మింటో-మార్లే సంస్కరణలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
== 1909 సంవత్సరపు రాజ్యాంగ చట్టము నందలి నిష్ప్రయోజక సంస్కరణలు వాటి ఫలస్వరూపము ==
భారతదేశములో అప్పటి రాజప్రతినిధి గానుండిన వైస్రాయి (గవర్నర్ జనరల్) [[మింటో ప్రభువు]] (Earl of Minto) మరియూ ఇంగ్లాండు రాజ్యాంగ మంత్రి మోర్లే కలసి తయారు చేసిన శాసనమును 1909 లో ఇంగ్లండులోని బ్రిటిష్ పార్లమెంటులో ఆమోదముపోందిన ఇండియా రాజ్యాంగ చట్టము లో ఇమడ్చబడినవి. ఆ 1909 శాసనమే మింటో-మార్లే సంస్కరణములనబడింది. మింటో పూర్తి పేరు [[గిల్బర్టు ఎలియట్ ముర్రే]] ( కెనడాలోని మింటో పరగణాకు ఎరల్ GILBERT ELLIOT MURRAY, EARL OF MINTO). ఎరల్ అంటే మార్కిస్ అను తరగతి హోదా కన్నా అధికమైన తరగతి కల ఆంగ్ల ప్రభువు . ఎరల్ మింటో భారతదేశమునకు (1905-1910) మధ్యకాలంలో గవర్నర్ జనరల్ గానుండిన దొర. మోర్లే (పూర్తి పేరు [[జాన్ మోర్లే]] JOHN MORLEY) ఆ 1909 శాసనంవల్ల శాసనసభలు నిర్మించి అందు వారికి అనుకూలురగు మితవాదులను గులాములగు జమీందారులను సభ్యులుగాచేసి ప్రజాప్రాతినిధ్యమనిపించారు. పేరుకు సంస్సరణాలైనా వాటి అంతరార్ధము రాజ్యతంత్రమే అని చరిత్ర సమీక్షవలన తెలియును. మింటోదొర భారతదేశములో రాజ్యప్రతినిధిగా చేసిన రాజకీయతంత్రము హిందుా ముసల్మానులకి వైరం రగిలించటానికి అప్పటిలోఆంగ్లేయులకి మిత్రుడైన ముస్లిమ్ లీగ్ అను రాజకీయపార్టీలో సభ్యుడైన [[ఆగాఖాను]] గా ప్రసిధ్దిచెందిన సర్ సుల్తాన్ మహ్మద్ షా గారి ద్వారాకోరించబడినదిద్వారాకోరబడినది ముసల్మానులకి ప్రత్యేక ప్రాతినిధ్యత్వం. బ్రిటిష్ ప్రభుత్వమువారే మింటోమార్లే సంస్కరణములందు చేర్చారు. మహమ్మదీయులకే కాక ఇతర వర్గములవారికిగూడా అలాంటి ప్రత్యేక ప్రాతినిధ్యమునిచ్చుటకు రాజ్యాంగ సంస్కరణలు చేశారు. అంతేకాక ఓటువేసే హక్కుకు నియమించబడ్డ కనిష్ట అర్హతలు హిందువులకు చాల అధికపరిధిలో నిర్ణనియంచబడి మహ్మదీయులకు చాల తగ్గించబడ్డవి. ఉదాహరణకు హిందువులకు ముప్పై సంవత్సరముల విశ్వవిద్యాలయ పట్టభద్రత మహ్మదీయులకు ముూడు సంవత్సరముల పట్టభద్రత. హిందువులకైతే వార్షికాదాయము ముఫైవేల రూపాయలైతే మహ్మదీయులకు మూడువేలరూపాయలే.<ref> :The Longest August" Dilip Hiro(2015) Nation Books. pp 5-6</ref>. అటువంటి ప్రత్యేక ప్రాతినిధ్య పధ్ధతికి మార్లేదొర అభ్యతరం చూపినట్లుగా మార్లేదొర రచించిన Recollections of Lord Morley కనబడుచున్నట్లు మూలాధార పుస్తకములో ఉల్లేఖించబడింది. మింటో-మార్లే సంస్కరణలనుకలిగిన చట్టము ద్వారా అబ్బిన రాజ్యాంగము కేవలము బ్రిటిష్ వారు చేసిన కళ్లనీళ్ల తుడుపులైనప్పటికీ ఆ సంస్కరణల ద్వార కలుగజేయబడిన శాసన సభలు, అందు చేయబడిన అనేక తీర్మానములు, చర్చలు బ్రిటిష్ రాజ్యతంత్రముయొక్క ఆర్ధిక విధానమును గూర్చి, పరిపాలనా పద్దతలను గూర్చి [[గోపాలకృష్ణ గోఖలే]] గారి విమర్శనలు పత్రికలలో ప్రచురించబడుటవలన ప్రజలలో గొప్ప సంచలనము కలుగజేసినవి. ప్రజల రాజకీయ పరిజ్ఞానము వృధ్దికాజొచ్చెను. ఆవిధముగా 1909 చట్టములోని సంస్కరణలు నిష్ప్రయోజమై బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలనలోని ఉపశమనకార్యచరణే అయినప్పటికీ ఆ చట్టముద్వార వచ్చిన రాజ్యాంగము భారతదేశములోని విద్యావంతులు, మేదావులైన ప్రజలకు రాజకీయ విజ్ఞానము కలిగించుటకుపయోగపడినది. ప్రజలను స్వపరిపాలనాభిలాషులుగా చేసి స్వరాజ్యకాంక్ష పెంపొందించినది. <ref>The British Rule in India. D.V.SivaRao (1938) ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షరశాల, బెజవాడ 02/10/1938 పేజీలు 370-374</ref>.
 
==మూలాలు==