బి.నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పత్రికలు-ప్రచురణ రంగం: clean up, replaced: నడిచి → నడచి using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), కు → కు , తో → తో (2), → , , → ,, ) → ) (3), ( → ( (3) using AWB
పంక్తి 44:
యువకుడుగా ఆయన [[స్వాతంత్ర్యోద్యమం]] పట్ల ఆకర్షితుడయ్యాడు. ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ వ్యాపార నిమిత్తం [[బర్మా]] వెళ్ళవలసి వచ్చింది. అయితే రెండవ ప్రపంచయుద్ధసమయంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. ఆయన మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభించవలసివచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించాడు. క్రమంగా ప్రచురణారంగప్రవేశానికి అదే దోహదం చేసింది. ఆంధ్రజ్యోతి అనే సామాజిక-రాజకీయ పత్రికను ప్రారంభించాడు.
 
అప్పుడే [[చక్రపాణి]] సాహచర్యం లభించింది. ఇద్దరూ కలిసి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకురావాలనుకున్నారు. దేశం స్వాతంత్ర్యం పొందడానికి ఒక నెల ముందుగా [[చందమామ]] ఆవిర్భావం జరిగి దినదినప్రవర్ధమానం కాసాగింది. ఆ తర్వాత ఆయన సినిమా నిర్మాణరంగప్రవేశం చేశాడు.
 
[[1974]]లో ఆయన దృష్టి వైద్యరంగం మీదికి మళ్ళింది. మద్రాసులో రెండు ఆసుపత్రులను నెలకొల్పాడు. కఠినశ్రమ, నిరాడంబరత, వినయం, నిర్దిష్ట పథకాలు రూపొందించడం, ఆయన సహజ గుణాలు. ఆయన పలికే ప్రతి మాటలోనూ, చేసే ప్రతి పనిలోనూ భారతీయ తాత్వికదృష్టి, ముఖ్యంగా [[భగవద్గీత]] ప్రబోధించే కర్మసిద్ధాంతప్రభావం స్పష్టంగా కనిపించేది.
పంక్తి 51:
 
==చిత్రరంగంలో==
మొదట్నుంచి నాగిరెడ్డికి పబ్లిసిటీ విభాగం పట్ల ఆసక్తి ఉండేది. ఆయన తన అన్నగారైన [[బొమ్మిరెడ్డి_నరసింహారెడ్డిబొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]] స్థాపించిన [[వాహినీ పిక్చర్స్|వాహినీ సంస్థ]]లో భాగస్వామిగా చేరాడు. రెండవప్రపంచయుద్ధ కాలంలో ([[1941]]లో) వాళ్ళ సరుకు తీసుకువెళ్తున్న ఓడ బాంబుదాడిలో ధ్వంసం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. ఆ పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించలేక తన స్వగ్రామమైన ఓరంపాడు చేరాడు. ఆ తర్వాత వాహినీ వారి [[భక్తపోతన]] కు దర్శకత్వం వహించిన [[కె.వి.రెడ్డి]] నాగిరెడ్డిని మద్రాసుకు పిలిపించి ఆ చిత్రం తాలూకు పబ్లిసిటీ వ్యవహారాలు అప్పజెప్పాడు. సరిగ్గా అదే సమయంలో [[జెమినీ_పిక్చర్స్జెమినీ పిక్చర్స్|జెమినీ]] వారి [[బాలనాగమ్మ]] విడుదలైంది. జెమినీ వారు తమ చిత్రాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తారు. దానికి దీటుగా ఉండడానికి నాగిరెడ్డి మద్రాసులో హనుమంతుడి భారీ కటౌట్లు పెట్టించి వినూత్న రీతిలో ప్రచారం చేయించాడు. ఆ పబ్లిసిటీ చిత్ర విజయానికి బాగా తోడ్పడింది. దాంతో కె.వి.రెడ్డి ఆయనకు 500 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. ఆ మొత్తంతో నాగిరెడ్డి ఒక ఆస్టిన్ కారు కొన్నాడు.
 
