బూర్గుల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రాజకీయ జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , పార్టి → పార్టీ , → using AWB
→‎రాజకీయ జీవితం: +బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం లింకు
పంక్తి 46:
హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. [[1931]]లో [[నల్గొండ]] జిల్లా [[దేవరకొండ]]లో జరిగిన [[రెండవ ఆంధ్రమహాసభ]]కు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, [[క్విట్ ఇండియా ఉద్యమం]]లోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. [[1948]]లో [[పోలీసు చర్య]] తరువాత [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు]] అయి, వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సిసైటి ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ 222</ref>
 
[[1952]]లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాక ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో [[ముఖ్యమంత్రి]] అయ్యాడు. పూర్తి మెజారిటీ లేకున్ననూ, మంత్రివర్గంలోనూ[[బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం|మంత్రివర్గంలో]] సంపూర్ణ సహకారం లేకున్ననూ, పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు.<ref>ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 56</ref> [[1956]]లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు]] అయినపుడు, కొత్త రాష్ట్రానికి [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యాడు. బూర్గుల, [[కేరళ]] రాష్ట్రానికి [[గవర్నరు]]గా వెళ్ళాడు. [[1960]] వరకు కేరళ గవర్నరుగా పనిచేసి, తరువాత [[1962]] వరకు [[ఉత్తర ప్రదేశ్]] గవర్నరుగా పనిచేసాడు.
1948 జనవరిలో ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా హైదరాబాద్ వచ్చిన కె.యం. మున్షీని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సంవత్సరంలోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కృషి సల్పిన తీరు విశేషమైనది. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో వీరు చేపట్టిన సేవ ప్రత్యేకమైనది. ఖాదీ బోర్డు విచారణ సంఘం, [[మధ్యప్రదేశ్]] విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజం అధ్యక్షులుగా ఉన్నారు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల తెలుగు [[ఉర్దూ అకాడమీ]], భారతీయ విద్యాభవన్, ప్రశాంతి విద్వత్ పరిషత్ అధ్యక్షులుగా గొప్ప సాంస్కృతిక సేవలందించారు. క్లాసికల్ లాంగ్వేజి కమిషన్ సభ్యులుగా, [[దక్షిణ భారత హిందీ ప్రచార సభ]], [[సంస్కృత పరిషత్‌]]ల ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించారు.