గౌతమిపుత్ర శాతకర్ణి: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 1:
[[Imageబొమ్మ:SaalivaahanuDu.jpg|right|150px]]
[[Imageబొమ్మ:SalivaahanuDu text.jpg|right|150px|శాలివాహనుడు ]]
 
[[Imageబొమ్మ:GautamiPutraSatakarni.jpg|thumb|350px|[[గౌతమీపుత్ర శాతకర్ణి]] నాణెం. <br>'''ముందు:''' రాజు యొక్క మూర్తి. [[ప్రాకృతం]]లో "రాణో గోతమిపుతస సిరి యన శాతకర్ణిస": "గౌతమీపుత్ర శ్రీ యన శాతకర్ణి పాలనాకాలంలో"<br>'''వెనుక:''' శాతవాహన చిహ్నము కలిగిన కొండ, సూర్యుడు మరియు చంద్రుడు. [[ద్రవిడ భాష|ద్రవిడం]] లో "అరహనకు గోతమి పుతకు హిరు యన హతకనకు".<ref>[http://prabhu.50g.com/southind/satavahana/south_satacat.html నాణెపు సమాచారం యొక్క మూలం]</ref>]]
'''గౌతమీపుత్ర శాతకర్ణి''' (లేక శాలివాహనుడు) (క్రీ.పూ. 78-102) [[శాతవాహనులు|శాతవాహన]] రాజులలో 23వ వాడు. అతని తండ్రి శాతకర్ణి తరువాత రాజయ్యెను.
 
శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు. అతది తండ్రి శాతవాహనుడు [[అశ్వమేధ యాగం]] చేసి రాజ్యాన్ని విస్తరించెను. అతని తరువాత శాలివాహనుడు రాజయ్యెను. అప్పటికి రాజ్యమైతే విస్తరించబడ్డది కానీ శతృదేశాలనుండి ప్రత్యేకంగా శకలు, యవనుల వల్ల రాజ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉండినది. శాలివాహనుడు శకలను, యవనులను, పహ్లవులను ఓడించి రాజ్యానికి పూర్వవైభవం తెచ్చాడు. శాలివాహనుడు భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి. [[జూలియస్ సీజర్]] సమకాలీనుడయిన శాలివాహనుడు బ్రాహ్మణ రాజు. భారతీయ కాలండరు శాలివాహనుని పీరు మీదే ఈనాటికీ చలామణీ అవుతోంది.
ఈయన [[నహపాణుడు|నహపాణున్ని]] ఓడించి పెద్ద మొత్తములో లభ్యమవుతున్న జోగళ్‌తంబి నాణకశాల వర్గానికి చెందిన [[క్షహరత]] నాణేలపై తిరిగి ముద్రింపజేశాడు.
[[Imageబొమ్మ:Gout.JPG|thumb|300px|నాసిక్ లో లభ్యమైన అరుదైన గౌతమీపుత్ర శాతకర్ణి నాణెం]]
 
నాసిక్ ప్రశస్తి గౌతమీపుత్ర శాతకర్ణిని అప్రాంత, అనూప, సౌరాష్ట్ర, కుకుర, అకార మరియు అవంతి ప్రాంతాల పాలకునిగా పేర్కొన్నది. ఈ ప్రాంతాలను ఈయన నహపాణుని నుండి హస్తగతం చేసుకొని ఉండవచ్చు. ఈయన తన పూర్వీకుల పాలనలో కోల్పోయిన మధ్య దక్కన్ ప్రాంతాలు కూడా తిరిగి సంపాదించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి కాలములో [[శాతవాహన]] ప్రాబల్యం దక్షినాన [[కంచి]] వరకు వ్యాపించింది. ఈయన ఆనంద గోత్రీయుల నుండి దక్షిణ మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతాలను జయించినాడని ప్రతీతి. శాలివాహనుడు బనవాసి ప్రాంతాన్ని తన రాజ్యములో కలుపుకొని [[కర్నాటక]]లోని కొంతభాగముపై అధికారము సాధించాడు. ఈయన తరువాత క్రీ.శ.130 ప్రాంతములో ఈయన కుమారుడు [[వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి]] రాజ్యం చేపట్టాడు.