యాజ్ఞసేని: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 4:
 
== ఇతివృత్తం ==
ద్రౌపది దృక్కోణంలోంచి మహాభారతగాథను ఈ నవలలో చిత్రీకరించారు. పలు సందర్భాల్లో ద్రౌపది అనుభవించిన బాధలను, సంతోషాలను, అవమానాలను, సందిగ్ధాలను ఆమె నరేషన్‌లో వివరిస్తూ ఈ నవలకు ఇతివృత్తాన్ని ఏర్పరిచారు రచయిత్రి. వ్యాస భారతాన్ని ఆధారంగా చేసుకుని ఈ నవలను రచించారు. సరళా భారతం(ఒడియా భారతం) ప్రభావం కూడా కొంతవరకూ కనిపించవచ్చని రచయిత్రి పేర్కొన్నారు. ఈ గ్రంథం ద్రౌపది తన జీవితాన్ని గురించి తాను తలచుకోవడంతో ప్రారంభమౌతుంది. ఆపైన తనకూ కృష్ణునికీ ఉన్న ఆత్మికానుబంధాన్ని గురించి, తనకు తన తండ్రి ద్రుపదుడు స్వయంవరం ప్రకటించడంతో మొదలవుతుంది. [[పాండవులు]] ఐదుగురిని పెళ్ళిచేసుకోవడంలో ఆమె అనుభవించిన సంఘర్షణ, ఆపైన వారందరినీ కలిపివుంచే బాధ్యతను స్వీకరించి చేసిన ప్రయత్నాలు వంటివి కొనసాగుతాయి. దుర్యోధన దుశ్శాసనాదుల వల్ల తాను అనుభవించిన ఘోరమైన అవమానం, ఆపై అడవులకు వెళ్ళాల్సిరావడం, అజ్ఞాతంలో ఉండాల్సిరావడం వంటివన్నీ వస్తాయికథను సాగిస్తాయి. చివరకు యుద్ధానికి తానే ముఖ్యకారణం కావడం, కొడుకులను కోల్పోయి చివరకు అశ్వత్థామను వదిలివేయడం కూడా కథలో ద్రౌపది వైపు నుంచి వస్తుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/యాజ్ఞసేని" నుండి వెలికితీశారు