యుద్ధకాండ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , పటిష్ట → పటిష్ఠ (2), ప్రార్ధించా → ప్రార్థించా (2) using AWB |
||
పంక్తి 3:
[[సుందర కాండ]]లో [[హనుమంతుడు]] [[సీత]] జాడ తెలిసికొని [[రాముడు|రామునికి]] చెప్పిన ఘట్టం తరువాత యుద్ధకాండ మొదలవుతుంది. ఇందులో ప్రధాన ఘట్టాలు - రాముడు హనుమంతుని ఆలింగనము చేసుకొనుట, వానర భల్లూక సేనలతో రామలక్ష్మణులు యుద్ధానికి సన్నద్ధులగుట, సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము.
[[Image:Battle at Lanka, Ramayana, Udaipur, 1649-53.jpg|right|thumb|400px|లంకలో యుద్ధం - 1650 కాలంనాటి చిత్రం - (ఉదయపూర్) ]]
==సంక్షిప్త కథ==
[[హనుమంతుడు]] సీతాన్వేషణానంతరం "చూశాను సీతను" అని తన సాగర లంఘనం, లంకా ప్రవేశం, సీతాన్వేషణ, సీతను ఓదార్చుట, రావణునితో సంభాషించుట, లంకను దహనం చేయుట గురించి రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వివరించాడు. ఒక్క నెల లోపు రాముని చూడకున్న తాను బ్రతుకనని సీత చెప్పినదన్నాడు.
పంక్తి 15:
===విభీషణ శరణాగతి===
[[File:Vibhishana Meets Rama.jpg|thumb|రాముడ్నిశరణు వేడుతున్న విభీషణుడు]]
అక్కడ లంకలో [[రావణుడు]] యుద్ధము విషయమై తనవారితో మంత్రాంగం నెరప సాగాడు. పుర భద్రత కట్టుదిట్టంగా ఉండాలని ఆనతిచ్చాడు. రాక్షస వీరులు రావణుని ప్రతాపాన్ని, తమ శక్తి సామర్ధ్యాలను కీర్తించుకొని, నిర్భయంగా ఉండమన్నారు. ఒక్కొక్కరు తానే రామలక్ష్మణులను కడతేర్చగలమన్నారు. కాని రావణుని తమ్ముడైన [[విభీషణుడు]] రావణునితో విభేదించాడు. రామలక్ష్మణుల క్రోధాగ్నికి లంక భస్మమవ్వడం తథ్యమని, రావణుడు అనాలోచితంగా [[సీత]] అనే కాలనాగును తన మెడకు చుట్టుకొన్నాడని నచ్చచెప్పడానికి యత్నించాడు. సీతను రామునకప్పగించి చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోమన్నాడు. మళ్ళీ రావణుని సౌధానికి వెళ్ళి లంకలో అశుభ నిమిత్తాలనేకం ముప్పిరిగొన్నాయని, రానున్న విపత్తునుండి రాక్షసజాతిని కాపాడమని
మరునాడు రావణుడు మంత్రగృహంలో కొలువుతీరినపుడు సకల అమాత్య బంధుగణంతో పాటు [[కుంభకర్ణుడు]] కూడా ఉన్నాడు. రావణుడు పొరపాటు చేశాడని, అయినా తాను విజృంభించి అతని కార్యం సిద్ధింపజేస్తానని కుంభకర్ణుడు అన్నాడు. మళ్ళీ విభీషణుడు హితవు చెప్పబోగా [[ఇంద్రజిత్తు]], రావణుడు అతనిని నిందించారు. తనకు ఆప్తులైన నలుగురు రాక్షసులతోకలిసి విభీషణుడు అన్నగారి సెలవు తీసికొని ఆకాశానికి ఎగిరి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చాడు. అతనిని నమ్మవద్దని కపివీరులన్నారు. విభీషణుడు సౌమ్యుడని, నమ్మదగినవాడని హనుమంతుడు చెప్పాడు. '''శరణుకోరిన సకల భూతాలకు అభయం ఇవ్వడం తన వ్రతమని చెప్పి రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చాడు'''. రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు వంటి మహాయోధుల పరాక్రమాన్ని, లంకా నగరం
===సాగరంపై వారధి===
[[బొమ్మ:Rama-Varuna.jpg|ఎడమ|thumb|150px|సముద్రంపై బాణం ఎక్కుపెట్టిన రాముడు ([[రాజా రవివర్మ]] చిత్రం) ]]
