కుమారజీవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంప్రదాయా → సంప్రదాయా, స్వచ్చంద → స్వచ్ఛంద, గోష్టి → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| image_size = 200px
| caption = ప్రపంచ అత్యుత్తమ అనువాదకులలో ఒకడు
| birth_place = [[కూచా]], [[చైనా]]
| death_date = క్రీ.శ. 413
| death_place = [[చాంగన్]], [[చైనా]]
| religion = [[బౌద్ద మతం]]
| known = సంస్కృత భాషలో వున్న బౌద్ద గ్రంధాలను చైనా భాషలోనికి అనువదించడం.
| occupation = [[బౌద్ద బిక్షువు|బౌద్ద సన్యాసి]], మహాయాన పండితుడు, గొప్ప[[అనువాదకుడు]]గొప్పఅనువాదకుడు
| spouse =
| parents = [[జీవిక]], [[కుమారయాన]]
| children =
|}}
 
క్రీ.శ 5 వ శతాబ్దికి చెందిన '''కుమారజీవుడు''' మధ్య ఆసియా నగర రాజ్యమైన [[కూచా]] (Kucha) లో జన్మించిన సుప్రసిద్ధ బౌద్ధ సన్యాసి. మహాయాన బౌద్ద పండితుడు. ప్రపంచ అత్యుత్తమ అనువాదకులలో ఒకడు.
 
ఇతని తల్లి [[జీవిక]] కూచా రాకుమార్తె. తండ్రి [[కుమారయాన]] భారతీయ బ్రాహ్మణుడు. జన్మతా భారతీయుడు కానప్పటికి భారతీయ మూలాలను కలిగివున్న కుమారజీవుడు బాల్యం నుండే అత్యంత ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకొన్నాడు. తన తొమ్మిదవ సంవత్సరం నుండే తల్లితో కలసి దేశాలు పర్యటిస్తూ, [[కాశ్మీర్]], [[కాష్గర్]], [[కూచా]] లలో బౌద్ధ సిద్ధాంతాలు అభ్యసించాడు. తొలుత [[సర్వాస్థివాద]] ([[హీనయానం]]) శాఖను అనుసరించినప్పటికి తరువాత [[మహాయాన బౌద్ధం]] లోకి మారాడు. ఇరవై సంవత్సరాల వయసు వచ్చేనాటికి మధ్య ఆసియాలో అత్యంత ప్రముఖ బౌద్ధ సన్యాసిగా, అఖండ మేధో సంపన్నుడుగా పేరుగాంచాడు. మద్య ఆసియా నుండే కాక, తూర్పు ఆసియా, చైనా దేశాలనుండి బొద్ద బిక్షువులు బోధనల కోసం, జ్ఞాన సముపార్జనకోసం ఇతని వద్దకు వచ్చేవారు. అయితే దురదృష్టవశాత్తూ చైనా దేశపు అంతర్గత రాజకీయ పోరులో నలిగిపోయి 17 సంవత్సరాలు పాటు యుద్ద ఖైదీగా బందీలో ఉన్నాడు. చివరకు విడుదలై క్రీ.శ 401 లో ఉత్తర చైనా రాజధాని ‘చాంగన్’ (changan) లో స్థిరపడ్డాడు.
 
