ది లైవ్స్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (7) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
యూదుల ప్రాచీన సాహిత్యాల్లో ఆదాము అవ్వల కథలు (Adam and Eve stories) చాలా ప్రసిద్దినొందాయి. క్రిస్టియన్ ఎరాలో ఈ పాత కథలన్నీ ఒక చోట చేర్చబడి "లైవ్స్ ఆఫ్ ఏడం అండ్ ఈవ్" (Lives of Adam and Eve) అను ఒక పుస్తకంగా చేయబడింది. 14, 15 శతాబ్దాల్లో ఈ కథలు అన్ని ఐరోపా భాషల్లో అనువదించబడింది. ఈ పుస్తకములో పరలోక నివాసమును కోల్పోయిన తర్వాత అదాము అవ్వలు అహారం కోసం పాట్లు పడినప్పుడు వారిని దెయ్యము మోసపరచడం, దేవుడిచే పరలోకమునుండి దెయ్యమును త్రోసివేయబడిన విధానము, ఏబేలు తన సోదరుడైన కయీనుచే చంపబడటం, అదాము స్వప్నము, ఆదాము, అవ్వల మరణము వంటి విషయములు విపులముగా చెప్పబడినవి. అయితే ఈ భాగం క్రైస్తవ [[బైబిల్]] లో చేర్చబడలేదు.<ref>The great rejected books of the biblical apocrypha – by Charles F Horne, 1917 - vol XIV.</ref>▼
▲యూదుల ప్రాచీన సాహిత్యాల్లో ఆదాము అవ్వల కథలు (Adam and Eve stories) చాలా
'''అధ్యాయము 1:''' వారు ఏధేను వనమునుండి గెంటివేయబడిన తర్వాత ఒక గుడారము వేసుకొని ఏడు రోజులపాటూ కన్నీరు మున్నీరైరి.
'''అధ్యాయము 2:''' కాని ఏడు రోజుల తర్వాత వారు ఆకలిగొని ఆహారము కొరకై వెదకసాగిరి గాని దొరకలేదు. నిరాశతో అవ్వ (Eve) తన భర్త అయిన ఆదాము (Adam) తో - "స్వామీ... నాకు ఆకలిగానున్నది. నేను తినుటకు నాకు ఏదైనా తీసుకురమ్ము. బహుశా ఆ దేవుడు తిరిగి మనల్ని కరుణించి పూర్వమున్న చోటకి చేర్చవచ్చు" అని పలికెను.
'''అధ్యాయము 3:''' అంతట ఆదాము లేచి ఏడు రోజులపాటూ ఆ ప్రాంతమంతా తిరిగెను గాని ఎక్కడనూ ఆహారము సంపాదించలేకపోయెను. అవ్వ ఇట్లనెను "నీవు నన్ను చంపిన యొడల నేను మరణించెదను, అప్పుడు ఆ దేవుడు నిన్ను కూడా పరలోకమునకు నాకొరకై తీసుకొవచ్చును.. అంతట అదాము ఇట్లనెను - "దేవుడు మరో విధంగా శాపించకపోవచ్చు అని పలుకవద్దు. నా మాంసము కొరకై నా చేయిని ఎలా ఎత్తగలను? వద్దు. మనము లేచి బ్రతుకుటకు మరి ఏదైనా చూచుకొనిన తప్పక దొరుకును.
