కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి →ప్రత్యేక ప్రదేశాలు: clean up, replaced: శబ్ధం → శబ్దం using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (3) using AWB |
||
పంక్తి 84:
* చక్రవ్యూహం ( అమీన్) :- అమీన్ పర్వతం థానేసర్కు దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అథిది వనం ఉందని, ద్రోణాచార్యుడు పద్మవ్యూహం రచించిన ప్రదేశం ఇదని ఇక్కడ ప్రవేశిచిన అభిమన్యుడు వెలుపలికి పోలేక యుద్ధంలో హతుడయ్యాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. అభిమన్యుడి పేరుమీద ఉన్న ఈ ప్రదేశం కాలభ్రమణంలో అమీన్ అయిందని భావిస్తున్నారు.
* మార్కండేయ తీర్థం :- మార్కండేయుడు ఇక్కడ ఆశ్రమవాసం చేసాడని విశ్వసించబడుతుంది. యాత్రీకులు ఇక్కడ స్నానం చేసి పూజలు నిర్వహిస్తారు.
* రత్నయక్ష తీర్థం:- 48 క్రోసుల కురుక్షేత్ర యాత్రను ఇక్కడి నుండి కూడా ఆరాంభిస్తారు. ఇది కురుక్షేత్ర
* పిండారా :- ఇక్కడ ఉన్న సోమతీర్ధంలో చంద్రుడు శివుని గురించి తపసు చేసి వ్యాధి నుండి విముక్తిడయ్యాడు. చంద్రుడు ఆరాధించిన క్ ఆరణంగా ఇక్కడ శివుడు సోమేశ్వరుడు అయ్యాడు. ఇక్కడ స్నానం ఆచరించి సోమేశ్వర దర్శనం చేసుకునే వారు రోగవిముక్తులు ఔతారని భక్తులు విశ్వసిస్తున్నారు.
* సఫీడోం :- సాలవనానికి 10 మైళ్ళదూరంలో ఉన్న ససదోం వద్ద ఉన్న నాగతీర్ధంలో స్నానం ఆచరించి నాగేశ్వరుడికి పెరుగు, నెయ్యి దానం చేస్తే సర్పభయం ఉండదని భక్తులు విశ్వసిస్తుంటారు.
* కైథల్:- పురాణాలలో కపిస్థలంగా వర్ణించబడిన ఈ ప్రదేశం మహావానరుడు హనుమంతుని భూమిగా విశ్వసిస్తున్నారు. యుధిష్ఠతుడు దాయాదులతో శాంతిని కోరుతూ అడిగిన ఐదూళ్ళలో కపిస్థలం ఒకటి. కపిస్థల్ కాలక్రమంలో కైథల్ అయింది. సరోవరం అనే ప్రాచీనమందిరం, ప్రాచీన దుర్గం ఉన్నాయి. ఇక్కడ శ్రావణ మాసంలో బ్రహ్మాండమైన మేళా నిర్వహించబడుతుంది.
* ద్వైశంపాయన హృదయ తీర్ధం :-
* వరాహ తీర్ధం :- జీంద్
* దుఃఖభంజనేశ్వర మహాదేవ్ మందిరం :- సన్నిహిత సరోవరానికి సమీపంలో ఉన్న సుందర మందిరమిది. శిధిలమైన ఈ మందిరాన్ని దాతల సాయంతో పునరుద్ధరించి సుందరంగా తీర్చిదిద్దారు.
ఇక్కడ ఉన్న శివాలయంలో శివినికి ఉదయకాలం మరియు సాయంకాలవేళలలో హారతులు ఇస్తారు. శ్రావణ, కార్తిక మాసాలలో శివినికి అభిషేకాలు చేసి వ్రతమాచరిస్తారు. ఇక్కడ శివునికి పూజలు చేస్తే శివుడు భౌతిక దుఃఖాలు హరిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.
|