బూర్గుల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 46:
[[హైదరాబాదు]] రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. [[1931]]లో [[నల్గొండ]] జిల్లా [[దేవరకొండ]]లో జరిగిన [[రెండవ ఆంధ్రమహాసభ]]కు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, [[క్విట్ ఇండియా ఉద్యమం]]లోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. [[1948]]లో [[పోలీసు చర్య]] తరువాత [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు]] అయి, [[వెల్లోడి]] [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సిసైటి ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ 222</ref>
[[1952]] లో మొదటిసారి [[హైదరాబాదు రాష్ట్రం|హైదరాబాదు రాష్ట్రానికి]] ఎన్నికలు
1948 జనవరిలో ప్రభుత్వ ఏజెంట్ జనరల్గా హైదరాబాద్ వచ్చిన కె.యం. మున్షీని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ [[సంవత్సరం]]<nowiki/>లోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించాడు. హైదరాబాద్ సంస్థానం [[భారతదేశం]]<nowiki/>లో విలీనం కావడానికి కృషి సల్పిన తీరు విశేషమైనది. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో వీరు చేపట్టిన సేవ ప్రత్యేకమైనది. ఖాదీ బోర్డు విచారణ సంఘం, [[మధ్యప్రదేశ్]] విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజం అధ్యక్షులుగా ఉన్నాడు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల తెలుగు [[ఉర్దూ అకాడమీ]], భారతీయ విద్యాభవన్, ప్రశాంతి విద్వత్ పరిషత్ అధ్యక్షులుగా గొప్ప సాంస్కృతిక సేవలందించాడు. క్లాసికల్ లాంగ్వేజి కమిషన్ సభ్యులుగా, [[దక్షిణ భారత హిందీ ప్రచార సభ]], [[సంస్కృత పరిషత్]]ల ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించాడు.
|