త్రిజట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వికీకరణ |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
'''త్రిజట''', [[రామాయణం]]లో ఒక వృద్ధ రాక్షస స్త్రీ పాత్ర. రావణుడు [[సీత]]ను ఎత్తుకొని పోయి లంకలో బంధించి, ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఈమె ఒకరు. ఈమెకు [[శ్రీరాముడు]] సముద్రము దాటివచ్చినట్లు, [[రావణుడు]] యుద్ధంలో చనిపోయినట్లు [[కల]] వస్తుంది. [[సుందర కాండ]]లో త్రిజట స్వప్న వృత్తాంతం గురించి ఉన్నది. త్రిజట [[విభీషణుడు|విభీషణుని]] కూతురు అని అంటారు గాని ఇది సరి కాదని [[గుంటూరు శేషేంద్ర శర్మ]] వ్రాశాడు. గోవిందరాజీయములో "త్రిజటా విభీషణ పుత్రీ" అన్న పదాలను తప్పుగా విడదీయడం వలన ఈ అర్ధం వచ్చిందని అతని భావన. (త్రిజట, మరియు విభీషణుని కూతురు అని ఇద్దరిని సూచించే వాక్యంగా ఈ శ్లోక భాగాన్ని అర్ధం చేసుకోవాలి - అని రచయిత భావం).
==సుందరకాండలో==
కామాతురుడైన [[రావణుడు]] సీతను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. సీత ఒక
"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత యున్నది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది.
"ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచుండెను.
ఇలా చెప్పి, తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు త్రిజట హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు.
పంక్తి 18:
వారందరూ సీతను [[పుష్పక విమానం]]పై తీసుకొని వెళ్ళి యుద్ధరంగంపైన ఆపారు. దే్హమంతా బాణాలు కప్పివేయగా నేలపైబడియున్న రామలక్ష్మణులను చూచి సీత విలపించసాగింది. అప్పుడు సీతను త్రిజట ఇలా ఊరడించింది-
వైదేహీ! నువ్వు అనవుసరంగా శోకించకు. నీ భర్త విగత జీవుడు కాలేదు. రామలక్ష్మణులు కేవలం వివశులైయున్నారనడానికి నాకు పెక్కు లక్షణాలు కనిపిస్తున్నాయి - వీరి ముఖాలలో ఇంకా కోప చిహ్నాలు కనిపిస్తున్నాయి. నీరి ముఖాలలో ఇంకా కళ తప్పలేదు. సైన్యం చెల్లా చెదురు కాకుండా వారిని
==ప్రస్తావన==
ర|| విభీషణుని కూఁతురు. సీత రావణునిచేత పట్టువడి ఉండు కాలమున ఈమె సీతకు మిగుల ఊఱటమాటలు చెప్పుచు ఉండెను. ఒకప్పుడు రావణుని నాశమునకు సూచకమైన కల ఒకటి కని రాక్షసస్త్రీలు చేయు నిర్బంధములచే మిగుల ఖిన్నురాలై ఉండిన సీతకు ఆస్వప్నవృత్తాంతము చెప్పి శీఘ్రకాలములో రాముఁడు రావణుని నశింపఁజేసి ఆమెను తోడుకొనిపోవును అని ఈమె సమాధాన పఱచెను.
పంక్తి 36:
==వనరులు==
* వాల్మీకి రామాయణం,
* శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము (శ్లోకములు, తాత్పర్యములు) - అనువాదకులు: డాక్టర్ ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వేంకటరామయ్య - ప్రచురణ: గీతా ప్రెస్, గోరఖ్పూర్ (2003)
|