చైనా చక్రవర్తి కోరిక మేరకు ప్రామాణిక బౌద్ధ గ్రంథాలను పాళీ, సంస్కృత భాషల నుండి చైనా భాషలోనికి అనువదించే బృహత్తర కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. 12 సంవత్సరాల పాటు నిర్విరామ కృషి చేసి 384 వాల్యూంలతో కూడిన 74 బౌద్ధ గ్రంథాలను చైనా భాష లోనికి అనువదించి చైనీయులకు నిజమైన బౌద్ధతత్వాన్ని పరిచయం చేసాడు. తన ముందు కాలంలో చినా భాషలోనికి మొరటుగాను, అసంబద్డంగాను అనువదించబడిన ప్రామాణిక బౌద్ధ గ్రంథాలను చక్కని అనువాదంతో తిరిగి పరిష్కరించడమే కాక తన అనువాదాల ద్వారా చైనాలో మహాయాన బౌద్ధ వికాసానికి అవసరమైన తాత్విక ఆధార భూమికను కల్పించాడు. సర్వాస్థివాద, మహాయాన బౌద్దానికి చెందిన అనేక ప్రముఖ గ్రంథాలు మూల సంస్కృతంలో అలభ్యమైనప్పటికి కుమారజీవుని చైనీయ అనువాదాల నుండే అందులోని విషయాలు తిరిగి వెలుగులోకి వచ్చాయి. కుమారజీవుని చైనా అనువాదాలనుండే ఇంగ్లిష్ భాషలతోపాటు ఇతర ప్రపంచ భాషల్లో ప్రామాణిక బౌద్ధ గ్రంథాలు అనువదించబడ్డాయి. ప్రపంచ అత్యుత్తమ అనువాదకులలో ఒకనిగా కుమారజీవుడు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు.
పంక్తి 28:
 
==కుటుంబ నేపథ్యం==
కుమారజీవుడు క్రీ.శ 344 లో మధ్య ఆసియా లోని [[తక్లమికిన్]] ఎడారి ప్రాంతం లోని ఒయాసిస్ నగర రాజ్యమైన [[కూచా]] (Kucha) లో జన్మించాడు. ఇది (ప్రస్తుత Xinjiang) చైనా దేశంలో అంతర్భాగంగా వుంది. ఇతని తల్లి [[జీవిక]] (జీవ) కూచా రాకుమార్తె. తండ్రి [[కుమారయాన]] జన్మతా భారతీయ బ్రాహ్మణుడు. ‘కుమారయాన’ కాశ్మీర్ లోని సంపన్న కులీన వర్గానికి చెందిన వాడు. ఇతను బౌద్ధ బిక్షువుగా మారి ధర్మ ప్రచారం కోసం కాశ్మీర్ ను విడిచిపెట్టి పామీర్ పర్వతాలను దాటి మధ్య ఆసియా లోని నగర రాజ్యమైన ‘కూచా’ (kucha) కు వచ్చి అక్కడి రాజాస్థానంలో బౌద్ధ సన్యాసిగా స్థిరపడ్డాడు. ఇతని ప్రతిబా విశేషాలను చూసిన కూచా రాజు ఇతనికి ‘కువో షిహ్’ బిరుదుతో (kuo-shih జాతీయ గురువు) గౌరవించాడు. ఈ రాజు యొక్క చిన్న సోదరి ‘జీవిక’ గొప్ప విదుషీమణి. అమోఘమైన జ్ఞాపక శక్తి కలది. రాకుమారి అయిన జీవిక సాటి రాకుమారులను కాదని, కుమారయానను చూసినంతనే అతనినే వివాహం చేసుకోవాలనే ఆకాంక్షను వెలిబుచ్చింది. రాజు కూడా [[బౌద్ధ బిక్షువు]] అయిన కుమారయానుని తన సోదరితో వివాహానికి అంగీకరించమని కోరడం, నచ్చచెప్పడం జరిగి చివరకు జీవిక-కుమారయానుల వివాహం జరిగింది. వీరికి క్రీ.శ 344 లో ‘కుమారజీవుడు’ జన్మించాడు. కుమారయాన, జీవికలకు జన్మించిన కారణంగా వారి పేర్ల భాగాలతో కుమారజీవుడుగా పిలవబడ్డాడు.
 