Line 19 ⟶ 21:
'''అధ్యాయము 9:''' పద్దెనిమిది రోజులు గడిచెను. సాతాను (Satan) నిప్పులు చెరిగినవాడై దేవదూతల కాంతి రూపంలోకి మారి టైగ్రిస్ నదికి వెళ్ళెను. అవ్వ ఏడుచుట చూచి ఆమెతో కూడా ఏడిచినట్టుగా నటించెను. సాతాను ఆమెతో - ఇక ఏడువక నదినుండి బయటకు రమ్ము. ఇక ఏడువకుము, బాధపడకుము. నీవును నీ భర్తయూ ఎందుకు చింతించుచున్నారు? నీ మొర దేవుడు వినెను, నీ తపస్సును అంగీకరించెను. దేవదూతలమైన మేమందరమూ మీ తరపున దేవునికి విన్నపము చేసుకొంటిమి. నిన్ను నీటినుండి వెలుపలకు తీసుకువచ్చి, ఏధేను వనములో దొరికే ఆహారాన్ని ఇవ్వమని దేవుడు నన్ను పంపెను. కనుక బయటకు రమ్ము, మీకు సిద్ధ పరచిన ఆహారము వద్దకు నిన్ను తీసుకెళ్ళెదను -అని పలికెను
'''అధ్యాయము 10:''' అవ్వ సాతాను మాటలు నమ్మి బయటకొచ్చెను. నీరు బహు చల్లగా ఉన్నందున ఆమె మాంసము గడ్డి వలె వణుకెను. ఆమె బయటకొచ్చి నేల మీద పడెను. సాతాను ఆమెను పైకి లేవదీసి ఆదాము వద్దకు తీసుకొనిపోయెను. సాతాను ఆవ్వను తోడ్కొనివచ్చుట చూచి ఆందోళనతో - "అవ్వా, అవ్వా ... నీ తప్పస్సు మాటేమిటి? ఏ అపవాదిచేతనైతే మనము ఆత్మీయ ఆనందము నుండి
'''అధ్యాయము 11:''' అవ్వ ఈ మాటలు విన్న పిమ్మట తనను నదినుండి బయటకు నడిపించింది సాతానేయని తెలుసుకొనెను. ఆమె బహుగా రోదిస్తూ నేలపై బోర్లా పడెను. ఆమె రోదన, మూలుగు, దుఃఖము రెట్టింపయ్యెను. ఆమె సాతానుతో ఇట్లనెను - "మమ్ములను ఏ కారణము లేకుండ ఎందుకు బాధించుచుంటివి? మాతో నీకు పనేమి? మేము నీకు ఏమి చేసితిమి? నీవు మా పై కుట్రలు పన్నుచున్నావు. మా యొడల నీకెందుకు మత్సరము? నీ ఘనతను మేము దొంగిలించి నిన్ను అగౌరవపరచలేదు కదా? ఎందుకు మమ్ములను
'''దెయ్యము త్రోసివేయబడిన విధానము:'''
Line 33 ⟶ 35:
'''అధ్యాయము 15:''' ఇది విన్న నా తోటి దేవదూతలందరూ నిన్ను ఆరాధించుట నిరాకరించిరి. అప్పుడు మిఖాయేలు - దేవుని ప్రతిరూపమును ఆరాధించుడి. లేకున్నచో ఆయన ఆగ్రహము మీమీదికి దిగివచ్చును అని హెచ్చరించెను. అప్పుడు నేను - ఆయన నా పై కోపగించినచో నా సింహాసనమును నక్షత్రమండలము పైకి మార్చుకొని పైన ఉండెదను - అని పలికితిని.
'''అధ్యాయము 16:''' అంతట దేవుడు ఆగ్రహించి నన్నును, నా తోటి దేవదూతలను మా మహిమనుండి దూరము చేసెను; కేవలము నీ వలననే మీ మా నివాసములనుండి గెంటివేయబడి ఈ భూమిపై పడితిమి. మా మహిమను పోగొట్టుకొన్న మేము ఎంతో దుఃఖించితిమి. మీ ఆనందమును, భోగమును చూచి
'''అధ్యాయము 17:''' దెయ్యము చెప్పిన మాటలు విన్న ఆదాము - ఓ దేవా, నా ఆత్మను నాశనము చేయగోరిన ఈ అపవాదిని నానుండి దూరముగా తరిమివేయుము. అతను కోల్పోయిన వైభవమును నాకు ప్రసాదించుము. - అని దేవునికి మొఱపెట్టుకొనెను. అంతట సాతాను అక్కడనుండి అదృశ్యమయ్యెను. ఆదాము మాత్రము యోర్దాను నదిలోనే ఉండి నలుబది దినములు చివరి వరకూ తప్పస్సును కొనసాగించెను.