తమ మధ్య వైరం ఏమీ లేదు గనుక రామునికి సాయం చేయవద్దని రావణుడు సుగ్రీవునికి శుకుడనే దూత ద్వారా దౌత్యం పంపాడు. అందుకు సుగ్రీవుడు - "రావణా! నాకు నువ్వు చేసిన సాయం లేదుగనుక నాకు ప్రియుడవు కావు. రామునికి విరోధివి గనుక నాకు కూడా విరోధివే. రాముని కోపానికి గురైనందున నిన్ను రక్షించే శక్తి ముల్లోకాలలోనూ లేదు" అని సమాధానం
[[File:Building a Bridge to Sri Lanka.jpg|thumb|సముద్రంపై వంతెనను నిర్మిస్తున్న వానరులు]]
ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది. మొదటి రోజు 14 ఆమడలు, రెండవ రోజు 20 ఆమడలు, మూడవ రోజు 21 ఆమడలు, నాలుగవ రోజు 22 ఆమడలు, ఆయిదవరోజు 23 ఆమడలు - ఇలా అయిదు దినములలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి నిర్మించారు. విభీషణుడు ఒక ప్రక్క వారధికి రక్షణగా నిలిచాడు. వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి, రామకార్యానికి సన్నద్ధమై
త్రికూట పర్వతం పైన లంకా పట్టణం సంకల్పమాత్రాన విశ్వకర్మ నిర్మించినట్లు వైభనంగా ఉంది. ఆ శోభను గమనించి రాముడు ఆశ్చర్య పోయాడు. భూమి రక్తంతో తడిసిపోయేంత యుద్ధం నిశ్చయమని రామునికి శకునాలు తోచాయి. తన సేనను జాగరూకతతో ఉండమని వ్యూహనిర్దేశనం చేశాడు. తరువాత తమకు బందీగా ఉన్న శుకుడు అనే దూతను విడుదల చేయించాడు.
===భల్లూక వానర వీర సేన===
[[Image:Rama preparing Lanka siege.jpg|thumb|300px|ఎడమ|కపి సేనతో లంకను ముట్టడించడానికి సన్నద్ధుడౌతున్నరాముడు ([[స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్]]లో ఉన్న ప్రాచీన చిత్రం.) ]]
రావణుడి చారులైన శుక సారణులు రామ, లక్ష్మణ, సుగ్రీవ, జాంబవంత, హనుమంతాది వీరుల పరాక్రమాన్ని రావణునికి వివరించారు. వానరసేన ఎంత ఉందో లెక్కపెట్టడం అసాధ్యమన్నారు. సీతను రామునకప్పగించడం మంచిదని తమకు తోచిందన్నారు. ప్రాసాదం పైకి తీసుకెళ్ళి వానరవీరుల సేనానాయకులలోని ముఖ్యులను చూపించారు -
పంక్తి 35:
[[దస్త్రం:F1907.271.194.jpg|thumb|సువేల పర్వతముపై రామునితో సమావేశమైన వానరులు]]
కాటుక కొండలలాంటి లెక్కలేనన్ని భల్లూకాలతో నర్మదా నదీతీరపు ఋక్షవంతం నుండి వచ్చిన నాయకుడు ధూమ్రుడు చాలా భయంకరుడు. ధూమ్రుని తమ్ముడు జాంబవంతుడు దేవాసుర యుద్ధంలో దేవేంద్రునకు సాయపడ్డాడు. వానర యోధులలో ప్రఖ్యాతుడు దంభుడు చాలా బలశాలి. కొండలాంటి రూపం కలిగిన వానర పితామహుడు సంనాదుడు కలియబడితే ఒకసారి దేవేంద్రుడే తగ్గిపోయాడు. పదికోట్ల వీరులతో హిమవద్గిరినుండి వచ్చిన క్రధనుడు పరాజయం ఎరుగనివాడు. ఏనుగులను దండించడం వినోదంగా భావించే ప్రమాధి, అతని అనుచరులు లంకపై పడడానికి ఉవ్విళ్ళురుతున్నారు. గవాక్షునివెంట ఇంకా కోట్లకొలది వానరులు సేతువును దాటి వస్తూనే ఉన్నారు. మేరుపర్వతం నుండి వచ్చిన వానరుల అధిపతి కేసరి. కాలసర్పాలలా ఘోర భీకరమైన వానరుల నాయకుడు శతబలి కాంచనపర్వత ప్రాంతంనుండి వచ్చాడు. గజుడు, గవాక్షుడు, గవయుడు, నలుడు, నీలుడు - వీరి వద్దనున్న వానరుల సంఖ్యాబలం చెప్పనలవి కానిది. సుగ్రీవుని ఆజ్ఞను జవదాటని వానరవీరులు మహా బలవంతులు, దుర్జయులు, కామరూపులు. మైందుడు,
