కాకరపర్తి భావనారాయణ కళాశాల విజయవాడలోని[[విజయవాడ]]లోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉన్నది. ఈ కళాశాల కాకరపర్తి భావనారాయణ గారిచే స్థాపించబడినది. కళాశాల స్థాపనలో ఉసిరిక జగన్మోహన రావు, కొప్పురవూరి సత్యనారాయణ మరియు ఇతరులు పాలుపంచుకున్నారు. 1964 నవంబరు 6వ తేదీన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి మరియు ముఖ్య మంత్రి గారిచే కళాశాల స్థాపనా పనులను ప్రారంభించారు, కళాశాల విస్తీర్ణం దాదాపు 9.6 ఎకరాలు. జూన్ 1965 నుండి కళాశాల పనులను ప్రారంభించారు. కళాశాల 220 విద్యార్ధులతో, 15మంది ఉపాధ్యాయులతో ప్రారంభించబడింది. కళాశాలకు మొదటగా ఎస్. సుందరం గారు ప్రధానోపధ్యాయులుగా పనిచెశారు.