Line 39 ⟶ 41:
'''కయీను, ఏబేలు:'''
'''అధ్యాయము 18:''' అవ్వ తన భర్తతో - స్వామీ ... నీవు జీవించు. ఏ పాపమునూ చేయలేదు కనుక నీకు జీవము
'''అధ్యాయము 19:''' ఆమె ప్రసవించే సమయం ఆసన్నమయ్యేసరికి, ఆమె నొప్పితో బాధపడసాగింది. "దేవా నన్ను కరుణించు, నాకు సహాయం చెయ్యి" అని రోదించసాగింది. ఆమె రోదన వినిపించక దేవుని కరుణ ఆమె వద్దకు రాలేదు. "నా స్వామి ఆదాముకి ఎవరు చెబుదురు? సూర్య చంద్రులారా నేను మీకు ప్రార్ధిస్తున్నాను. మీరు తూర్పునకు వచ్చేసరికి నా స్వామి ఆదాముకి సందేశం తీసుకు వెళ్ళండి.
'''అధ్యాయము 20:''' ఆ సమయములో "అవ్వ నుండి ఫిర్యాదు అందినది. ఆమె మరొక్కసారి సర్పముతో పోరాడినట్లున్నది" అని అనుకొని తన భార్య అవ్వ వద్దకు వెళ్ళెను. ఆమె ఎంతో క్షోభ పడుట అతడు చూచెను. అవ్వ ఆమె భర్తతో - స్వామీ మిమ్మల్ని చూసిన మరుక్షణం నా ఆత్మ పడుతున్న బాధ
'''అధ్యాయము 21:''' అదిగో, పన్నెండు దూతలు వచ్చెను, రెండు virtues అవ్వకు ఇరువైపులా నిల్చొనెను, మిఖాయేలు కుడివైపున నిల్చొనెను. మిఖాయేలు ఆమె ముఖమును తట్టి - ఆదామును బట్టి నీవు ఆశీర్వదింపబడినావు. అతడి ప్రార్థనలు, విన్నపములు గొప్పవి గనుక నీవు మా సహాయము పొందు నిమిత్తము నేను పంపబడితిని. ఇప్పుడు లెమ్ము. ప్రసవించుటకు సిద్ధంకమ్ము - అని పలికెను. ఆమె కుమారుని కనెను, ఆ కుమారుడు ప్రకాశించి, లేచి పరుగెత్తి గడ్డిపరక తెచ్చి తల్లి చేతిలో పెట్టెను. ఆమె తన కుమారుడికి కయీను అని పేరు పెట్టెను.
Line 55 ⟶ 57:
'''అదాము స్వప్నము:'''
'''అధ్యాయము 25:''' అదాము సెత్తుతో - నా కుమారుడా, నేను, నీ తల్లియును ఏధేను వనమునుండి గెంటివేయబడిన తర్వాత నేను విన్నది, చూసినది ఇప్పుడు నీకు చెప్పెదను. మేము ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని దూతయైన మిఖాయేలు వచ్చెను. నేను గాలి వంటి
'''అధ్యాయము 26:''' అది చూచిన నేను ఆశ్చర్యపడితిని, భయము నన్ను ఆవరించెను. అంతట నేను నా ముఖము నేలకు ఆంచి దేవునిముందు సాగిలపడితిని. అంతట దేవుడు - ఆస్తికుడా, నీవు దేవుని ఆజ్ఞ అతిక్రమించావు, నీవు నీ భార్యపై అధికారము కలిగియున్ననూ ఆమె మాట వింటివి, నా మాట జవదాటితివి - అని పలికెను.