కేసరి నందనుడు, వాతాత్మజుడు అనబడే హనుమంతునికి ముల్లోకాలలోను ఎదురులేదు. అతనికి కోపం వస్తే సముద్రాన్ని కలచివేయగలడు. వేదవేదాంగాలు నేర్చినవాడు, ధర్మం తప్పని వాడు, నీలమేఘ శ్యాముడు, పద్మనేత్రుడు
రావణుడు పంపిన మరొక చారుడు శార్దూలుడు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాడు. వానర భల్లూక వీరుల పరాక్రమం గురించి మరిన్ని విషయాలు చెప్పాడు. ఋక్షరజసుని కొడుకు సుగ్రీవుడు - గద్గదుని కొడుకులు ధూమ్రుడు, జాంబవంతుడు - బృహస్పతి కొడుకు కేసరి - వరుణుని కొడుకు సుషేణుడు - చంద్రుని కొడుకు దధిముఖుడు - కృంతాంతుని అంశలలాంటి సుముఖుడు, దుర్ముఖుడు, వేగదర్శి - పావకుని పుత్రుడు నీలుడు - వాయుపుత్రుడు హనుమంతుడు - పురుహూతుని పౌత్రుడు అంగదుడు - అశ్వనీ దేవతల అంశలతో పుట్టినవారు మైందుడు,
===యుద్ధానికి ముందు===
పంక్తి 46:
రావణుడు విద్యుజ్జిహ్వుడనే మాయలమారి రాక్షసుని పిలిపించి రాముని శిరస్సును పోలిన ఒక మాయా శిరస్సును, ధనుర్బాణాలను చేయించాడు. యుద్ధంలో రామలక్ష్మణులు, వానర సైన్యం నశించారని సీతతో చెప్పి ఆ మాయా శిరస్సును, ధనుర్బాణాలను చూపాడు. సీత కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. రావణుడు వెళ్ళిపోయాక విభీషణుని భార్య, [[సరమ]] అనే సాధ్వి సీతను ఓదార్చి అది మాయ అని, రహస్యంగా తాను అంతా విన్నానని చెప్పింది. యుద్ధానికి భల్లూక వానర సమేతంగా రాముడు సిద్ధంగా ఉన్నాడని, సీతకు శుభ సౌభాగ్య సమయం ఆసన్నమయందని అనునయించింది. రావణుని వినాశనం అనివార్యమంది.
రావణుని తల్లికి పినతండ్రి అయిన మాల్యవంతుడనే వృద్ధుడు రావణునికి యుద్ధం మానమని హితవుపలుకబోయాడు. అతనిని రావణుడు కఠినంగా దూషించాడు. వానర సేనా, రామలక్ష్మణులూ అజేయులు, అసమానులు అని రావణుడు విన్నాడు కాని కాని ప్రహస్తుని నాయకత్వములోని రావణ సేనాబలం కూడా పరాజయం ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ - వీరిలో ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతేర్చగలరనీ, కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడూ, తనూ
సైన్యాన్ని సమాయత్తపరచి అన్ని యెడలా రక్షణకు
రాముని పంపున అంగదుడు దూతగా వెళ్ళి చివరిసారిగా రావణునికి రాముని సందేశాన్ని వినిపించాడు. సీతనిచ్చి శరణు కోరితే రాముడు క్షమించి వదిలి వేస్తాడని చెప్పాడు. అంగదుని రావణుడు తృణీకరించాడు. అంగదుడు రావణుని గోపుర శిఖరాన్ని కాలితో తన్ని పడగొట్టి తిరిగి వచ్చాడు.
పంక్తి 59:
అంటూ వానరసేన లంకను ముట్టడించింది. ముందుగా మట్టితోను, బండరాళ్ళతోను, చెట్లతోను అగడ్తను పూడ్చివేసి ప్రాకరాలు ఆక్రమించారు. గోపురాలు, ప్రాకార తోరణాలు పడగొట్టేశారు. వీరబాహువు, సుబాహుడు, నలుడు ప్రాకారాలు భేదించ సాగారు. కుముద, ప్రఘన, పనసులు తూర్పున, శతవలి దక్షిణాన, సుషేణుడు పడమర, మహాకాయ గవాక్ష ధూమ్రులు ఉత్తరాన ద్వారాలు బ్రద్దలుకొట్టసాగారు. ప్రళయకాల సముద్రంలాగా కాల మేఘాల్లాంటి రాక్షససేన సింహనాదాలతో, దుందుభి ధ్వానాలతో వానరులను ఎదుర్కొంది. మహాయద్ధంతో భునభోంతరాళాలు కంపిస్తున్నాయి. ఒక్క క్షణంలో యుద్ధం భీకరం అయి భూమి అంతా రక్త మాంసాలతో నిండిపోయింది.
