కొండా లక్ష్మణ్ బాపూజీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →జలదృశ్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జరిగినది. → జరిగింది. using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 21:
| year = |
}}
నిరంకుశ [[నిజాం]] వ్యతిరేక మరియు [[తెలంగాణ]] ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన '''కొండా లక్ష్మణ్ బాపూజీ'''
==బాల్యం, విద్య==
కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాదు జిల్లా వాంకిడిలో జన్మించారు. 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికి ఘర్ లో బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాబ్యాసం
==స్వాతంత్ర్యోద్యమం, నిరంకుశ నిజాం విమోచనోద్యమం==
1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవారు.<ref>చిరస్మరణీయులు, పి.వి.బ్రహ్మ, ప్రచురణ 2009, పేజీ 291</ref> 1942లో [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొన్నారు<ref>[http://beta.thehindu.com/news/national/article61482.ece?homepage=true The Hindu : News / National : Agitators, police clash at Osmania varsity<!-- Bot generated title -->]</ref>. దేశానికి [[స్వాతంత్ర్యం]] వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటున్ననూ, తెలంగాణ ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడినారు. 1947 డిసెంబరు 4న నిజాం నవాబుమీద బాంబులు విసిరిన [[నారాయణరావు పవార్]] బృందంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడే.<ref>స్వాతంత్ర్య సమరంలో తెలంగాణ ఆణిముత్యాలు, రచయిత మల్లయ్య</ref> ఆజ్ఞాతంలో ఉండి ప్రాణం కాపాడుకున్నారు.
==రాజకీయ జీవితం==
1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్]] పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. 1957లో [[చిన్నకొండూరు]] నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. 1967లో [[భువనగిరి]] నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973లో పి.వి.నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] ఒప్పుకున్ననూ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ [[జలగం వెంగళరావు]] పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు.
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 36:
==జలదృశ్యం==
1958లో సచివాలయం సమీపంలో [[హుస్సేన్ సాగర్|హుస్సేన్ సాగర్]] తీరాన (ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై) భూమి కొని జలదృశ్యం నిర్మించుకున్నాడు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేయగా కోర్టు తీర్పు బాపూజీకి అనుకూలంగా వచ్చింది. ఆయన అంత్యక్రియలు 22-09-2012 నాడు జలదృశ్యంలో జరిగింది.
==మూలాలు==
|