==బాల్యం-విద్యాభ్యాసం==
పంక్తి 35:
కుమారజీవుని విద్యాభ్యాస నిమిత్తం 9 సంవత్సరాల వయసులో అతనిని తోడ్కొని తల్లి జీవిక మధ్య ఆసియా నుండి ప్రయాసభరితమైన ప్రయాణం సాగించి బుద్ధుడు జన్మించిన భారతదేశానికి చేరుకొంది. కుమారజీవుడు ముందుగా తండ్రి స్వస్థలం అయిన కాశ్మీర దేశంలో ప్రసిద్ధ బౌద్ధాచార్యుడు అయిన ‘బందుదత్తు’ని వద్ద సంస్కృతం అభ్యసించాడు. స్థవిరవాదుల సంప్రదాయానికి చెందిన నికాయాలను దీర్ఘ ఆగమ, మధ్యమ ఆగమ, ఖుద్దక ఆగమాలను నేర్వడమే కాకుండా భారతీయ వైద్యం, ఖగోళం, జ్యోతిషం, తర్కం, గ్రంథ వివరణ, వ్యాఖ్యాన రీతులలో ప్రావీణ్యం సంపాదించాడు. కాశ్మీర రాజు సమక్షంలో జరిగిన విద్వత్ గోష్ఠిలో పాల్గొన్న కుమారజీవుడు పిన్న వయసులోనే తన వాదనాపటిమతో అనేకమంది బౌద్దేతర గురువులను ఓడించడంతో అతని పేరు ప్రసిద్ధమైంది. 3 సంవత్సరాల తదనంతరం భారత దేశంలో విద్యను పూర్తి చేసుకొని తన తల్లితో కలసి కుమారజీవుడు తిరిగి కూచా రాజ్యానికి పయనమైనాడు.
 
===[[కాష్గర్]] లో విద్యాభ్యాసం===
మార్గమద్యంలో తల్లితో కలసి కుమారజీవుడు కాష్గర్ నగరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక బౌద్ద మోక్ష సన్యాసి (Arhat) కుమారజీవుని ఉద్దేశించి అతనికి ఉజ్వల భవిష్యత్తు వుందని, బౌద్ధ ధర్మప్రచారకుడిగా అసాంఖ్యకమైన ప్రజలను బౌద్ధంలోకి ఆకర్షించగలడని భవిష్యవాణి పలికాడు. అప్పటికే మద్య ఆసియా లోని కాష్గర్ నగరం బౌద్ధ ఆచార్యులతో, బౌద్ద గ్రంథాలయాలతో విలసిల్లుతున్నది. కాష్గర్ లో స్థిరపడిన ఒక కాశ్మీర బౌద్ధసన్యాసి 'బుద్ధయాసు'ని మార్గదర్శకత్వంలో అభిధర్మ సాహిత్యాన్ని అభ్యసించాడు. వైదిక సాహిత్యం, వేద మంత్ర ఉచ్చారణ రీతులను నేర్చి, పారమార్ధిక సత్త్యోద్ఘాటనలో కనిపించాల్సిన ఉచ్చారణా ధ్వనిరీతులపై పట్టు సాధించాడు. కాష్గర్ నగరంలో వుంటున్నప్పుడే పాళీ, సంస్కృత భాషలతో పాటు మధ్య ఆసియా భాషలపై పట్టు సాధించాడు. ఇవి తరువాత కాలంలో సంస్కృతంలో వున్న బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోకి అనువాదం చేయడంలో కుమారజీవునికి ఎంతగానో ఉపకరించాయి. ఒకానొక సందర్భంలో కాష్గర్ రాజాస్థానంలో కుమారజీవుడు విశిదీకరించిన ఒక బౌద్ధ ధర్మసూత్రాన్ని ఆధారం చేసుకొని అక్కడి బౌద్ధ మఠాలలో కనిపించే నిర్లక్ష్యధోరణిలను సంస్కరించే ప్రయత్నం జరిగింది.తరువాత 12 వ ఏట కుమారజీవుడు తల్లితో కలసి కాశ్హ్గర్ ను విడిచి తుర్పాన్ (Turpan) చేరుకొన్నాడు.
 
