పాణిని: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: గ్రంధం → గ్రంథం (2) using AWB |
||
పంక్తి 1:
{{హిందూ మతము}}
[[సంస్కృతం|సంస్కృత]] భాష యొక్క [[వ్యాకరణం|వ్యాకరణాన్ని]] మొట్టమొదటి సారిగా గ్రంథస్థం చేసిన వ్యక్తి
==జనన కాలం ==
Line 10 ⟶ 9:
ఈయన బాల్య జీవితం గూర్చి ఆసక్తి కరమైన కథ ఉంది. ఈయన చిన్నతనంలో విద్యాభ్యాసానికి గురుకులానికి పంపినపుడు చురుగ్గా ఉండేవాడు కాదు. గురువేమో కోప్పడుతూ ఉండేవాడు. చివరికి ఒకసారి అతని హస్తసాముద్రికాన్ని పరిశీలించిన గురువు నీకు చదువు రేఖ లేదు, వెళ్ళిపొమ్మన్నాడు. ఇంటికి తిరిగి వెళుతూ ఒక చోట దాహం తీర్చుకోవడానికి బావి దగ్గరకు వెళ్ళాడు.
అక్కడ పాత్రలు పెట్టే చోట రాయి బాగా అరిగి పోయి ఉంది. రాపిడి వలన రాయే అరిగి పోయినపుడు బాగా ప్రయత్నం చేస్తే నాకు చదువెందుకు రాదు? అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. గురువు గారు రేఖ లేదన్న చోట పదునైన రాయితో గీత గీసుకుని గురువు గారి ఆశ్రమానికి తిరుగు ప్రయాణమయ్యాడు. తిరిగి వచ్చిన శిష్యుడి ధృఢ సంకల్పం చూసి ఆయన అచ్చెరువొందాడు. విద్య నేర్పడానికి అంగీకరించాడు.
== ప్రభావం ==
Line 16 ⟶ 15:
పాణిని సూత్రాలకు ఎందరో మహా పండితులు వార్తికాలు రాశారు అందులో పతంజలి పేర్కొన్న వారు కాత్యాయనుడు, భారద్వాజుడు, సునాగుడు, క్రోస్ట, బాడవుడు అనే అయిదుగురు ముఖ్యులు. వృత్తి అంటే వ్యాకరణ శాస్త్ర ప్రవృత్తి అని అర్ధం. వార్తికం అంటే వృత్తికి వ్యాఖ్యానం. వార్తిక కారుడికే వాక్య కారుడు అనీ పేరుంది. వార్తికాలు లేక పోతే అష్టాధ్యాయి అసంపూర్ణం అయ్యేది. ఇవి వచ్చి నిండుదనాన్ని తెచ్చాయి. ఇందులో కాత్యాయనుని వార్తికం ప్రసిద్ధి పొందింది. కాత్యాయనుడికే వరరుచి, మేధాజిత్, పునర్వసు, కాత్యుడు అనే పేర్లున్నాయి. పాణిని ముఖ్య శిష్యుడే కాత్యాయనుడు. దక్షిణ దేశం వాడు. ఈ విషయాన్ని ఒక సూత్రం లో [[పతంజలి]] ప్రకటించాడు. పాణినీయం పై పతంజలి రాసిన భాష్యాన్ని ''మహా భాష్యం'' అంటారు. దీనికే ''పద'' అనే పేరు కూడా ఉంది. సూత్రం లో వార్తికం లో అభిప్రాయ భేదం వస్తే ''పాతంజలీయం'' మాత్రమే ప్రమాణం. మహా భాష్యం పై ఎన్నో వ్యాఖ్యలు వచ్చాయి. అందులో [[భర్తృహరి]] రాసినది ప్రాచీన మైనది.
అష్టాధ్యాయి పై అనేక వృత్తులు వచ్చాయి. పాణిని మేన మామ ''వ్యాడి'' అనే ఆయన వ్యాడి సంగ్రహం అనే పేర వృత్తి రాశాడు. విక్రమార్కుని ఆస్థానం లో ఉన్న వరరుచి ఇంకో వృత్తి రాశాడు. జయాదిత్యుడు, వామనుడు కలిసి రాసిన వృత్తికి ''కాశికా వ్రుత్తి'' అని పేరు. ఇదీ గొప్ప పేరు పొందినదే. వీరిద్దరూ కాశీ లో ఉండి రాయటం చేత ఆ పేరొచ్చింది. అతి ప్రధాన వృత్తిగా కాశికా వ్రుత్తి కి పేరుంది. దీని తర్వాత చెప్పుకో తగ్గది భర్తృహరి’ అనే పేరు తో పిలువ బడే ఎనిమిదో శతాబ్దానికి చెందిన బౌద్ధ పండితుడు విమల మతి రాసిన భాగ వ్రుత్తి. 16 వ శతాబ్దం వాడైన అప్పయ్య దీక్షితులు సూత్ర ప్రకాశిక అనే వ్రుత్తి రాశాడు. [[దయానంద సరస్వతి]] అస్టాధ్యాయీ భాష్యం అనే ప్రసిద్ధ
పాణిని తర్వాత చాలా మంది వ్యాకరణాలు రాశారు. అందులో కాతంత్ర కారుడు, చంద్ర గోమి, క్షపణకుడు, దేవా నంది, వామనుడు, అకలంక భట్టు, పాల్య కీర్తి, శివ స్వామి భోజ రాజు, బోపదేవుడు మొదలైన వారెందరో ఉన్నారు. ఇందరు రాసినా పాణినీయం కు ఉన్న గొప్ప తనం దేనికీ రాలేదు.
పాణిని అష్టాధ్యాయి 19వ శతాబ్దం లో యూరోప్ భాషా శాస్త్రవేత్తలను విశేషం గా ప్రభావితం చేసింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాష ల అభివృధ్ధి లో పాణిని భాషా నిర్మాణ సూత్రాలు ఉపయోగించబడ్డాయి.
Line 39 ⟶ 37:
==మూలాలు==
* [http://sarasabharati-vuyyuru.com/2014/03/13/%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE-%E0%B0%A3%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF/ వ్యాకరణ పా(వా )ణి’’ పాణిని ‘’]
{{భారతీయ గణిత శాస్త్రవేత్తలు}}
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
|