చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంగీత సరస్వతి సేవ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , , → , using AWB
పంక్తి 24:
చిత్తూరు సుబ్రహ్మణ్యం [[మద్రాసు]] నగరంలో స్థిరనివాసమేర్పరచుకున్నను భారతదేశమంతా తిరిగి సుమారు 50 సంవత్సరాలకు పైగా సంగీత కచేరీలు చేసి శ్రోతల్ని మెప్పించారు.
 
వీరు [[త్యాగరాజస్వామి]] వారి కీర్తనలను లయ ప్రధానంగా గానం చేయడంలో మేటిగా పేరుపొందారు. వీరు ఎక్కువగా కాంచీపురం రీతిలో గానం చేసేవారు. వీరు స్వరప్రస్థానం మరియు కాలప్రమాణం లోకాలప్రమాణంలో ప్రసిద్ధిచెందారు. వీరు త్యాగరాజు మరియు ముత్తుస్వామి దీక్షితులు రచించిన అరుదైన కీర్తనలను ఆలపించడంలో దిట్ట.<ref name="musicplug1">[http://www.musicplug.in/blog.php?blogid=7897&cmtdisp=1 Classical&nbsp;– Vocal&nbsp;– Chittoor Subramania Pillai 1&nbsp;– Jaganmohini Shines With Chittor Subramania Pillai]. Musicplug.in (30 May 2007). Retrieved on 28 July 2011.</ref>
 
ఆకాలంలో రికార్డింగు విధానం ప్రారంభ దశలో ఉండుటవలన, వీరు రచించిన ''మధురా నగరిలో చల్లలమ్మ బోను'', ''కులములోన గొల్లదాన'' మరియు '''మావల్లగాదమ్మ''' వంటి కొన్ని మాత్రము కొలంబియా సంస్థ ద్వారా రికార్డు చేయబడ్డాయి.<ref>[http://www.hindu.com/fr/2006/10/27/stories/2006102701150300.htm Friday Review Hyderabad / Tribute : Carnatic classicist remembered]. The Hindu (27 October 2006). Retrieved on 28 July 2011.</ref>
 
వీరు గురుకుల పద్ధతిలో ఎందరో శిష్యులకు సంగీతవిద్యను బోధించారు. వారిలో కొందరు సుప్రసిద్ధ విద్వాంసులుగా పేరుపొందారు. వీరిలో [[మధురై సోమసుందరం]], [[బొంబాయి ఎస్. రామచంద్రన్]], <ref name="musicplug1"/> [[చిత్తురు రామచంద్రన్]], [[టి. టి. సీత]], [[తాడేపల్లి లోకనాథ శర్మ]] మరియు [[రేవతీ రత్నస్వామి]] ముఖ్యులు.
 
వీరు [[తిరుపతి]] పట్టణంలో 1942 నుండి త్యాగరాజ ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించి ''సప్తగిరి సంగీత విద్వన్మణి'' అనే పురస్కారాన్ని ప్రముఖ కర్ణాటక విద్వాంసులకు ప్రదానం చేసేవారు.<ref name="hindu2002"/> ఆకాలంలోనే చాలా [[అన్నమాచార్య]] కీర్తనలను స్వరపరచి అందించారు. అందులో ఇతడొకడే, నారాయణతే ముఖ్యమైనవి.