Line 63 ⟶ 65:
'''అధ్యాయము 28:''' ఈ మాటలను విన్న నేను నేలపై సాగిలపడి - నీవు నిత్య దేవుడవు, దేవాతి దేవుడవు, సమస్త జీవరాశులు నిన్ను ఆరాధించుచున్నవి. అన్ని వెలుగులకంటే పై వెలుగు నీవు. నీ కృపవలన కలిగిన మనుష్య జాతిని నడిపించుచుంటివి - అని అంటిని. నేను దేవుడిని ఇలా కొనియాడిన తరువాత దేవ దూత అయిన మిఖాయేలు దేవుని ఆజ్ఞ చొప్పున నా చేయి పట్టుకొని నన్ను పరలోకమునుండి గెంటివేసెను. మిఖాయేలు దండముతో పరలోకము చుట్టూరా ఉన్న నీటిని ముట్టగా అది మంచుగా మారెను.
'''అధ్యాయము 29:''' మిఖాయేలు నన్ను ఆ మంచుపై నడిపించి, తిరిగి నన్ను కలసిన చొట దించెను. నా కుమారుడా, విను. నేను జ్ఞాన ఫలమును తిని ఈ వయసులో ఏమి జరుగనున్నదో, మానవజాతి పట్ల దేవుడు ఏమి చేయగోరుచున్నాడో అప్పుడు నాకు ముందే తెలినప్పుడు - రహస్యములు, సంస్కారములు నాకు తెలియపరచబడినవి. దేవుడు అగ్ని కీలల్లో ప్రత్యక్షమై తన మహాత్మ్యము గల నోటితో ఆజ్ఞలు జారీ చేసి
'''అదాము మరణము:'''
'''అధ్యాయము 30:''' అదాము తొమ్మిది వందల ముప్పై ఏండ్ల వయసువాడైన తర్వాత తన రోజులు దగ్గర పడినవని గ్రహించి - "నా కుమారులందరూ నా వద్దకు రావాలి. నేను మరణించే ముందు వారిని ఆశీర్వదించెదను, వారితో మాట్లాడెదను" అని అనెను.
'''అధ్యాయము 31:''' అప్పుడు సెత్తు తండ్రితో ఇట్లనెను - ఓ తండ్రీ, పరలోక ఫలమును తినగోరి దిగులుగా పడుకొనియుంటివా? చెప్పుము, నేను పరలోక ద్వారములకు దగ్గరగా వెళ్ళి, నా తలపై మట్టిని వేసుకొని, ద్వారములకు ఎదురుగా నేలపై దేవుని ముందు సాగిలపడి వేడుకొనెదను. దేవుడు నా మొఱ విని తన దూతచే నీవు తినగోరుచున్న పరలోక ఫలమును పంపవచ్చును. అంతట అదాము - అది కాదు కుమారుడా, నేను దాన్ని కోరుటలేదు. నాకు నిస్సత్తువగా, బాధగానున్నది అని అనెను. సెత్తు - ఓ తండ్రీ, బాధ అనగానేమి, నాకు తెలియకున్నది, మానుండి దాయక, దాన్ని గూర్చి అంతా చెప్పుడి.
Line 77 ⟶ 79:
'''అధ్యాయము 34:''' వెంటనే దేవుడు మా పై కోపగించి నాతో ఇట్లనెను - నీవు నా మాటను వెనక్కు నెట్టితివి, నేను నీతో చెప్పిన మాటను తృణీకరించితివి, ఇదిగో నీ శరీరముపై డబ్బై దెబ్బలు వేయుదును; నీ కళ్ళు, తల, చెవుల నుండి క్రింది కాలి గోళ్ళ వరకూ, ప్రతీ అవయువములోను అనేక రకములైన దెబ్బలతో నీవు బాధింపబడెదవు, ఇదే దేవుడు విధించిన శిక్ష. ఇవన్నీ దేవుడు నాకు పంపెను, మన జాతి అంతటికీ పంపెను.