===విజయా సంస్థ===
 
తర్వాత [[1950]] లో నిర్మాతగా మారి [[చక్రపాణి]]తో కలిసి విజయా ప్రొడక్షన్స్ స్థాపించాడు. ఉన్నతమైన ప్రమాణాలతో పండితపామర జనరంజకంగా సినిమాలు తీసిన విజయా సంస్థ తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించింది. [[1950]] లో వచ్చిన [[షావుకారు]]తో మొదలైన ప్రస్థానం [[1962]] లో వచ్చిన [[ గుండమ్మ కథ]] వరకు ఉచ్ఛస్థితిలో కొనసాగింది. విజయుడనేది [[మహాభారతం|మహాభారత]] వీరుడు [[అర్జునుడు|అర్జునుడి]] పేర్లలో ఒకటి. గెలుపును సూచించే ఆ పేరునే నాగిరెడ్డి తమ సంస్థకు ఎన్నుకున్నాడు. ఆ పేరు విజయా సంస్థకు సార్థకం కావడమే గాక పత్రికా ప్రచురణ, వైద్యం లాంటి ఇతర రంగాల్లో కూడా ఆయన్నే అంటిపెట్టుకుని ఆయన్ను విజయాధినేతగా మార్చింది. అర్జునుడి పతాకంపై పర్వతాన్ని మోసుకొస్తున్న [[హనుమంతుడు|హనుమంతుడి]] బొమ్మ ఉంటుంది. "జెండాపై కపిరాజు(హనుమంతుడు)" అని అందుకే అంటారు. అర్జునుడి ఆ పతాకమే విజయావారి లోగోలోనూ ఉంటుంది. లోగోలో "క్రియా సిద్ధి స్సత్వే భవతి" అనే ఆర్యోక్తి ఉంటుంది.
 
===విజయావారి సినిమాలు===
 
'''షావుకారు :''' విజయా ప్రొడక్షన్స్ వారి మొదటి సినిమా [[ఎల్వీ ప్రసాద్]] దర్శకత్వం వహించిన [[షావుకారు]] (1950). ఇది తెలుగులో మొట్టమొదటి అభ్యుదయ చిత్రంగా, తెలుగు సినిమాకు పునాదిరాయిగా కీర్తి అందుకొంది. సినిమా రచనలో అంతకు మునుపెరుగని వాస్తవికతను సాధించడమే ఈ కీర్తికి కారణం. ఐతే అప్పటి ప్రేక్షకులు ఆ సినిమాలోని కొత్త భావాలను ఆదరించలేకపోయారు.
ఈ సినిమా అనుకున్నంతగా విజయవంతం కాకపోవడంతో తర్వాతి ప్రయత్నంగా [[కె.వి.రెడ్డి]] దర్శకత్వంలో [[పాతాళభైరవి]] తీశారు.
 
'''పాతాళభైరవి :''' 1951లో వచ్చిన ఈ సినిమాను జనం విరగబడి చూశారు. మళ్ళీ మళ్ళీ చూశారు. ఇది అంతకు ముందు ఎవరూ కనీ వినీ ఎరుగని ఘనవిజయం సాధించింది. దాంతో ఈ సినిమాను తర్వాత హిందీ, తమిళ భాషల్లో కూడా తీశారు. ఈ సినిమాలోని పాత్రలు తోటరాముడు, నేపాళమాంత్రికుడు, అంజిగాడు, సదాజపుడు, వాళ్ళ కోసం [[పింగళి నాగేంద్రరావు]] రాసిన సంభాషణలతో సజీవంగా ప్రజల మనసుల్లో స్థిరనివాసమేర్పరచుకొన్నారు. ఈ సినిమాతో [[ఎస్వీ రంగారావు]] లోని గొప్పనటుడు బయటకొచ్చాడు. ప్రేక్షకాదరణలో ఈ సినిమాను అధిగమించగలిగింది [[మాయాబజార్]] ఒక్కటే!
 
