చి
సవరణ సారాంశం లేదు
Content deleted Content added
+సైనీ లింకు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 30:
}}
[[File:Kurukshetram-Te.ogg]]
'''కురుక్షేత్రం''' ([[హిందీ]]: कुरुक्षेत्र) అనే ప్రదేశం ముందు పంజాబు రాష్ట్రంలో ఉంటూ వచ్చింది. ప్రస్తుతం [[హర్యానా]] రాష్ట్రంలో కురుక్షేత్ర జిల్లాలోని పట్టణము. కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి. పురాణాలలో ఇది పవిత్ర భూమిగానూ ధర్మక్షేత్రంగా పిలువబడుతూ వచ్చింది. కౌరవసాంరాజ్య పూర్వపు చక్రవర్తి అయిన కురుమహారాజు యాగం చేసినభూమి కనుక ఇది కురిక్షేత్రం అయింది. ఇక్కడ 18 అక్షౌహినుల సైన్యం మరణించిన మహాభారత యుద్ధం జరిగిందని పురాణ కథనాలు వివరిద్తున్నాయి. [[శ్రీకృష్ణుడు]] అర్జునుడికి భగవద్గీత బోధించిన అర్జునుడిని అయోమయ స్థితి నుండి వెలుపలకు తీసుకువచ్చిన ప్రదేశం ఇదని భారతకథ వివరిస్తున్నది.
చారిత్రక ప్రసిద్ధి చెందిన ధానేశ్వర్ లేక స్థానేశ్వర్ ప్రస్తుత కురుక్షేత్రం అని పిలువబడుతున్న నగరానికి ఆనుకుని ఉంది. ఇక్కడ ఉన్న స్థానేశ్వర్ ఆలయం కారణంగా ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది. స్థానేశ్వర్ ఆలయంలో మూలదైవం [[మహాశివుడు]]. ఈ ప్రాంతంలోని అతి పురాతన ఆలయం ఇదే. ఇక్కడకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అమిన్ గ్రామంలో ఉన్న శిథిలావస్థలో ఉన్న కోట అభిఅన్యుడిదని విశ్వసిస్తున్నారు. కొన్ని హిందూ పురాణకతనాలను అనుసరించి కురుక్షేత్రం దాదాపు ప్రస్తుత హర్యానా ప్రాంతమని భావిస్తున్నారు. తైత్తరీయ అరణ్యక కథాన్ని అనుసరించి కురుక్షేత్రం టుర్గన ( పంజాబుకు చెందిన సిర్హింద్ లోని శృఘ్న/సుఘ్) కు దక్షిణంగా, ఖాండవ (డిల్లీమరియు మేవత్ ప్రదేశం) కు ఉత్తరంగా, మరు (ఎడారి) కు తూర్పున, పారిన్ కు పడమర ఉందని వర్ణించబడింది. 2013 జూలై ఆరంభంలో హర్యానాపురాతత్వ పరిశోఫ్హనాశాఖ మరియు పురాతన వస్తు పరిశోధనాశాలలు తమ మొదటి పరిశోధనలలో కురుక్షేత్రంలో లభించిన బౌద్ధస్థూప అవశేషాలు ప్రజల సందర్శనకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.
|