కడిమిళ్ళ వరప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
ఆయన పూర్తి పేరు కడిమిళ్ళ శ్రీరామచంద్ర వరప్రసాదరావు. ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో [[జూలై 1]] [[1956]] న భారతీ మరియు వేంకటరామయశాస్త్రుల దంపతులకు జన్మించారు. మండపేట మండలం ఏడిద గ్రామంలో పెరిగారు. తండ్రి పౌరోహిత్య వృత్తిని స్వీకరించి స్వగ్రామమయిన తూర్పుగోదావరి జిల్లా ఏడిదలోనే జీవనాన్ని సాగించారు.వరప్రసాద్ ఏడిద గ్రామంలోనే పదవ తరగతి వరకు చదివించారు. కడిమిళ్ళ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాలలో నాటకాలలో నటుడిగా పాత్రలను వేసేవారు.
 
హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే కవితలల్లడం, ఉపన్యాసాలివ్వడం, నాటకాలలో పాత్రలు ధరించడం మొదలయిన రంగాలలో పాల్గొనడమే కాక ప్రజ్ఞావంతునిగా పేరు తెచ్చుకున్నారు.తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గరలో ఉన్న పొడగట్లపల్లి గ్రామంలోని శ్రీమతి పెన్మెత్స సూరయ్యమ్మ సత్యనారాయణరాజు ఓరియంటల్ కళాశాలలో 1979 వ సంవత్సరంలో ఆ కళాశాలలో చేరి భాషా ప్రవీణ చదివారు. భాషాప్రవీణ చదవమని సూచించిన దొంతుకుర్తి రామజోగిశర్మగారి దగ్గర శబ్దమంజరిని చదువుకున్నారు శ్రీ వరప్రసాద్. అంటే ప్రాచ్యవిద్యకు సంబంధించినంతవరకు కడిమిళ్ళవారి తొలిగురువు రామజోగిశర్మగారే.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కడిమిళ్ళ_వరప్రసాద్" నుండి వెలికితీశారు