూరు]] జిల్లా [[పెరవలి]] గ్రామములో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం [[శ్రీకాకుళం]], [[బెజవాడ]], [[చల్లపల్లి]], [[మచిలీపట్నం]] హైదరాబాదులలో జరిగింది. యల్.యం.ఇ చదువుతున్నపుడే [[హైదరాబాదు విమోచనోద్యంలోవిమోచనోద్యమం]]లో పాల్గొన్నాడు. అజ్ఞాతవాసమునుండి బయటకువచ్చి సోషలిస్ట్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. 1948నాటికి రాజకీయ రంగమురంగం మీద వ్యామోహం విడనాడి నాటక రంగములోరంగంలో ప్రవేశించాడు. 1952నాటికి పూర్తిగా నాటక రంగానికి అంకితమై వినూత్నమైన ప్రయోగాలు చేయాలన్న తపన బయలుదేరింది. జీవిక నిమిత్తం రాష్ట్ర విద్యుత్ బోర్డులో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. [[యునెస్కో]] ఆంతర్జాతీయ నాటక సంస్థకు అనుబంధసంస్థగా [[కమలాదేవి ఛటోపాధ్యాయ]] భారతీయ నాట్య సంఘాన్ని స్థాపించాడుస్థాపించారు. ఆమె ప్రోద్బలంతో కృష్ణ 1952లో "ఇండియన్ నేషనల్ థియేటర్" నెలకొల్పాడు. 1953లో "దేశం కోసం" నాటక ప్రదర్శన వెల్లువ సృష్టించాడు. 1955లో ఢిలీలో జరిగిన భారతీయ నాట్యసంఘ సమావేశములో ఉపన్యాసమిచ్చి ఆ సంఘపు సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్, నాటక కళల విభాగానికి సభ్యునిగా పనిచేశాడు<ref>http://www.andhrauniversity.info/arts/theatrearts/index.html</ref>.
 
 
పంక్తి 8:
 
 
1974లో కృష్ణ పట్టుదలతో [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] రచించిన మాలపల్లిని[[మాలపల్లి]]ని, వందమంది కళాకారులు, సహజమైన సెట్టింగులతో నాటకంగా రూపుదిద్ది, ఒకే వేదికపై వరుసగా ముప్పదిసార్లు, భారతదేశమంతటా వందకు పైగా ప్రదర్శనలిచ్చారు. తెలుగువారి జానపద కళా స్వరూపమైన [[తోలుబొమ్మలాట]]ను పునరుద్ధరించి ఆ కళా ఔన్నత్యాన్ని విదేశాలలో చాటాడు. నాట్యకళపట్ల ప్రేక్షకులలో అభిమానం పెంచడానికి, వారి ఆదరణ, పోషణ కల్పించడానికి "నాట్యమిత్ర పధకం" ప్రవేశపెట్టి నాటకాభిమానులను సభ్యులుగా చేర్పించాడు. వృత్తికళాకారుల సంక్షేమానికి 1971లో రంగస్థల కళాకారుల సంఘం స్థాపించాడు. ఔత్సాహిక కళాకారుల శ్రేయస్సుకై వారి సంఘమూ ఏర్పాటుచేయించాడు. యక్షగానానికి[[యక్షగానం|యక్షగానాని]]కి రంగస్థలముపై ప్రాణప్రతిష్ఠ చేసాడు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట.147</ref>.
 
తన ఆశయాల సాధనలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న కృష్ణను భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
"https://te.wikipedia.org/wiki/ఎ.ఆర్.కృష్ణ" నుండి వెలికితీశారు