'''అధ్యాయము 35:''' అదాము తన సంగతులన్నియూ కుమారులకు చెప్పి నొప్పులతో బాధపడుతూ "నేనేమి చేయగలను? కృంగిపోతిని. నొప్పు అంత దారుణముగా భరించియున్నాను" అని పలికెను. అవ్వ తన భర్త దుఃఖపడుట చూచి ఆమె కూడా దుఃఖపడి - ఓ దేవా, ఇతని బాధలను నాకిమ్ము, ఎందుకనగా తప్పిదము చేసినది నేను" అని దేవుని
'''అధ్యాయము 36:''' అదాము అవ్వతో ఇట్లనెను - లెమ్ము, నా కుమారుడైన సెత్తుతో పరలోకము వద్దకు వెళ్ళి, తలపై మట్టిని పెట్టుకొని, నేలపై సాగిలపడి దేవునికి మొఱపెట్టుకొనుము. దేవుడు నీ పట్ల కనికరము చూపి తన దూతలను జీవము గల నూనె ప్రవహించు చోట ఉన్న దయగల వృక్షము వద్దకు పంపి, నన్ను హరిస్తున్న నా ఈ నొప్పులనుండి విముక్తి కలిగే విధంగా నా తల అంటుటకు నీకు ఒక చుక్క నూనె ఇవ్వవొచ్చును.
Line 85 ⟶ 87:
'''అధ్యాయము 38:''' అంతట ఆ సర్పము మనుష్యుల భాషలో ఇట్లనెను - అవ్వా, మా కోపము నీకు వ్యతిరేకంగా కాదా? మా కోపానికి మీరే కదా కారణం? అవ్వా, చెప్పుము ఆ పండు తినుటకు నీ నోరు ఏల తెరిచితివి? నేను అదల్చిన యొడల నీవు తట్టుకొనలేవు.
'''అధ్యాయము 39:''' సెత్తు ఆ సర్పముతో - దేవుడు నిన్ను గద్దించెను, కలతపెట్టువాడా, నాశనము చేయువాడా, సత్యమునకు శత్రువైనవాడా, ఇక మాట్లాడకుము, నోరు మూయుము. దేవుడు నిన్ను
'''అధ్యాయము 40:''' నిస్సత్తువగా ఉన్న ఆదాముకు తైలాభిషేకము చేయుటకు సెత్తును అతని తల్లియూ పరలోకపు ప్రాంతంలో క్షమాపణ తైలము కోసం తిరుగసాగిరి: వారు పరలోక ద్వారములయొద్దకు వచ్చిరి. అక్కడున్న మట్టిని తలలపై వేసుకొని నేలవైపు వంగి - ఆదామును కనికరించమని, నొప్పులనుండి విముక్తి ప్రసాదించమని, కరుణతైలపు వృక్షమునుండి కరుణ తైలమును తన దూతచే పంపమని - గట్టిగా విన్నపము చేసుకొనిరి.
'''అధ్యాయము 41:''' వారు గంటలతరబడి ప్రార్థనలో వేడుకొనుచుండగా, అదిగో వారియొద్దకు మిఖాయేలు దూత వచ్చి ఇట్లనెను: నేను దేవునిచే మీ యొద్దకు పంపబడితిని. సెత్తూ, నేను చెప్పునది ఏమనగా, ఏడువకుము, నీ తండ్రి ఆదామును తైలముతో అంటుటకు కరుణ తైలము కోసం
'''అధ్యాయము 42:''' నేను చెప్పునది ఏమనగా, ఆఖరి దినములలో పొందుకొని రక్షించుకోగలవని అనుకొనుట వివేకము కాదు. ఐదు వేల ఐదు వందల సంవత్సరములు సంపూర్తి అయిన తరువాత ఆదాము శరీరమును, మరియు చనిపోయిన శరీరములను లేపుటకు రాజు, దైవ కుమారుడైన [[యేసు క్రీస్తు]] భూమ్మీదకు వచ్చును. దైవ కుమారుడైన ఆయన తనకు తానే యోర్దాను నదిలో బాప్తిస్మము పొంది, ఆ నది నుండి బయటకొచ్చి, ఆయనను నమ్మిన వారందరినీ తైలాభిషేకము చేయును. నీటి మూలముగానూ, పరిశుద్ధాత్మ మూలముగాను క్రొత్తగా జన్మించుటకు సిద్ధమైన వారందరికీ తరతరాలు ఆ అభిషేకము ప్రాప్తించును.