వానర రాక్షస ప్రముఖుల మధ్య ద్వంద్వ యుద్ధాలు ఆరంభమయ్యాయి. అంగదుడు ఇంద్రజిత్తుతోను - (విభీషణుని సచివుడు) సంపాతి ప్రజంఘునితోను - హనుమంతుడు జంబుమాలితోను - విభీషణుడు శత్రుఘ్నునితోను - గజుడు తపనునితోను - నీలుడు నికుంభునితోను - సుగ్రీవుడు ప్రఘసునితోను - లక్ష్మణుడు విరూపాక్షునితోను - మైందుడు వజ్రముష్ఠితోను -
===నాగపాశ విమోచన===
[[దస్త్రం:2006AJ6361.jpg|thumb|left|300px|రామ లక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగిస్తున్న ఇంద్రజిత్తు]]
అంగదుని చేత పరాభవం పొందిన [[ఇంద్రజిత్తు]] ఒక్కసారిగా మాయమైపోయాడు. మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. రామలక్ష్మణుల దేహంపై ప్రతి అంగుళం బాణాలతో నిండిపోయింది. వానరసేన సిగ్గువిడిచి పరుగులు తీసింది. అందరు వానర సైన్యాధిపతులూ ఇంద్రజిత్తు బాణాలతో గాయపడినవారే. ఆ నాగాస్త్ర బంధాలనుండి తప్పుకోవడం ఎవరివల్లా కాదని విజయ గర్వంతో ఇంద్రజిత్తు తండ్రివద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణులను చంపి వానరసేనను నిర్వీర్యం చేసేశానని చెప్పాడు.
భయభీతులైన వానరులంతా రాఘవుల చుట్టూ కూర్చుని దుఃఖించసాగారు. మళ్ళీ రాక్షసులు వస్తారేమోనని కంగారుపడసాగారు. కొద్దిగా సృహ వచ్చిన రాముడు లక్ష్మణుని చూచి వ్యాకులపడి, తన ప్రతిజ్ఞలన్నీ మిధ్యలయ్యాయని వగచి, ప్రాయోపవేశానికి సిద్ధనయ్యాడు. తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపి వానరులను తిరిగి వెళ్ళిపొమ్మన్నాడు. వారు శక్తి వంచన లేకుండా మిత్ర కార్యం నిర్వహించారని, అయినా ఈశ్వరాజ్ఞ ఉల్లంఘించరానిదని చెప్పాడు. వానరులందరూ కళ్ళనీళ్ళు పెట్టుకొన్నారు. శరతల్పగతులైన రామలక్ష్మణులను చూచి విభీషణుడు హతాశుడయ్యాడు. [[సుగ్రీవుడు]] మాత్రం విభీషణుడిని ఓదార్చి అతనికి లంకాధిపత్యం నిశ్చయమన్నాడు. రామలక్ష్మణులను తీసికొని కిష్కింధకు వెళ్ళమని తన మామ సుషేణుడికి ఆనతిచ్చాడు. తాను రావణుడిని సపుత్ర బాంధవంగా నాశనం చేసి సీతమ్మను తీసుకొని వస్తానన్నాడు. సంపాతి, పనసుడు, హనుమంతుడు వెళ్ళి దివ్యౌషధాలను తెస్తే ప్రయోజనం ఉంటుందని సుషేణుడన్నాడు.
