ఏటుకూరి బలరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఏటుకూరి బలరామమూర్తి''' ప్రముఖ మార్క్సిస్టు మేధావి, చరిత్ర రచయిత మరియు జర్నలిస్టు. ఏటుకూరి బలరామమూర్తి ([[1918]]-[[1996]]) నిష్కళంక దేశభక్తుడు, రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుడు, మార్క్సిస్టు అధ్యయనవేత్త, విశాలాంధ్ర[[విశాలాంద్ర దినపత్రిక]], [[కమ్యూనిజం]] మాసపత్రికల సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
==బాల్యము విద్యాభ్యాసము==
ఏటుకూరి బలరామమూర్తి [[1918 సెప్టెంబర్ 3]] న ఏటుకూరు ([[గుంటూరు జిల్లా]]) లో జన్మించారు. ఇతని తండ్రి ఏటుకూరి సీతారామయ్య [[బ్రహ్మ సమాజం|బ్రహ్మ సమాజ]] అభిమాని కావడంతో ఆయన సంస్కరణాభిలాష, శాస్త్రీయ, చారిత్రిక దృష్టి బలరామమూర్తిని ప్రభావితం చేసాయి. 1937 లో [[గుంటూరు]]లోని ఆంద్రా క్రిస్టియన్ కాలేజిలో చదువుతున్నప్పుడే బలరామమూర్తికి మార్క్సిస్టు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. ఏ.సి. కళాశాలలో బి.ఎ పూర్తి చేసిన తరువాత [[జర్నలిజం]] వృత్తిలో వుంటూనే ప్రైవేటుగా ఎం.ఎ సోషియాలజీ పూర్తిచేశారు.ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనుమరాండ్రు వున్నారు<ref name=etukuri>{{citeweb|url=http://www.visalaandhra.com/essay/article-9513|title=ఏటుకూరి బలరామమూర్తికి విప్లవాంజలి|publisher=visalaandhra.com|accessdate=2015-10-31}}</ref>.
పంక్తి 17:
* ఆంద్ర ప్రదేశ్ దర్శిని (1979) (వై.వి. కృష్ణారావు సహా సంపాదకత్వంలో)
* గాంధేయవాదం – తాత్వికత (1986)
* మార్క్సిజం + భగవద్గీత (1986) : ([[ఎస్.జి.సర్దేశాయి]], దిలీప్ బోస్ తదితరులతో వ్యాస సంకలనం)
* బౌద్ధం - మార్క్సిస్టు దృక్పథం (1987) ([[ఎస్.జి.సర్దేశాయి]], దిలీప్ బోస్ తదితరులతో వ్యాస సంకలనం)
* ఉపనిషత్ చింతన (1989)
* దళితుల ఆత్మాభిమానానికి ప్రతీక అంబేద్కర్ (1991)
పంక్తి 26:
 
