కన్యాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కన్యాకుమారి ఆలయం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, వున్నది. → ఉంది. (2) using AWB
పంక్తి 58:
చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్లాలంటే.. విమాన మార్గంలో అయితే, మధురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలో మీటర్ల దూరం ప్రయాణించి వెళ్లవచ్చు. చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.
==కన్యాకుమారి ఆలయం==
ఇది దక్షిణ భారత దేశాగ్రమున వెలసిన పవిత్ర క్షేత్రం. మూడు సముద్రాలైన బంగాళా ఖతము, హిందూ మహా సముద్రము, అరేబియా సముద్రము కలిసే చోట నిర్మితమైన ఈ ఆలయము అతి పవిత్రమైనది. ఈ ఆలయంలోని విగ్రహాన్ని [[పరశురాముడు]] ప్రతిష్టించాడని ప్రతీతి. ఇక్కడ అమ్మ వారు కన్యా కుమారి రూపంలో భక్తులకు దర్శన మిస్తుంది.
[[దస్త్రం:Vivekananda Rock Memorial at Sunrise.JPG|thumb|right|కన్యాకుమారిలో వివేకానంద స్మారక మందిరం]]
 
ఈ విశాలమైన ఆలయాన్నంతటినీ నల్లని గ్రానేట్ తో నిర్మించారు. ఆలయము, అందులోని కన్యకుమారి గర్బాలయం తూర్పునకు అభిముఖంగా వున్నా సాధాణంగా భక్తులకు ఆలయ ప్రవేశం ఆలయ ఉత్తర ద్వారం ద్వారానె జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తూర్పు ద్వారము తెరుస్తారు. పురుషులు పైనున్న అంగవస్త్రాన్ని తీసి లోనికి ప్రవేశించాలి. ఈ ఆచారము తమిళనాట చాల ఆలయాల్లో ఉంది. ఆలయం అంతా నల్లరాతి నిర్మాణమైనందున, వెలుతురు తక్కువగావున్నందున అంతా చీటటిమయంగా వుంటుంది.
 
ఈ ఆలయ ప్రధాన ద్వారం అనగా తూర్పు వైపున వున్న మహాద్వారాన్ని మూసి వుంచడానికి ఒక కథను చెప్తారు. అదేమంటే.... గతంతలో తూర్పు వైపున వున్న మహాద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం వుడేది. అనగా బంగాళాఖాత సముద్రానికి ఎదురుగా .... ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక నుండి వెలువడే కాంతి సముద్రంలో సుధూరంలో వున్న ఓడలకు చేరి ... ఇది సురక్షితమైన రేవుగా భావించి నావికులు ఆ వెలుగు ఆధారంగా తీరానికి రావడానికి ప్రయత్నించి .... సముద్రంలో అక్కడున్న నల్ల రతిరాతి గుట్టలకు ఢీకొని ప్రమాదాలకు గురయ్యేవని..... దానివలన తూర్పు ద్వారం మూసివేశారని అంటుంటారు. సంవత్సరంలో కేవల నాలుగు రోజులు అదీ మాహోత్సవాల సందర్బంలో మాత్రమే తూర్పు వాకిలి తెరుస్తారు. మిగతా రోజులలో ఉత్తర దిక్కున వున్న ద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం
 
;ఆలయ చరిత్ర…
పురాణ కథనం ప్రకారం కుమారి కన్యాకుమారి, పరమశివుడిని వివాహం చేసు కునేందుకు సిద్ధపడిం దట. అయితే ముహూర్తం సమయా నికి కూడా [[శివుడు]] రాకపోవ టంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే వుండి పోయాయట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని స్థానికులు చెపుతుంటారుల.
 
;త్రివేణి సంగమం:
కన్యాకుమారిలో తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన అరేబియా మహాసము ద్రం, ఆలయ వెనుక భాగాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. [[వారణాసి]] పరమశివు డికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని భక్తుల విశ్వా సం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుంది.
 
;కన్యా కుమారిలో చూడవలసిన ఇతర ఆకర్షణలు:
పంక్తి 75:
 
;వివేకానంద రాక్
కన్యాకుమారి పర్యాటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్‌. ఇక్కడ క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల రాతితో స్మారకభవనం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. 1970వ సంవ త్సరంలో అప్పటి రాష్టప్రతి [[వి.వి. గిరి]] ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకా నందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వ తిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూ పంలోని ఆమె పాద ముద్రిలు కూడా దర్శనమిస్తాయి. ఇక్కడికి బోటు ద్వారా వెళ్ళవలసి ఉంది.
 
:తరువళ్లువర్‌ విగ్రహం… వివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరం లో ఆనాఇ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరు వళ్లువర్‌ విగ్రహం ఆసియా లోని ఎతైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది. చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు ఇక్కడికి కూడ పడవలలో[[పడవ]]లలో వెళ్లాల్సిందే.
 
;గాందీ మహాత్ముని స్మారక చిహ్నం…
కన్యాకుమారిలో చూడదగిన మరో పర్యాటక కేద్రం.... మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ మరణానంతరము... గాంధీజీ అస్తికలను మూడు సముద్రాలు కలిసే చోటనిజ్జనం చేయాలని అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి [[జయంతి]] రోజున అనగా అక్టోబర్‌ 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా ఈ స్మారకాన్ని నిర్మించారు.
 
మూడు సముద్రాల కలయిక కన్యాకుమారి భారత దేశానికి దక్షిణాగాన కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాక ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఒకే ప్రదేశం నుండి సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు ఒక ప్రదేశం నూడి చూడగలిగిన మన దేశంలో ఒకే ఒక్క ప్రదేశం కన్యాకుమారి. మరో అరుదైన అద్భుతానికి కూడా ఇది నిలయము. పౌర్ణమి నాడు ఒక వైపు సూర్తాస్తమాన్ని మరో వైపు చంద్రోదయాన్ని కూడా ఇక్కడి నుండి చూడవచ్చు. ఈ దృశ్యాలను చూడడానికి చాల మంది యాత్రీకులు ఇక్కడికి వస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/కన్యాకుమారి" నుండి వెలికితీశారు