అంతా విషణ్ణులైన సమయానికి పెద్ద [[సుడిగాలి]] వీచి [[సముద్రం]] కల్లోలమయ్యింది. [[గరుత్మంతుడు]] మహాప్రభంజనంలా వచ్చాడు. అతని రాకతో శరరూపంలో రామ సౌమిత్రులను పట్టుకొని ఉన్న సర్పాలన్నీ పారిపోయాయి. గరుడుడు తన రెండు చేతులతోను రామలక్ష్మణుల సర్వావయవాలను నిమిరాడు. వెంటనే వారి గాయాలు మాయమై వారికి మునుపటికంటె ఎక్కువ తేజస్సు, బల వీర్య పరాక్రమాలు సమకూరాయి. వారిని కౌగలించుకొని గరుడుడు - "మీరు జాగరూకతతో ఉండండి. నేను మీకు స్నేహితుడనెలా అయ్యానో తరువాత తెలుస్తుంది. రామా! నువ్వు లంకను నాశనం చేసి రావణుని చంపి సీతను పొదడం తథ్యం" -
===రాక్షస వీరుల మరణం===
పంక్తి 81:
;ప్రహస్తుడు
[[Image:Nila-Ramayana(Bali-1880).jpg|ఎడమ|thumb|150px|వానర సేనాధిపతి నీలుడు ("బాలి" ద్వీపంలో చిత్రం) ]]
ఇప్పుడేమి చేయాలని రావణుడు ప్రహస్తుని అడిగాడు. ప్రహస్తుడు రావణుని సేనానాయకుడు. శస్త్రాస్త్రవేది. మహావీరుడు. అంతకుముందు మంత్రాంగ సమయంలో సీతను ఇచ్చివేయడమే క్షేమమని హితవు చెప్పినవాడు. రావణుని ఆదరానికి బదులు తీర్చుకోవడమే తన బ్రతుకుకు లక్ష్యమని చెప్పి, ప్రహస్తుడు హోమాదికాలు పూర్తి చేసుకొని, సర్ప ధ్వజంతో కూడిన గొప్ప రథం పూన్చి, శత్రుభీకరమైన మహోన్నత సేనను సమకూర్చుకొని తూర్పు ద్వారంవైపు యుద్ధానికి బయలుదేరాడు. అతనివెంట నరాంతకుడు, కుంభహనువు, మహానాధుడు, సమున్నతుడు అనే సమర్ధులైన అనుచరులున్నారు. రాక్షస వానర వీరులు జబ్బలు చరిచి యుద్ధానికి తలపడ్డారు. ఇరుపక్షాల సింహనాదాలు, రోదనలతో నింగీ నేలా దద్దరిల్లాయి.
===రావణునికి పరాభవం===
పంక్తి 97:
[[దస్త్రం:F1907.271.220.jpg|thumb|left|కుంభకర్ణుని కొరికి తప్పించుకున్న సుగ్రీవుడు]]
అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపమని మంత్రులను పంపాడు. భేరీ భాంకారాలు చేసి, శూలాలతో పొడిచి, ముసలాలతో మోది, ఏనుగులతో త్రొక్కించి, ఏనుగులతో త్రొక్కించి వారు కుంభకర్ణుని నిదురనుండి లేపారు. లేవగానే [[కుంభకర్ణుడు]] మాంసరాసులను సుష్ఠుగా తిని, కుండలతో రక్తం త్రాగి, త్రేవ్చాడు. విషయం తెలుసుకొని, స్నానం చేసి, సర్వాభరణాలు ధరించి, బలకరమైన
రావణుడు కుంభకర్ణుడికి జరిగిన విషయం వివరించాడు. అనాలోచితంగా రావణుడు చేసిన చెడ్డపనులను సోదర ప్రేమతో నిందించాడు కుంభకర్ణుడు. కపటంతో సీతను మోసపుచ్చాలన్న మహోదరుని సూచన కూడా కుంభకర్ణునికి రుచించలేదు. తాను రామలక్ష్మణులను, సకల వానర సేనను భక్షించి పరిస్థితిని చక్కదిదద్దుతానని, రావణుడికి మాట యిచ్చి, అగ్నిలా వెలిగిపోతూ, కాలపాశ సదృశమైన పరిఘను పట్టుకొని, కోట గోడను ఒక్క అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు. ఆరు వందల ధనువుల యెత్తూ, వంద అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయుని చూస్తూనే వానర సేనలు పారిపోసాగాయి. ధైర్యం చెప్పి వారిని అతికష్టంమీద అంగదుడు నిలువరించాడు.
[[బొమ్మ:Kumbhakarna in war.jpg|thumb|రామాయణ యుద్ధములో కుంభకర్ణునిపై బాణాలు ఎక్కుపెట్టిన రామలక్ష్మణులు (బాలాసాహెబ్ పండిత్ పంత్ ప్రతినిధి చిత్రం, 1916) ]]
కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. అంగదుడు, ఋషభుడు, శరభుడు, మైందుడు, నీలుడు వంటివారు విసిరిన కొండలు కుంభకర్ణుని వంటికి తగిలి పొడి అయిపోయాయి. వందలాది వానరులను వాడు కరకర నమిలి మ్రింగ సాగాడు. హనుమంతుని దెబ్బకు కుంభకర్ణుడు రక్తం కక్కాడు. కుంభకర్ణుడి శూలం పోటుకు హనుమంతుడు రక్తం కక్కాడు. ఆ రాక్షసునికి ఎదురు పడిన అంగదాది వీరులు వాడి విదిలింపులకే సృహ తప్పి పడిపోయారు. సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని తన మోకాటికి అడ్డంగా పెట్టుకొని విరిచేశాడు. అప్పుడు కుంభకర్ణుడు విసిరిన పర్వత శిఖరం తగిలి సుగ్రీవుడు తెలివి తప్పాడు. మూర్ఛపోయిన సుగ్రీవుడిని పట్టుకొని లంకవైపు వెళ్ళాడు కుంభకర్ణుడు. తెలివి తెచ్చుకొన్న సుగ్రీవుడు ఒక్కసారి విదిలించుకొని, రాక్షసుని ముక్కు, చెవులు కొరికివేసి ఒక్కగెంతులో వానర సైన్యం మధ్యకు వచ్చిపడ్డాడు.