'''అధ్యాయము 43:''' సెత్తూ, కాలము పరిపూర్ణమైనది కనుక నీవు నీ తండ్రియొద్దకు వెళ్ళుము. ఆరు రోజులు అతని ఆత్మ శరీరమును విడిచిపెట్టి వెళ్ళును. ఆపిమ్మట స్వర్గమందును, భూమియందును, ప్రకాశించువాటియందును అద్భుతములు జరుగును - ఈ మాటలు చెప్పి మిఖాయేలు వెళ్ళిపోయెను. అంతట సెత్తు, అవ్వ - [[కుంకుమపువ్వు]], వసకొమ్ములు, దాల్చిన చెక్క, నిమ్మగడ్డి వంటి సుగంధ మూలికలతో
'''అధ్యాయము 44:''' ఆదాము వద్దకు అవ్వ, సెత్తు తిరిగివచ్చి అతనితో సెత్తును సర్పము కరచిన విషయమును చెప్పెను. అంతట ఆదాము అవ్వతో ఇట్లనెను - నీవు ఏమి చేసితివి? మన తర తరములకు వ్యాధిని, అజ్ఞాతిక్రమమును, పాపమును తెచ్చితివి. ఇదే నీవు చేసితివి. నా మరణము తర్వాత నీ పిల్లలతో చెప్పుము. వారు కష్టపడుదురు, విఫలమగుదురు. ఆదియందున్న తల్లిదండ్రులు మనపైకి శాపమును తెచ్చిరి అని వారు అనుకొనెదరు. ఈ మాటలు విన్న అవ్వ బహుగా విలపించెను.
Line 103 ⟶ 105:
'''అధ్యాయము 47:''' దేవ దూతలందరూ కొమ్ము బూరలు ఊది - దేవా, నీ ప్రాణిపై కరుణ చూపిన నీవు ఘనుడవు - అని అరచెను.
'''అధ్యాయము 48:''' దేవుడు తన చేతిని చాపి ఆదామును పట్టుకొని మిఖాయేలుకు అప్పగిస్తూ - శిక్షలో తీర్పు వచ్చు వరకూ, ఇతని దుఃఖములను నేను మురిపెముగా మార్చేవరకూ, ఇతన్ని నీకు అప్పగిస్తున్నాను. అప్పుడు అతను వానికి సిద్ధము చేయబడిన సింహాసనముపై కూర్చొనును. మరియూ దూతలైన మిఖాయేలు, యురియేలుతో దేవుడు ఇట్లనెను: నార బట్ట చుట్టలు తీసుకొచ్చి, వాటిని ఆదాముపై పరచి, మిగిలిన నార బట్టలు అతని కుమారుడైన ఏబేలు పైన వేసి, ఆదామును, ఏబేలును సమాధి చేయుము. దూతల శక్తులన్నీ ఆదాము ఎదురుగా వెళ్ళెను. మరణనిద్ర
'''అధ్యాయము 49:''' ఆదాము మరణించిన ఆరు రోజుల తర్వాత అవ్వ తాను కూడా మరణించబోతున్నదని గ్రహించి, సెత్తులో సహా, ఆమె కుమారులు, కుమార్తెలందరినీ పిలిచెను. అవ్వ వారితో ఇట్లు పలికెను: నా పిల్లలారా, వినుడి. నేనునూ, మీ తండ్రియునూ దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మిఖాయేలు దూత మాతో చెప్పినది మీకు చెప్పుదును. మన ఆజ్ఞాతిక్రమము వలన దేవుడు మనపై - మొదటిసారి నీటితోను, రెండవసారి అగ్నితోను ఆగ్రహము చూపించును. ఈ రెండు విధములుగా దేవుడు మనుష్య జాతికి తీర్పు తీర్చును.
|