[[కడలూరు]] జైలులో డిటెన్యూగా వున్న రోజులలో చరిత్ర, తత్వశాస్త్ర గ్రంథాలను నిర్విరామంగా  అధ్యయనం చేశారు. జైలులో తోటి సహచారుల కోసం చరిత్ర, తత్వశాస్త్రాలపై శిక్షణా తరగతులు నడిపారు. ఎ.ఎల్‌. మార్టిన్‌ రచించిన 'పీపుల్స్ హిస్టరీ ఆఫ్ గ్రేట్‌
బ్రిటన్‌' చదవడం తటస్థించి అటువంటి ప్రజాచరిత్రను  తెలుగుజాతి చరిత్రకు అందించాలనే సంకల్పంతో  1953 జూన్‌లో తన మొట్టమొదటి గ్రంథంగా “ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర”ను రచించారు. మార్క్సిస్టు దృక్పథంతో శాస్త్రీయ ప్రాతిపదికపై రచింపబడ్డ ఈ గ్రంథం ఇప్పటికే 11 సార్లుకు పైగా పునర్ముద్రణలతో ఆంధ్రుల చరిత్ర అంటే ఆసక్తి వున్న అందరి అభిమానాన్ని చూరగొంది. ఆంధ్రుల సంక్షిప్త చరిత్రలో బౌద్ధ స్థూపాలను హిందువులు ఎలా ఆక్రమించుకొన్నదీ క్రీ.శ. 7వ శతాబ్దంలో [[అమరావతి]]ని దర్శించిన సుప్రసిద్ద చైనా యాత్రికుడు “హుయాన్ త్సాంగ్” (యువాన్ చాంగ్- Xuanzang ) మాటల్లో బలరామ మూర్తి వివరించిన అంశాలు చరిత్ర వక్రీకరణకు పాల్పడేవారికి కనువిప్పు కలిగించి చరిత్ర పట్ల సరైన వాస్తవ అవగాహన కలిగిస్తుంది. “ [[అమరావతి స్థూపంస్తూపం]] బౌద్ధ బిక్షువులు ఆధీనంలో వుంది. బ్రాహ్మణులు ఈ స్థూపంపైస్తూపంపై పెత్తనం కావాలని తగాదా పెట్టారు. చివరకు బౌద్ధ బిక్షువులు తలుపులు తీసి బైటకు వచ్చి రాజు గారి మధ్యవర్తిత్వం నడుపుదామని ఆయన వద్దకు వెళ్ళారు. ఈ లోగా బ్రాహ్మణులూబ్రాహ్మణులు స్థూపాన్నిస్తూపాన్ని ఆక్రమించుకొన్నారు. రాజు బ్రాహ్మణుల తరపున తీర్పు చెప్పాడు. బౌద్ధ బిక్షువులు స్థాన భ్రష్టులై లేచిపోయారు. కొద్ది రోజుల తరువాత [[అమరావతీ స్థూపంస్తూపం]] అమరేశ్వరాలయంగా[[అమరేశ్వరాలయం]]గా మారిపోయింది.” విశేష ఖ్యాతిని పొందిన ఈ చారిత్రిక గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం లభించింది రష్యాలో స్థిరపడిన సుప్రసిద్ధ ఇంజనీరు కొలాచల సీతారామయ్యచే 1954 లో [[రష్యన్‌ భాషలోకిభాష]]లోకి అనువదించబడింది.
 
దీని అనంతరం 1955 లో “భారతీయ తత్వశాస్త్రం” వెలువరించారు. ప్రాచీన కాలం నుండి ఆధునిక దోరిణిల వరకు 20 అధ్యాయాలతో భారతీయ తత్వశాస్త్ర వికాసాన్ని శాస్రీయ దృష్టితో సమగ్రంగా విశ్లేషిస్తూ సులభ శైలిలో ఆసక్తికరంగా వివరించబడిన ఈ గ్రంథం వీరి పుస్తకాలలో అత్యంత పేరిన్నిక గన్నది. ఈ పుస్తకం నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు దేశంలోని అనేకమంది ఆలోచనాపరులను ప్రభావితం చేసింది. రచయితగా ఏటుకూరి బలరామమూర్తి పేరును చిరస్థాయిగా నిలబెట్టిన మేటి రచన ఇది.
 
1972 వ సంవత్సరంలో విహంగ దృష్టితో 'మన చరిత్ర' పేరుతొ భారత దేశ సంక్షిప్త చరిత్రను రచించారు. ఆయన చూసిన చారిత్రక ప్రదేశాలపై విశాలాంధ్రలో ధారావాహికంగా ప్రచురింపబడిన అనేకనేక వ్యాసాల కూర్పు ఇది. “విరుద్ద శక్తుల పరస్పర సమ్మేళనం అనే వాస్తవం ఒకటి మానవ చరిత్రలో అనాదిగా కనిపిస్తూంది” అని తెలియచేస్తూ చారిత్రిక సంయమన దృష్టితో ఆర్య, అనార్య దృష్టిని విడనాడి పరిశీలించి రెండు నాగరికతల (ఆర్య, [[హరప్పా]]) ఘర్షణ, ఇక్యతల ద్వారా వినూత్నమైన భారతీయ నాగరికత ఆవిర్భవించిందని ఈ గ్రంథంలో తెలియచేసారు.
 
1989 వ సంవత్సరంలో చారిత్రిక, తులనాత్మక దృష్టితో ఉపనిషత్తుల తాత్విక దృక్పధాన్ని విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ “ఉపనిషత్ చింతన” రచించారు. శంకరాచార్యుడు వ్యాఖ్యానించిన దశోపనిషత్తులను ప్రమాణంగా తీసుకొని శాస్త్రీయంగా పరిశోధించి సమగ్రంగా వెలువరించిన లోతైన తాత్విక రచన ఇది. ఈ రచనకు తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం లభించింది.