పంక్తి 108:
===ఇంకా రాక్షస వీరుల మరణం===
[[దస్త్రం:SL 16 2010 1 3.JPG|thumb|left|వానర సైనికులతో పోరాడుతున్న అతికాయుడు]]
శోకిస్తున్న రావణుడిని ఊరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు
నరాంతకుడి మరణంతో దేవాంతకుడు, త్రిశిరుడు, మహోదరుడు దుఃఖంతో అంగదుని మీదికి ఉరికారు. తగ్గకుండా అంగదుడూ ముగ్గురిపైనా పోరు సాగించాడు. అది చూసి హనుమంతుడు, నీలుడు అంగదునికి తోడు వచ్చారు. హనుమంతుడి పిడికిలి దెబ్బకు దేవాంతకుడి శిరస్సు వ్రక్కలై మరణించాడు. నీలుడు ఒక మహాపర్వతంతో కొట్టి మహోదరుని చంపేశాడు. త్రిశిరుడు వేసిన మహాశక్తిని హనుమంతుడు పెళ్ళున విరిచి వేశాడు. త్రిశిరుని మూడు తలలను వాడి కత్తితోనే ఒక్క వేటుతో నరికేశాడు. మహా పార్శ్వుడి గదను లాగుకొని వృషభుడు దానితోనే వాడి తలను పగులగొట్టాడు.
పంక్తి 128:
మండిపడిన రావణుడు కుంభకర్ణుడి కొడుకులైన కుంభుణ్ణీ, నికుంభుణ్ణీ యుద్ధానికి బయలుదేరారు. వారివెంట యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు కూడా వెళ్ళారు. వీరంతా మహాయోధులు. వారిని వానరసేన చుట్టుముట్టింది. అంగదుడు విసిరిన పర్వత శిఖరం క్రింద పడి కంపనుడు పిండి పిండి అయి చనిపోయాడు.
శోణితాక్షుడు, యూపాక్షుడూ, ప్రజంఘుడూ అంగదునిపైకి దుమికారు. అంగదునికి బాసటగా మైందుడు,
కుంభుడు రెట్టించిన రోషంతో వాడి బాణాలు వేసి మైందుడిని,
నికుంభుడు పెద్దపరిఘతో వానరులమీదికొచ్చాడు. హనుమంతుని వక్షస్థలానికి తగిలి ఆ పరిఘ ముక్కలయ్యింది. హనుమంతున గుద్దుకు నికుంభుని కవచం పగిలింది. ఇద్దరూ ఒకరినొకరు గుద్దుకున్నారు. చివరకు హనుమంతుడు నికుంభుని తల పట్టుకొని, మెడలు మెలిపెట్టి విరిచేశాడు. వానరులు సంతోషంతో గెంతులు వేశారు. రాక్షసులు భయభ్రాంతులయ్యారు.
పంక్తి 147:
;విరూపాక్ష, మహోదర, మహాపార్శ్వుల మరణం
రావణుని మహోగ్రశరధాటికివానర సైన్యము ఛిన్నాభిన్నమైంది. అతనికితోడు విరూపాక్షుడు కూడా విజృంభించాడు. రావణుడు రామునిపైకి ఉరికాడు. విరూపాక్షుడు వానరులను నాశనం చేయసాగాడు. సుగ్రీవుడు ప్రళయకాల ప్రభంజనంలా విజృంభించి, పర్వతాలకు పర్వతాలే విసిరేసి, అనేక రాక్షసవీరులను ఛిన్నాభిన్నం చేశాడు. అడ్డుకొన్న విరూపాక్షుని ముఖంపై సుగ్రీవుడు ఒక్క చరుపు చరిచేసరికి విరూపాక్షుడు రక్తంకక్కుకొని చచ్చిపోయాడు. దావితో మహోదరుడు అద్భుత పరాక్రమంతో వానరులను కూల్చసాగాడు. అతనిని నిలువరించిన సుగ్రీవునికి, మహోదరునికి దారుణమైన మల్లయుద్ధం జరిగింది. సుగ్రీవుడి దెబ్బకు మహోదరుని తల వ్రక్కలయ్యింది. మహాపార్శ్వుడు తన ఖడ్గంతో
===లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ ===
[[బొమ్మ:Hanuman fetches the herb-bearing mountain, in a print from the Ravi Varma Press, 1910's.jpg|thumb|మూర్ఛనొందిన లక్ష్మణుని రక్షణ కోసం ఓషధీ పర్వతాన్ని తెస్తున్న హనుమంతుడు.]]
రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించ సాగాడు. లక్ష్మణుడు రావణుని
రావణుడు విసిరేసిన శక్తి వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కరిపించసాగాడు. కొంత సేపటికి శక్తి లక్ష్మణుని విడచిపెట్టింది. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. జగత్తు అరావణం కానాలి" అన్నాడు. రామ రావణ సంగ్రామం చెలరేగింది. ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాలిలోకి ఎగిరి మేఘంలోకి దూరిపోయి లంకలోకి వెళ్ళిపోయాడు.
పంక్తి 159:
===రావణ సంహారం===
[[File:Killing of Rawana Painting by Balasaheb Pant Pratinidhi.jpg|thumb|ఎడమ|పోరాడుతున్న రామ రావణులు]]
అదే సమయంలో ఇంద్రుడు పంపగా [[మాతలి]] దివ్యమైన రథంతో
అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు సనాతనము, పరమ రహస్యము అయిన "[[ఆదిత్య హృదయము]]"ను ఉపదేశించాడు. సమస్త లోక సాక్షి అయిన సూర్యుని స్తుతించే ఆ మంత్రం జయావహం. అక్షయం. పరమ మంగళకరం. సర్వపాప ప్రణాశనం. చింతా శోకప్రశమనం. ఆయుర్వర్ధనం. సమస్త ఆపదాపహరణం. రాముడు ఆచమించి ఆ మంత్రరాజాన్ని మూడు మార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి, దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునకు నమస్కరించాడు. ధనుస్సు ధరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. రావణ సంహారానికి దీక్ష పూనాడు.
[[దస్త్రం:F1907.271.270.jpg|thumb|రావణుని మరణం]]
రావణుని సారధి మళ్ళీ రధాన్ని రాముని ముందుకు తెచ్చాడు. సకలాయుధ సంపన్నమై, ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది. ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రధాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలికి చెప్పాడు. సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింప సాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి
మహా సర్పాలవంటి రాముని బాణాలకు రావణుని తల తెగిపడింది. కాని వెంటనే మరొకటి మొలిచి ఉంది. ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తెగగొట్టినా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు. అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అది బుసలు కొడుతున్న సర్పంలా ప్రకాశిస్తున్నది. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్ని సూర్యులు, బరువులో మేరు మందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం. రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై విడచాడు. వజ్ర సంకల్పంతో, రాముని వజ్ర హస్తాలనుండి విడువడిన వజ్రసమానమైన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, అతని రక్తంతో పూయబడినదై, ఉపశమనం కోసం భూమిలో ప్రవేశించి, సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు.
పంక్తి 182:
రాముని కోరికపై ఇంద్రుడు చనిపోయిన వానరులందరినీ బ్రతికించాడు. సైన్యమంతా సంబరాలలో మునిగిపోయింది. అయోధ్య చేరాలన్న ఆతురతలో ఉన్న రాముడు విభీషణుని సత్కారాలను తిరస్కరించాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతో వానరులను సత్కరించాడు. విభీషణుడు, వానరులు తోడు రాగా పుష్పక విమానంపై సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో తమ లంకా యుద్ధ, సీతాపహరణ, వనవాస ప్రదేశాలను చూసుకొంటూ కిష్కింధను, గోదావరిని, యమునను, గంగను దాటి భరద్వాజ ముని ఆశ్రమం చేరుకొన్నారు. వానరుల సంతోషం కోసం అకాలంలో కూడా వృక్షాలన్నీ తియ్యటి పళ్ళతో విరగబూసేటట్లుగా రాముని కోరికపై భరద్వాజ ముని వరమిచ్చాడు.
