ప్రతివాది భయంకర వెంకటాచారి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''ప్రతివాది భయంకర వెంకటాచారి''' బ్రిటిషు పాలనను సాయుధంగా ఎదుర్కొన దలచిన ఆంధ్రుడు. '''భయంకరాచారి''' పేరుతో పిలువబడే ఈయన జననం [[1910]] మరియు మరణం [[1978]]. ప్రతివాది భయంకరాచారి విప్లవకారుడు. [[కాకినాడ బాంబు కేసు]]లో ముద్దాయి. శిక్షపడి [[అండమాన్ జైలు]]లో కొంతకాలం ఖైదీగా ఉన్నాడు. ముస్తఫా ఆలీ అనే పోలీసు అధికారి స్వతంత్ర సంగ్రామానికి మద్దతిచ్చే కాకినాడ ప్రాంత నేతలపై లాఠీచార్జి జరిపాడు. మరియు ఇతర మద్దతుదారులను కూడా అతడు పలు ఇబ్బందులు పెడుతుండటంతో '''డి.ఎస్.పి ముస్తఫా ఆలీ''' ఖాన్ ను దోషిగా నిర్ణయించి, అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు, విప్లవ భావాలు కల దేశభక్తుడు భయంకరాచారి.
 
మరో ఎనిమిది మందితో చేరి ఒక పథకాన్ని రూపొందించాడు. [[కలకత్తా]], [[బొంబాయి]], [[పాండిచ్చేరి]] ల నుండి [[బాంబు]] తయారీ సామానులను సేకరించారు. ఈ పనులన్నీ రహస్యంగా చేసినప్పటికీ, తమకో బహిరంగ కార్యస్థలంగా ఉండేందుకు గాను ''సి.హెచ్.ఎన్.చారి అండ్ సన్స్'' అనే ఒక దొంగ కంపెనీని పెట్టారు. అయితే ప్రత్యక్ష చర్యలో అందరూ భాగస్వాములు కాదు. భయంకరాచారితో పాటు [[కామేశ్వరశాస్త్రి]] అనే వ్యక్తి మాత్రమే ఇందులో పాలుపంచుకున్నాడు.
 
[[1933]] [[ఏప్రిల్ 6]] న [[కాకినాడ]] లోని ఒక చోటికి ముస్తఫా రానున్నాడని తెలిసికొన్న వీరు, బాంబులు తయారుచేసుకొని అక్కడ మాటు వేసారు. అయితే ముస్తఫా అక్కడికి రాలేదు. ఇద్దరూ నిరాశ చెంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళారు. [[ఏప్రిల్ 14]] న మళ్ళీ కాకినాడలోనే మరోచోట ప్రయత్నించారు. అయితే ఈ సారి కూడా వారనుకున్నట్టు ముస్తఫా రాలేదు. మళ్ళీ ఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ ఓడరేవులో మాటు వేసారు. మూడోసారి కూడా ముస్తఫా మాటు వైపు రాలేదు. ఈసారి ఇళ్ళకు తిరిగివెళ్ళక, బాంబులను అక్కడే ఉన్న ఒక పడవలో ఒక సంచిలో పెట్టి, దగ్గరలో ఉన్న హోటలుకు కాఫీ తాగేందుకు వెళ్ళారు. వీళ్ళు కాఫీ తాగుతూండగా రేవు కూలీ ఒకతను పడవలో ఉన్న సంచీని చూసి కుతూహలం కొద్దీ సంచీని తెరచి బాంబులను బయటికి తీసాడు. బాంబు పేలింది. ఆ కూలీతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు.