షా అలీ పహిల్వాన్ దర్గా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''షా అలీ పహిల్వాన్ దర్గా ''' మహబూబ్ నగర్ జిల్లాలో ఆలయాల పురంగా...
 
పంక్తి 3:
తెలుగు నేల మీద కాకతీయుల పాలన అంతమొందిన పిదప అలంపూర్ ప్రాంతంలో పఠాన్‌ల ప్రాబల్యం పెరిగిపోయింది. ఈ సందర్భంలోనే చాలా మంది పహిల్వాన్‌లు ముస్లిం సాధువులుగా ఈ ప్రాంతానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో ''షా అలీ పహిల్వాన్ '' కూడా ఒకరు. ఆయన ముందు అలంపూర్ సమీపంలోని [[కర్నూలు]] కు చేరుకుని, అక్కడి నుండి అలంపూర్‌లోని దేవాలయాలపై దండెత్తి, విగ్రహాలను, దేవాలయాలను ధ్వంసం చేశాడు<ref> ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 29</ref>. ఈ తరుణంలో గ్రామస్తులకు, అతనికి మధ్య తీవ్రమైన పోరు జరిగింది. ఈ పోరులో గ్రామస్తులంతా కలిసి పహిల్వాన్‌ను చంపివేశారు. ఈ సంఘటనలో పహిల్వాన్ మొండెం ఒకచోట, తల ఒక చోట పడింది. తల పడిన చోటే ప్రస్తుత దర్గాను నిర్మించారు. మొండెం పడిన చోట కూడా మరో దర్గాను ఏర్పాటుచేశారు. ఈ రెండు దర్గాలను విడదీస్తూ మధ్యలో జోగులాంబ వాగు ఉంటుంది. ప్రధాన దర్గా చుట్టూ దేవాలయాలు ఉన్నాయి. అయినా ఇక్కడ మత సామరస్యానికి ఏనాడు భంగం వాటిల్లిన దాఖాలాలు లేవు.
== ఉత్సవాలు ==
ప్రతి సంవత్సరం ఇక్కడ మూడు రోజుల పాటు [[ఉర్సు]] ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు గంధోత్సవం, రెండో రోజు చిన్న కిస్తీ, మూడో రోజు పెద్ద కిస్తీ పేరుతో ఉత్సవాలను జరుపుతారు. షా అలీ పహిల్వాన్‌కు కుస్తీ (మల్ల యుద్దం) పోటీలంటే ఇష్టం కాబట్టి ఈ ఉత్సవాల సందర్భంగా సరదాగా కుస్తీ పోటీలను నిర్వహిస్తారు. ఆ కుస్తీనే కిస్తీగా మారిపోయింది. కిస్తీల సందర్భంగా దర్గాలో ఉన్న ఒక వెడల్పాటి రాతి దోణెలో [[పులావ్]], వండిన ఇతర మాంసాహార పదార్థాలను నింపుతారు. కిస్తీలో గెలిచినవారికి పదార్థాలు దక్కుతాయి. చిన్న కిస్తీ పిల్లల కొరకు, పెద్ద కిస్తీ పెద్దల కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు. ఈ ఉత్సవాలకు సమీపంలోని చాలా గ్రామాల నుండి మతాలకతీతంగా ప్రజలు తరలివస్తారు. అలంపూర్‌లో ఘనంగా జరిగే ఉత్సవాలలో [[శివరాత్రి]] ఒకటైతే, మరొకటి షా అలీ పహిల్వాన్ ఉర్సు.
 
==ఇవీ చూడండి==
* [[సూఫీ తత్వము]]