దార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==జీవిత విశేషాలు==
వేంకటేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లాలోని పవిత్ర గౌతమీ నదీ తీరంలోని కోనసీమ ప్రాంతంలోజిల్లా [[అమలాపురం]] దగ్గరలోని [[కాట్రేనికోన]] మండలం, [[చెయ్యేరు]] అగ్రహారంలో శ్రీ లంకయ్య, శ్రీమతి పెదనాగమ్మ దంపతుల తృతీయ కుమారుడుగా జన్మించారు. అమలాపురంలో ప్రసిధ్ద విద్యాకేంద్రంగా పేరున్న కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలోబి.ఏ (స్పెషల్ తెలుగు) వరకూ చదువు కున్నారు. ఆ తర్వాత [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]]లో ఏం. ఏ,, [[తెలుగు]]లో చేరి, అక్కడే ఎం.ఫిల్,. పిహెచ్.డి. పరిశోధనల్ని చేశారు. డా. యస్. టి. జ్ఞానానందకవి గారి [[ఆమ్రపాలి]] పై ఎం.ఫిల్., ‘‘జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన’’ పేరుతో పరిశోధన చేశారు. ‘‘పరిశోధకుడుగా ఆరుద్ర’’ అనే అంశంపై పిహెచ్.డి. పరిశోధన చేసి [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]] నుండి 2003లో డాక్టరేట్ డిగ్రీని పొందారు. [[ఆంధ్రప్రదేశ్]] పబ్లిక్ సర్వీసు కమీషన్ నిర్వహించిన పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపన్యాసకుడుగా ఎంపికయ్యారు. శ్రీ అనంత పద్మనాభ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల, వికారాబాదులో డిగ్రీ అధ్యాపకుడుగా కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత 2004 నుండి హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
 
==సాహిత్యప్రవేశం:==