==మహాయాన బౌద్దంలోనికి కుమారజీవుడు==
[[Image:Tarimbecken 3. Jahrhundert.png|thumb|300px|క్రీ.శ. 4 వ శతాబ్దంలో తారిమ్ బేసిన్ (చైనా) లో ఏర్పడిన కూచా, కాష్గర్, తుర్పాన్ తదితర మద్య ఆసియా రాజ్యాలు]]
కూచా రాజ్యానికి ఈశాన్య సరిహద్దులలో వున్న [[తుర్పాన్]] రాజ్యంలో 10 వేలకు పైగా బౌద్ధ సన్యాసులు వుండేవారు. కుమారజీవుడు దాదాపుగా ఇక్కడ ఉంటున్న సమయంలోనే కుమారజీవుని ధర్మపధం మహాయానం వైపు నడిచింది. ఒకప్పుడు యార్కండ్ (Yarkand) రాకుమారుడు తరువాత కాలంలో మహాయాన బౌద్ధసన్యాసిగా మారిన [[సుత్యసోమ]]సుత్యసోము ని ప్రభావం కుమారజీవునిపై గాఢంగా పడింది. అతని ప్రభావం వల్ల కుమారజీవుడు [[శూన్యవాదం]] వైపు ఆకర్షించబడ్డాడు. సుత్యసోముని ఉపదేశంతో కుమారజీవుడు మహాయాన బౌద్ధసూత్రాలని ఆకళింపు చేసుకొన్నాడు.
 
[[హీనయానం]] (స్థవిర వాదం) నుంచి మహాయాన బౌద్ధానికి మారిన తరువాత కుమారజీవుడు తన మనోవైఖిరిని వివరిస్తూ “బంగారాన్ని (మహాయానం) ఎరుగని వ్యక్తి, ఇత్తడిని (స్థవిరవాదం) చూసి అదే గొప్పదని భ్రమపడినట్టుగా, తానింతకాలం వున్నానని, చివరకు మహాయాన ప్రభావంతో తాను విముక్తుడు అయినట్లు” వెల్లడించాడు.
 
తుర్పాన్ లోవున్న ఆనతి కాలంలోనే మాధ్యమిక బౌద్ధానికి చెందిన ఆచార్య [[నాగార్జునుడు]], ఆచార్య [[ఆర్యదేవుడు]] మొదలగు ఉద్దండుల గ్రంథాలను అభ్యసించాడు. మహాయాన బౌద్ధం నేర్చుకోవడానికి భారత దేశం నుండి తన తొలి గురువు బందదత్తుని ఆహ్వానించి వాదనలో గురువుని మెప్పించగలిగాడు. క్రమేణా తుర్పాన్ రాజ్యంలో కుమారజీవుని పేరు ప్రఖ్యాతులు ఉత్తర చైనాకు, తూర్పు ఆసియాకు విస్తరించాయి. తూర్పుఆసియా నుండి అనేకమంది అతని వద్దకు బౌద్ధదర్మం నేర్చుకోవడానికి రాసాగారు.
పంక్తి 51:
కుమారజీవుని రాకకై వేగిరపడిన చైనా చక్రవర్తి యొక్క ఆజ్ఞ మేరకు అతని సేనాధిపతి జనరల్ ‘లుగుయాంగ్’ (Gen. Lu Guang) క్రీ.శ. 383 లో కూచా రాజ్యంపై దాడిచేసి రాజుని చంపి కుమారజీవుని బంధించాడు. బంధించబడే నాటికి కుమారజీవుని వయస్సు 40 సంవత్సరాలు. ఇదే సమయంలో ఉత్తర చైనా రాజ్యంలో అంతర్గత రాజకీయ పోరు సంభవించింది. కిన్ వంశానికి చెందిన పాత చక్రవర్తి చంపబడటం, యావో వంశానికి చెందిన కొత్త చక్రవర్తి అధికారంలోకి రావడం జరగడంతో సేనాధిపతి జనరల్ లుగుయాంగ్ తన విధేయతను మార్చుకొని స్వతంత్రం ప్రకటించుకొన్నాడు. యుద్ద ఖైదీ అయిన కుమారజీవుని చక్రవర్తి వద్దకు పంపకుండా తన రాజధాని ‘లియాంగ్ గ్జౌ’ (Liangzhou) లో తన వద్దనే 16 సంవత్సరాలుకు పైగా బందీగా వుంచుకొన్నాడు. ఈ బందీ పరిస్థితులలోనే కుమారజీవుడు చైనా భాషను నేర్చుకొనడం జరిగింది. తదనంతరం రెండవ చక్రవర్తి అయిన యావో జింగ్ (Yao Xing) తన సేనాధిపతి జనరల్ లుగుయాంగ్ ప్రదర్శిస్తున్న ధిక్కార ధోరణికి విసిగిపోయి క్రీ.శ. 401 లో అతనిపై దాడి చేసి ఓడించి కుమారజీవుని సురక్షితంగా విముక్తి చేసి తన రాజధాని చాంగన్ కు రప్పించుకొన్నాడు. ఈవిధంగా చైనా అంతర్గత రాజకీయ పోరులో నలిగిపోయిన కుమారజీవుడు క్రీ.శ. 384 నుండి 401 వరకు 16 సంవత్సరాలకు పైగా అకారణంగా బందీయై మగ్గిపోవలసి వచ్చింది.
 
