గౌతు లచ్చన్న: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 44:
[[1932]] వ సంవత్సరంలో [[శాసనోల్లంఘన ఉద్యమం]]<nowiki/>లో పాల్గొంటున్న లచ్చన్నను బంధించి [[రాజమండ్రి]] జైల్లో ఐదు మాసాలు ఉంచారు. రాజకీయాలకూ, సంఘసంస్కరణలకు సంబంధమేర్పరచి గాంధీజీ స్వాతంత్ర్యోద్యమాలు నడిపారు.<ref>[http://www.glowfoundations.com/biodata.html lathi-charged during the 1932 civil disobedience movement for hoisting the Congress flag at Baruva]</ref> అందులోని భాగమే [[అంటరానితనం]] నిర్మూలన. అంటరానితనం మీద కత్తి ఝుళిపించాడు లచ్చన్న.<ref>[http://www.glowfoundations.com/biodata.html Latchanna was inspired by Mahatma Gandhi’s fast-unto-death at Yeravada Central jail on the issue of untouchability]</ref><ref>[http://timelines.com/1932/9/gandhi-begins-six-day-fast-to-protest-separate-elections-for-untouchables Gandhi began a fast-unto-death while imprisoned in the Yeravada Central Jail of Pune in 1932 to eliminate discrimination and untouchability]</ref>
ఆచార్య రంగాతో లచ్చన్న స్నేహం రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన శకాన్ని ఆరంభించింది. [[మహాత్మాగాంధీ]], పండిట్ [[నెహ్రూ]] గురు శిష్య సంబంధం లాంటిదే రంగా- లచ్చన్నల సంబంధం. [[నిడుబ్రోలు]] లో రంగా గారు స్థాపించిన రైతాంగ విద్యాలయంలో తొలిజట్టు విద్యార్థులలో లచ్చన్న ఒకరు. ఆ విశ్వవిద్యాలయంలో పొందిన శిక్షణ అతని భావి జీవితానికెంతో ఉపకరించింది. జమీందారీ వ్యతిరేక పోరాటానికి ఆయనను నడుము బిగించేటట్లు చేసింది. [[1935]] లో రాష్ట్రంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ శాఖ ఏర్పడినప్పుడు దానికి అతను సభ్యుడుగా ఎన్నికయ్యాడు.
ఆ రోజుల్లో రైతు సంఘాలు కాంగ్రెస్ పార్టీలోని అంగాలే. [[1939]] లో [[త్రిపుర|త్రిపురలో]] జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభ, కిసాన్ సభలను ఆంధ్రలోని పలాసాలో జరపాలని తీర్మానించారు. రాహుల్ సాంకృతాయాన్ యీ సభలకు అధ్యక్షత వహించాడు. ఈ సభలు జయప్రదం కావడానికి ప్రధానకారకుడు లచ్చన్నే. దీనితో ఆయన పేరూ, ఆయన కార్యదీక్ష దేశమంతటా తెలిసింది. లచ్చన్న అనేక కిసాన్ ఉద్యమాలు నడిపి ఆ రోజుల్లో జమీందార్ల పక్కల్లో బల్లెంగా తయరైనాడు.
స్వాతంత్ర్యోద్యమంలో చివరి పోరాటం [[క్విట్ ఇండియా]] ఉద్యమం. [[1942]] లో జరిగిన యీ ఉద్యమంలో పాల్గొన్న లచ్చన్నను ప్రభుత్వం అతి ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించి, ఆయనను పట్టి యిచ్చిన వారికి పదివేల రూపాయల బహుమతిని ప్రకటించింది. చివరకు ప్రభుత్వమే అతనిని బంధించి మూడేళ్ళు జైల్లో ఉంచి [[1945]] అక్టోబర్ లో విడుదల చేసింది. ఆనాటి నుంచి లచ్చన్న ఆంధ్ర అగ్రనాయకులలో ఒకరైనాడు. [[1947]] లో లచ్చన్న ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షులయ్యాడు.
==రాజకీయ జీవితం==
[[1950]] లో ఆచార్య రంగా కృషిక్ కార్ లోక్ పార్టీని స్థాపించినప్పుడు అందులో లచ్చన్న ప్రధాన పాత్ర పోషించాడు. [[1953]] అక్టోబరు 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రభుత్వం నుంచి ఆంధ్రులకు రావలసిన ఆస్తుల విభజనను పరిశీలించడానికై ఏర్పడిన ఆంధ్రసంఘంలో కాంగ్రెస్ నుంచి [[నీలం సంజీవరెడ్డి]] , ప్రజా పార్టీ నుంచి [[తెన్నేటి విశ్వనాధం]], కృషిక్ కార్ లోక్ పార్టీనుంచి లచ్చన్న సభ్యులు. ప్రకాశంగారి మంత్రివర్గంలోనూ, [[గోపాలరెడ్డి]] మంత్రివర్గంలోనూ, లచ్చన్న మంత్రిగా పనిచేశాడు.
|