విజయావారి మూడవ సినిమా '''[[పెళ్ళిచేసిచూడు]]'''. ఇది భారీగా లాభాలనార్జించింది. దీంట్లో [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]], [[జి.వరలక్ష్మి]], [[సావిత్రి]]లతో బాటు బాలనటుడిగా నటించిన [[కందా మోహన్|మోహన్ కందా]]కు మంచి పేరొచ్చింది.
 
తర్వాత తమ సంస్థలో దర్శకత్వశాఖలో సహాయదర్శకుడుగా పనిచేస్తున్న [[కమలాకర కామేశ్వరరావు]] దర్శకత్వంలో 1954లో '''[[చంద్రహారం]]''' తీశారు. ఇది గొప్ప చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు.
 
ఆ తర్వాత వారు తీసిన సినిమాలే నేటికీ తెలుగులో వినోదాత్మక సాంఘిక చిత్రాల్లో మేటిగా కీర్తించబడే '''[[మిస్సమ్మ]]''', దాని తర్వాత '''[[మాయాబజార్]]'''. నిస్సందేహంగా ఇది ప్రపంచస్థాయి చిత్రం. వీటి తర్వాత వచ్చిన రెండు విజయవంతమైన విజయావారి సినిమాలు '''[[అప్పుచేసి పప్పుకూడు]]''', '''గుండమ్మ కథ'''. గుండమ్మ కథతో ఒక శకం ముగిసినట్లైంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ - ఆఖరుకు విజయావారి తర్వాతి సినిమాలు కూడా - ఆ స్థాయిని అందుకోలేకపోయాయి.
 
==విజయావారి ఇతర సినిమాలు==
పంక్తి 76:
* [[సత్య హరిశ్చంద్ర]]
* [[ఉమా చండీ గౌరీ శంకరుల కథ]]
* [[గంగ_మంగగంగ మంగ|గంగ-మంగ]]
* [[శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్]] మొదలైనవి.
 
పంక్తి 83:
===విజయా సంస్థలో ముఖ్యులు===
'''నటీనటులు:'''
విజయాసంస్థ ఏర్పడిన నాటి నుంచి 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ' వరకు వారి ప్రతి సినిమాలోనూ హీరో రామారావే. ఆయనతో బాటు విజయావారి ఆస్థాన నటులుగా ఉన్నవాళ్ళు [[ఎస్వీరంగారావు[[]], [[సూర్యకాంతం]], [[రేలంగి]], [[రమణారెడ్డి]] తదితరులు. వీరి నటనాప్రతిభ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ కాలంలో నటులు ఇతర సంస్థలు తీసే సినిమాల్లో హీరో వేషం వేయడం కంటే విజయావారి సినిమాల్లో ఎక్స్‌ట్రా వేషం వేయడమే మిన్నగా భావించేవారు. చాలా మంది నటులకు విజయావారి సినిమాల్లో నటించాలనే కోరిక [[మాయాబజార్]] తో తీరింది. ఆ సినిమాలో నాటి చిత్రరంగంలోని నటులందరూ కనిపిస్తారు. [[అక్కినేని నాగేశ్వరరావు]]కు విజయావారి సినిమాల్లో నటించే అవకాశం మొదట [[ మిస్సమ్మ]] సినిమాతో వచ్చింది. చిత్రరంగంలో అడుగుపెట్టడమే హీరోగా అడుగుపెట్టిన ఆయన ఆ సినిమాలో పూర్తిస్థాయి హాస్యపాత్ర పోషించాడు. మాయాబజార్ తర్వాత ఆయనకు గుండమ్మకథలో సహనాయకుడి పాత్ర వేసే అవకాశం వచ్చింది. అది ఆయనకు నూరవ సినిమా కూడా. అది గొప్ప అదృష్టంగా భావించిన ఆయన ఆ సినిమాకు పారితోషికం తీసుకోలేదు. కానీ [[నాగిరెడ్డి]] ఆయనకు ఇవ్వవలసిన మొత్తాన్ని ఒక విద్యాసంస్థకు విరాళంగా ఇచ్చేశాడు.
 