==[[చాంగన్]] నగరంలో కుమారజీవుడు==
[[image:White Horse Pagoda, Duhuang.jpg|thumb|చైనాకు బౌద్ద గ్రంథాలను చేరవేస్తూ మరణించిన తన అశ్వానికి స్మారకంగా కుమారజీవుడు దుహాంగ్ లో నిర్మించిన White Horse Pagoda]]
16 సంవత్సరాల సుదీర్ఘ బందనం నుంచి విముక్తుడై క్రీ.శ. 401 లో రాజధాని చాంగన్ (ప్రస్తుత Xian, చైనా) లో అడుగుపెట్టిన కుమారజీవునికి ఉత్తర చైనా చక్రవర్తి యావో జింగ్ (Yao Xing) (క్రీ.శ. 366 - 416) నుండి అఖండ ఆదరణ లభించింది. చక్రవర్తి అతనిని జాతీయ గురువు (National Perceptor) గా నియమించడమే కాక రాజ గురువుగా స్వీకరించి గౌరవించాడు. బౌద్ధ సూత్రాలను, సారస్వతాన్ని చైనా భాషలోనికి అనువదించడంలో ప్రముఖ పాత్ర వహించవలసిందిగా చక్రవర్తి అతనిని కోరాడు.
పంక్తి 95:
# దశాభూమిక విభాస - 17 వాల్యూమ్స్
 
వీటిలో 'వజ్రచ్చేదిక ప్రజ్ఞాపారమిత సూత్ర’ (The Diamond Sutra), సుఖావతి వ్యూహ (అమితభ సూత్ర), [[సద్దర్మ పుండరీక సూత్ర]] (The Lotus Sutra), ‘విమలకీర్తి నిర్దేశ సూత్ర’, ‘అష్ట సహస్రిక ప్రజ్ఞాపారమిత సూత్ర', ‘మహా ప్రజ్ఞాపారమిత ఉపదేశ’ అనువాదాలు ముఖ్యమైనవి. వీటన్నింటిలోకూడా [[లోటస్ సూత్రాలు]] కు చేసిన అనువాదం (సంస్కృతంలో 'సద్దర్మ పుండరీక సూత్ర’: చైనా భాషలో 'Miao-fu-lien-hauo') బౌద్ద ధర్మాన్ని విశిదీకరించడంలోను, భాషా అనువాద స్థాయిలోను కుమారజీవుని ప్రతిభను చాటి, ప్రపంచ అత్యుత్తమ అనువాదకారులలో ఒకడిగా చిరస్మరణీయం చేసింది.
 
కుమారజీవుడు స్వయంగా రచించిన గ్రంథాలు అరుదనే చెప్పాలి. అశ్వఘోషుడు, నాగార్జనుడు, ఆర్యదేవుడు, వసుబంధు ల జీవన చరిత్రలను చినా భాషలో రాసాడు.
పంక్తి 120:
* దావో రాంగ్ (Dao rong),
* సేంగ్రుయ్ (Sengrui)
వీరిలో సేంగ్రుయ్, దావో షెంగ్ లు [[తియన్ తాయ్]] (Tien Tai) బౌద్ద శాఖను నెలకొల్పారు.
కొంతమంది శిష్యులు చైనాలో [[సాన్ లున్]] (Sanlun) బౌద్దశాఖను నెలకొల్పారు. ఇది తూర్పు ఆసియాలోని మాద్యమిక శాఖ వంటిది.
 
