గద్వాల సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+vargaalu |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
''గద్వాల సంస్థానము'' [[తుంగభద్ర]] మరియు [[కృష్ణా నది|కృష్ణా]] నదుల మధ్య
1650 ప్రాంతములో ముష్టిపల్లి వీరారెడ్డి [[అయిజా]], [[దరూరు]] మొదలైన మహళ్లకు నాడగౌడుగా ఉండేవాడు. వీరారెడ్డికి మగ సంతానము లేకపోయడము వలన తన ఏకైక కుమార్తెకు వివాహము చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికము తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయినాడు. పెద్దారెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆనందగిరి, చిన్నవాడు సోమగిరి (ఈయననే సోమానాధ్రి, సోమన్నభూపాలుడని ప్రసిద్ధుడయ్యాడు). పెద్దారెడ్డి తరువాత ఆయన రెండవ కొడుకు సోమన్న [[1704]] నుండి నాడగౌడికము చేశాడు. ఈయనే కృష్ణా నది తీరాన గద్వాల కోట నిర్మించి తుంగభద్రకు దక్షిణమున రాజ్యాన్ని [[బనగానపల్లె]], [[ఆదోని]], [[సిరివెళ్ల]], [[నంద్యాల]], [[సిద్ధాపురం]], [[ఆత్మకూరు]], [[అహోబిళం]], [[కర్నూలు]] మొదలైన ప్రాంతాలకు విస్తరింపజేశాడు.
[[నిజాం]] అలీ ఖాన్ అసఫ్ ఝా II యొక్క పరిపాలనా కాలములో, దక్కన్లోని కొన్ని ప్రాంతములలో మరాఠుల ప్రాబల్యము పెరిగి 25 శాతము ఆదాయ పన్ను (''చౌత్'') వసూలు చేయడము ప్రారంభించారు. దీనిని ''దో-అమలీ'' (రెండు ప్రభుత్వాలు) అని కూడా అనేవారు. రాజా సీతారాం భూపాల్ [[1840]] లో మరణించాడు. ఆ తరువాత ఆయన దత్తపుత్రుడు రాజా సీతారాం భూపాల్ II సంస్థానమును పరిపాలించాడు. నిజాము VII ఈయనకు "మహారాజ" అనే పట్టమును ప్రధానము చేశాడు. [[1924]] లో మరణించే సమయానికి ఈయనకు భార్య మరియు ఇద్దరు కుమార్తెలు కలరు.
|