ఖుదీరాం బోస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వాతంత్ర → స్వాతంత్ర్య, → (3), , → , using AWB
పంక్తి 12:
| known_for = స్వాతంత్ర్య సమరవీరుడు
}}
'''ఖుదీరాం బోస్''' భారతీయ స్వాతంత్రసమరవీరులలోస్వాతంత్ర్యసమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు. భారతదేశాన్నివేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు ఖుదీరాం. ఈ కారణంగా అతనిని ఉరితీసేనాటికి అతనివయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు.
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[పశ్చిమ బెంగాల్]], [[మిడ్నాపూర్]] జిల్లా హబిబ్‌పూర్‌లో [[1889]] [[డిసెంబర్ 3]]న జన్మించాడు. చిన్ననాటి నుంచి తీవ్రమైన స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోయేవాడు. మొదట్లో అఖ్రా అనే విప్లవ సంస్థలో చేరాడు. తన నాయకత్వ లక్షణాలు, సాహసోపేతమైన స్ఫూర్తితో ఆ సంస్థలో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇతనికి ఆయన టీచర్ సత్యేంవూదనాథ్ బోస్, భగవద్గీత స్ఫూర్తిగా నిలిచాయి. 1905లో బెంగాల్ విభజన అతడిలో బ్రిటిష్ ప్రభుత్వంపై మరింత కసి రేపింది. 16 ఏళ్ల వయసులోనే ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్‌లను బాంబులతో పేల్చివేశాడు<ref>[http://vsktelangana.org/khudiram-bose-balidana-divas/ ఖుదీరాం బోస్ బలిదానం]</ref>, <ref>[http://telugu.v6news.tv/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9B-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-19-%E0%B0%8F%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%95%E0%B1%87-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE స్వేచ్ఛ కోసం 19 ఏళ్లకే ప్రాణార్పణం]</ref>.
 
1907 ఆగస్టు 26న ఒక కేసు విచారణ సందర్భంగా ఎంతోమంది యువకులు కోర్టు ముందర ఆసక్తిగా గుమికూడి ఉన్నారు. పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ వ్యవహారాన్నికొద్దిదూరంలో నిలబడి చూస్తున్నసుశీల్ కుమార్ సేన్ అనే 15 ఏళ్ళ యువకుడు ఈ దాడిని చూసి భరించలేక ఆవేశంతో ఒక ఇంగ్లీష్ అధికారి ముక్కుమీద ఒక్కగుద్దు గుద్దాడు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ చేసిన జడ్జి కింగ్స్ ఫోర్డ్ అనే అధికారి. భారతీయులపట్ల క్రూరత్వానికి ఇతడు పెట్టింది పేరు. చిన్నవాడన్నదయలేకుండా సుశీల్ కుమార్ కు జడ్జి 15 కొరడాదెబ్బలను శిక్షగా విధించాడు. కానీసాహసవంతుడైన ఆ యువకుడు ప్రతి కొరడాదెబ్బకు వందేమాతరం అని నినదించాడు.
 
ఈ సంఘటన తరువాత స్వతంత్రవీరులంతా కింగ్స్ ఫోర్డ్ కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. మానవరూపంలో ఉన్న మృగమైన ఫోర్డ్ లాంటి వారు ఉన్నంతవరకు దేశభక్తవీరులకు కష్టాలేనని భావించి అతనిని చంపడానికి నిశ్చయించుకున్నారు.
 
1908 ఏప్రిల్ మొదటివారంలో జుగాంతర్ అనే విప్లవ సంస్థకి చెందిన విప్లవవీరులు కొందరు కలకత్తలో ఒక ఇంటిలో రహస్యంగా సమావేశమై కింగ్స్ ఫోర్ట్ ను అంతంచెయ్యడానికి ఒకప్రణాళిక రచించారు. ఆ సమావేశంలో [[అరబిందో|అరవిందఘోష్]] కూడా ఉన్నాడు. ఖుదీరాంబోసునూ ప్రఫుల్లచాకి అనే మరో నవయువకుడినీ ఈ పనికై నియమించారు. 1908 ఏప్రిల్ 30 రాత్రివేళ వీరిద్దరూ ముజఫర్ పూర్ లోని యురోపియన్ క్లబ్ కు ఒకబాంబు, రివాల్వర్ తీసుకొనివెళ్లారు. కింగ్స్ ఫోర్డ్ క్లబ్ బయటకురాగానే దానిపైకి బాంబును విసిరేసి ఇద్దరు చెరో దిక్కుకు పరిగెత్తివెళ్లిపోయారు.
 
అయితే ఖుదీరాం, ప్రఫుల్లచాకిలు గమనించని విషయం ఏమిటంటే అసలు ఆ వాహనంలో కింగ్స్ ఫోర్డ్ లేదు. అతని భార్య, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఒక రైల్వే స్టేషన్‌లో టీ తాగుతుండగా ఖుదీరాంబోస్‌ను పోలీసులు పట్టుకోగలిగారు. ఖుదీరాంను నిర్బంధించి రెండునెలలపాటు విచారణచేశారు. ముజఫర్ పూర్ బాంబు కేసులో ఫోర్డ్ భార్య, కుమార్తెల మరణానికికారకుడైన ఖుదీరాంకు మరణశిక్ష విధించారు. [[1908]] [[ఆగష్టు 11]]న ఈ శిక్ష అమలుపరచబడింది. పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరాం మృత్యువును ఆహ్వానించాడు. దేశం కోసం బలిదానం చేశాడు.
"https://te.wikipedia.org/wiki/ఖుదీరాం_బోస్" నుండి వెలికితీశారు