2005 మహారాష్ట్ర వరదలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
←Created page with '2005 లో మహారాష్ట్రలో సంభవించిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం...' |
(తేడా లేదు)
|
17:48, 6 మే 2016 నాటి కూర్పు
2005 లో మహారాష్ట్రలో సంభవించిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. భారత పశ్చిమ తీరాన అరేబియన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ముంబై నగరం, మరియు ఇతర ప్రాంతాలు జలమయ్యాయి. దాదాపు 1,094 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. జూన్ 2005 లో గుజరాత్ లో సంభవించిన రెండు నెలలకే ఇక్కడ కూడా వరదలు రావడం గమనార్హం. ఇప్పటికీ చాలామందికి జులై 26 అనగానే ముంబై నగరం జల దిగ్భందంలో చిక్కుకున్న రోజే గుర్తుకు వస్తుంది.
చాలామంగి ప్రజలు రోడ్లలోనే చిక్కుకు పోయారు. పలువురు తమ ఇళ్ళు కోల్పోయారు. కార్యాలయాల్లో పనిచేసే చాలామంది చాలాదూరం నడుచుకుంటూనే తమ ఇళ్ళు చేరుకున్నారు.