గౌతు లచ్చన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
 
[[1932]] వ సంవత్సరంలో [[శాసనోల్లంఘన ఉద్యమం]]<nowiki/>లో పాల్గొంటున్న లచ్చన్నను బంధించి [[రాజమండ్రి]] జైల్లో ఐదు మాసాలు ఉంచారు. రాజకీయాలకూ, సంఘసంస్కరణలకు సంబంధమేర్పరచి గాంధీజీ స్వాతంత్ర్యోద్యమాలు నడిపారు.<ref>[http://www.glowfoundations.com/biodata.html lathi-charged during the 1932 civil disobedience movement for hoisting the Congress flag at Baruva]</ref> అందులోని భాగమే [[అంటరానితనం]] నిర్మూలన. అంటరానితనం మీద కత్తి ఝుళిపించాడు లచ్చన్న.<ref>[http://www.glowfoundations.com/biodata.html Latchanna was inspired by Mahatma Gandhi’s fast-unto-death at Yeravada Central jail on the issue of untouchability]</ref><ref>[http://timelines.com/1932/9/gandhi-begins-six-day-fast-to-protest-separate-elections-for-untouchables Gandhi began a fast-unto-death while imprisoned in the Yeravada Central Jail of Pune in 1932 to eliminate discrimination and untouchability]</ref>
అతను నడిపిన హరిజన సేవా సంఘాలు, చేపట్టిన హరిజన రక్షణ యాత్రలు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. [[బారువా]] గ్రామ వీధుల్లో యువజనులను వెంట వేసుకొని భజన గీతాలు పాడుతూ వెళుతుంటే గ్రామమంతా దద్దరిల్లుతున్నట్లు కనిపించేది. సవర్ణులలో ఆశ్చర్యం, హరిజనులలో ఆశలు రేకెత్తించేవి. రాత్రి పాఠశాలలు నిర్వహించి బడుగు వర్గాల విద్యాభివృద్ధికి అతనెంతో కృషి చేశాడు. హరిజనులకు దేవాలయాలలో ప్రవేశం కలిగించాడు. లచ్చన్న చేసిన ఆర్ధిక సహాయంతో కుశాగ్రబుద్దులైన ఎందరో హరిజన విద్యార్థులు ఉన్నత స్థానాలనలంకరించారు.
ఆచార్య రంగాతో లచ్చన్న స్నేహం రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన శకాన్ని ఆరంభించింది. [[మహాత్మాగాంధీ]], పండిట్ [[నెహ్రూ]] గురు శిష్య సంబంధం లాంటిదే రంగా- లచ్చన్నల సంబంధం. [[నిడుబ్రోలు]] లో రంగా గారు స్థాపించిన రైతాంగ విద్యాలయంలో తొలిజట్టు విద్యార్థులలో లచ్చన్న ఒకరు. ఆ విశ్వవిద్యాలయంలో పొందిన శిక్షణ అతని భావి జీవితానికెంతో ఉపకరించింది. జమీందారీ వ్యతిరేక పోరాటానికి ఆయనను నడుము బిగించేటట్లు చేసింది. [[1935]] లో రాష్ట్రంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ శాఖ ఏర్పడినప్పుడు దానికి అతను సభ్యుడుగా ఎన్నికయ్యాడు.
ఆ రోజుల్లో రైతు సంఘాలు కాంగ్రెస్ పార్టీలోని అంగాలే. [[1939]] లో [[త్రిపుర|త్రిపురలో]] జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభ, కిసాన్ సభలను ఆంధ్రలోని పలాసాలో జరపాలని తీర్మానించారు. రాహుల్ సాంకృతాయాన్ యీ సభలకు అధ్యక్షత వహించాడు. ఈ సభలు జయప్రదం కావడానికి ప్రధానకారకుడు లచ్చన్నే. దీనితో ఆయన పేరూ, ఆయన కార్యదీక్ష దేశమంతటా తెలిసింది. లచ్చన్న అనేక కిసాన్ ఉద్యమాలు నడిపి ఆ రోజుల్లో జమీందార్ల పక్కల్లో బల్లెంగా తయరైనాడు.
 
స్వాతంత్ర్యోద్యమంలో చివరి పోరాటం [[క్విట్ ఇండియా]] ఉద్యమం. [[1942]] లో జరిగిన యీ ఉద్యమంలో పాల్గొన్న లచ్చన్నను ప్రభుత్వం అతి ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించి, ఆయనను పట్టి యిచ్చిన వారికి పదివేల రూపాయల బహుమతిని ప్రకటించింది. చివరకు ప్రభుత్వమే అతనిని బంధించి మూడేళ్ళు జైల్లో ఉంచి [[1945]] అక్టోబర్ లో విడుదల చేసింది. ఆనాటి నుంచి లచ్చన్న ఆంధ్ర అగ్రనాయకులలో ఒకరైనాడు. [[1947]] లో లచ్చన్న ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షులయ్యాడు.
 
==రాజకీయ జీవితం==
[[1950]] లో ఆచార్య రంగా కృషిక్ కార్ లోక్ పార్టీని స్థాపించినప్పుడు అందులో లచ్చన్న ప్రధాన పాత్ర పోషించాడు. [[1953]] అక్టోబరు 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రభుత్వం నుంచి ఆంధ్రులకు రావలసిన ఆస్తుల విభజనను పరిశీలించడానికై ఏర్పడిన ఆంధ్రసంఘంలో కాంగ్రెస్ నుంచి [[నీలం సంజీవరెడ్డి]] , ప్రజా పార్టీ నుంచి [[తెన్నేటి విశ్వనాధం]], కృషిక్ కార్ లోక్ పార్టీనుంచి లచ్చన్న సభ్యులు. ప్రకాశంగారి మంత్రివర్గంలోనూ, [[గోపాలరెడ్డి]] మంత్రివర్గంలోనూ, లచ్చన్న మంత్రిగా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/గౌతు_లచ్చన్న" నుండి వెలికితీశారు