'''తెరవెనుక నిపుణులు:'''
''దర్శకులు:'' [[ఎల్వీ ప్రసాద్]] ([[షావుకారు]], [[పెళ్ళిచేసిచూడు]], [[మిస్సమ్మ]]) ; కె.వి.రెడ్డి (పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరునికథ, మొ), కమలాకర కామేశ్వరరావు (చంద్రహారం, గుండమ్మకథ)
 
[[కె.వి.రెడ్డి]], [[కమలాకర కామేశ్వరరావు]] లిద్దరూ మొదట్నుంచి విజయ-వాహినీ సంస్థల్లోనే పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఒకరిమీద ఇంకొకరికి అచంచలమైన విశ్వాసముండేది. ఇద్దరిలో ఎవరికి దర్శకుడిగా అవకాశమొచ్చినా ఇంకొకరిని సహాయదర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు. ఆ అవకాశం మొదట కె.వి.రెడ్డికే వచ్చింది.
 
''రచయితలు:'' విజయావారి ఆస్థాన రచయిత తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత జనరంజకమైన మాటలు-పాటలను రాసిన [[పింగళి నాగేంద్రరావ]]."ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?" (మాయాబజార్ లో) అంటూ ఆయన ఏదైనా కనికట్టో, మ్యాజిక్కో చేసేటప్పుడు నేడు చిన్నపిల్లలు సైతం పలికే మాట "హాంఫట్" తో బాటు మరెన్నో మాటలు పాతాళభైరవిలో సృష్టించాడు. ఆ రసగంగాప్రవాహం మాయాబజార్ తో సహా విజయావారి ఎన్నో సినిమాల్లో ప్రవహించింది.
 
[[డివి నరసరాజు]] (గుండమ్మకథ,...)
పంక్తి 99:
 
===ఇతర భాషల్లో===
విజయా సంస్థ [[తమిళం]]లో పాతాళభైరవి, కళ్యాణం పన్ని పార్ (పెళ్ళి చేసి చూడు), చంద్రహారం, మిస్సియమ్మ (మిస్సమ్మ), మాయాబజార్, గుండమ్మ కథ, ఎంగవీట్టు పిళ్ళై (సురేష్ ప్రొడక్షన్స్ వారి తొలి సినిమా రాముడు-భీముడు) ; హిందీలో పాతాళభైరవి, మిస్ మేరీ (మిస్సమ్మ), రాం ఔర్ శ్యాం (రాముడు-భీముడు), జూలీ; కన్నడ , సింహళీ భాషల్లో కూడా కొన్ని సిన్మాలు తీశారు.
నాగిరెడ్డి తమిళంలో గుండమ్మ కథ, ఎంగ వీట్టు పిళ్ళై సినిమాలకు తనే దర్శకత్వం వహించాడు.
పంక్తి 113:
*విజయ చిత్ర, సినిమా వారపత్రిక,
*వనిత, మహిళల మాసపత్రిక
*జూనియర్ క్వెస్ట్, పిల్లలకోసం ఇంగ్లీషు లోఇంగ్లీషులో
*స్పూత్నిక్, పిల్లలకోసం ఇంగ్లీషు లోఇంగ్లీషులో
*ది హెరిటేజ్, మనోజ్ దాస్ సంపాదకత్వంలో భారతీయ సాంస్కృతిక వైభవాన్ని గురించి తెలియజేసే ఆంగ్ల మాసపత్రిక.
 
పంక్తి 139:
 
==బయటి లింకులు==
చందమామ పత్రిక ఏప్రిల్ 2004 సంచికలో ప్రచురించిన నివాళి
 
[[వర్గం:1912 జననాలు]]
[[వర్గం:2004 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/బి.నాగిరెడ్డి" నుండి వెలికితీశారు