==సూక్తులు==
పంక్తి 139:
* కుమారజీవుని అనువాదాల వలన చైనాకు యదార్ధ బౌద్ధతత్వం పరిచయమైంది. క్రీ.శ.2 వ శతాబ్దం నుండి క్రీ.శ. 5 వ శతాబ్దం వరకు వచ్చిన మొరటు అనువాదాలు చైనీయులకు బౌద్ద ధర్మం, తాత్వికత పట్ల సరైన అవగాహన కల్పించలేకపోయాయి. ఆ విధంగా బౌద్ద తాత్విక అంధకారంలో వున్న సామాన్య చైనీయులకు కుమారజీవుని అనువాద గ్రంథాలతో నూతన గవాక్షాలు తెరుచుకొన్నట్లయ్యింది. అసలైన బౌద్దతత్వం సామాన్యులకు చేరువవ్వడంతో చైనాలో (మహాయాన) బౌద్ద ప్రాభవం పరవళ్ళు తొక్కడం ప్రారంభమైంది. కుమారజీవుని అనువాద ప్రభావం వలన క్రీ.శ. 5 వ శతాబ్దం నుండి చైనాలో బౌద్ధం ఒక విదేశీమతంగా ఇక ఏమాత్రం పరిగణించలేనంతగా చైనాలో అంతర్భాగమయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే క్రీ.శ. 5 వ శతాబ్దానికి బౌద్ధం చైనీయులకు సజీవ ఆరాధ్య మతంగా మారిపోయింది.
* చైనాలో మహాయాన బౌద్దమత వికాసానికి కావలిసిన నేపథ్య ఆధార భూమికను కుమారజీవుడు తన అనువాదాల ద్వారా అందించాడు. మహాయానతత్వం పట్ల సాధికారత గల కుమారజీవుని నుంచి వచ్చిన అనువాదాలు చైనాలో మహాయాన బౌద్ధం వికసించడానికి మాత్రమే కాక తూర్పు ఆసియా దేశాలకు ([[వియత్నాం]], [[సింగపూర్]], [[కంబోడియా]] తదితర దేశాలకు) అక్కడినుంచి [[కొరియా]], [[జపాన్]] దేశాలకు సైతం వ్యాపించడానికి దోహదం చేసింది. తూర్పు ఆసియా దేశాలలో అనుసరిస్తున్న మహాయాన బౌద్ధానికి సంబంధించిన పారాయణ గ్రంథాలు కుమారజీవుని చైనా అనువాద గ్రంథాలను ఆధారంగా చేసుకొనే రూపు దిద్దుకొన్నాయి.
* అంతేగాక కుమారజీవుని కృషి చైనాలో బౌద్ద శాఖలు అభివృద్ధి చెందడానికి దోహదం చేసాయి. అటువంటి బౌద్ద శాఖలలో ‘[[తియన్‘తియన్ తాయ్]]’తాయ్’ (Tien Tai) శాఖ, ‘[[సాన్‘సాన్ లున్]]’లున్’ శాఖ (Sanlun) లు ముఖ్యమైనవి. వీటిలో ‘సాన్ లున్’ శాఖ తూర్పు ఆసియా మాధ్యమిక శాఖగా, ‘త్రి శాస్త్ర’ శాఖ (Three Treatises) గా పేరుపొందింది. ఈ రెండు శాఖలకు ప్రధాన సాహిత్య పారాయణాలుగా కుమారజీవునిచే అనువదించబడిన మాధ్యమిక బౌద్ద సూత్రాలే ఉన్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కుమారజీవుడు" నుండి వెలికితీశారు