ఎన్.జి.రంగా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక using AWB
పంక్తి 42:
 
==స్వాతంత్ర్య సమరంలో==
1930 లో [[మహాత్మా గాంధీ]] పిలుపునకు స్పందించి, రంగా [[భారత స్వాతంత్ర్యోద్యమంలోస్వాతంత్ర్యోద్యమం]]లో పాల్గొన్నాడు. 1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రెసు పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై ''బాపు దీవెనలు'' అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946 లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948 లో [[శాన్ ఫ్రాన్సిస్కో]]లో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952 లో [[ఒట్టావా]]లో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954 లో [[న్యూయార్కు]]లో జరిగిన ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్ లోనూ మరియు 1955 లో [[టోక్యో]]లో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను [[భారతదేశం]] తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.ఈయన [[కాంగ్రెసు పార్టీ]] నుండి నిష్క్రమించి [[భారత కృషీకార్ లోక్ పార్టీ]], ఆ తరువాత సహకారరంగ వ్యవసాయానికి బద్ధవ్యతిరేకి అయిన [[రాజాజీ]]తో కలిసి [[స్వతంత్ర పార్టీ]]ని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. 1972లో రంగా తిరిగి కాంగ్రెసు (ఐ) లో చేరాడు.
 
==రాజకీయ జీవితము==
"https://te.wikipedia.org/wiki/ఎన్.జి.రంగా" నుండి వెలికితీశారు