ముందుగా హనుమంతుడు నందిగ్రామం చేరుకొని హనుమంతుడు భరతునికి సీతారామలక్ష్మణుల పునరాగమన సందేశాన్ని అందించాడు. ఆనందంతో భరతుడు అయోధ్యను అలంకరింపమని ఆనతిచ్చాడు. రాముని పాదుకలు శిరస్సుపై ధరించి పరివారసహితుడై ఎదురేగి రామునికి, సీతకు, లక్ష్మణునికి ప్రణమిల్లాడు. సుగ్రీవాది వీరులను ఆలింగనం చేసుకొన్నాడు. సౌహార్దంవల్ల తమకు సుగ్రీవుడు ఐదవ సోదరుడని
==శ్రీరామ పట్టాభిషేకం==
[[దస్త్రం:Ram Rajyabhishek.jpg|left|thumb|రాముని పట్టాభిషేకం]]
శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం నిశ్చయమయ్యింది. సుగ్రీవాజ్ఞతో జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు సుషేణుడు, గవయుడు, నలుడు నదీనద సముద్ర జలాలు తెచ్చారు. వసిష్ఠ మహర్షి ఋత్విక్కులతో కలిసి సీతారాములను రత్న సింహాసనంపై కూర్చుండబెట్టారు. వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, తరువాత ఋత్విక్కులు, బ్రాహ్నణులు, కన్యలు, యోధులు వారిని అభిషేకించారు. వారితోబాటే లోకపాలకులు, దేవతలు శ్రీరామచంద్రుడిని అభిషేకించారు. వాయుదేవుడు స్వయంగా బంగారు తామరపూల మాలికను రాముని మెడలో వేశాడు. ఆ సమయాన వసుధ సకల సస్యాలతోనూ రాణించింది. రాముడు బ్రాహ్మణులకు అనేక దానాలు చేశాడు. సుగ్రీవ, విభీషణ, జాంబవంతాది మహావీరులకు అనేక బహుమతులిచ్చి సత్కరించాడు. శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది.
యువరాజుగా ఉండడానికి లక్ష్మణుడు సమ్మతించలేదు. భరతునకు యౌవరాజ్యాభిషేకం చేశాడు రాముడు. తరువాత శ్రీరాముడు అశ్వమేధం, పౌండరీకం, మరెన్నో క్రతువులు చేశాడు. లక్ష్మణుడు తనకు సాయపడుతూ ఉండగా పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలవం చేశాడు. శ్రీరాముని రాజ్యంలో జనులు సుఖసంతోషాలతో ఉన్నారు. స్త్రీలు వైధవ్యం ఎరుగరు. వృద్ధులు జీవించియుండగా పిన్నవాళ్ళు మరణించలేదు. మేఘాలు కాలానుగుణంగా వర్షించేవి. ధరణి సస్యశ్యామలంగా ఉండేది. ప్రజలు కులవృత్తులను నిర్వహిస్తూ ధర్మపరాయణులై ఉండేవారు.
పంక్తి 228:
</poem>
[[ఆధ్యాత్మ రామాయణం]]లో రావణ వధానంతరం శ్రీరాముని వర్ణన ఇలా
<poem>
:హత్వా యుద్ధే దశాననం త్రిభువన విషమం వామ హస్తేన చాపం
పంక్తి 235:
:వీరశ్రీ బంధురాంగః త్రిదశ పతి నుతం పాతు మాం వీర రామః
</poem>
మూడు లోకాలకు కంటకుడైన రావణుని సంహరించిన రాముడు ఎడమ చేత చాపము భూమిపై ఆనించి ఉన్నాడు. రెండవ చేత ఒక బాణాన్ని త్రిప్పుతున్నాడు. కనులు ఎర్రబడి ఉన్నాయి. శరీరం బాణాలతో గాయపడి కోటి సూర్యులవలె వెలుగుతున్నది. వీరశ్రీబంధురమై
== ఆధ్యాత్మిక విశేషాలు ==
పంక్తి 257:
* సుందర కాడంము, పారాయణ గ్రంథం - రచన: శ్రీమాన్ ఎస్.టి.పి.వి.కోనప్పాచార్యులు - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2002)
* ఉషశ్రీ రామాయణం – రచన: [[ఉషశ్రీ]] - ప్రచురణ: శ్రీ మహాలక్ష్మీ బుక్ కార్పొరేషన్, విజయవాడ (2005)
* శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము (శ్లోకములు, తాత్పర్యములు) - అనువాదకులు: డాక్టర్ ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వేంకటరామయ్య - ప్రచురణ: గీతా ప్రెస్, గోరఖ్పూర్ (2003)
== బయటి లింకులు ==
|