దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయన తల్లిగారు [[ద్రాక్షారామం]] వాస్తవ్యులు ఆలమూరు సూరయ్య గారి కుమార్తె. శివరావుగారి సతీమణి [[విశాఖపట్టణం]]కు వాస్తవ్యులు బుధ్ధిరాజు మూర్తిరాజు గారి [[కూతురు|కుమార్తె]] కమల. శివరావుగారు వృత్తిరీత్యా 1922 నుండి [[విజయవాడ]]లో ప్రఖ్యాత [[న్యాయవాది]]. అంతేకాక వారు చరిత్ర పరిశోధకుడుగా గ్రంథ కర్తగా ప్రసిధ్ధి.<ref>The National Biography of Indian Literature 1901-1953 సాహిత్య ఎకాడమీ, కొత్తఢిల్లీ, వాల్యూం 4, పేజీలు 251,416,417,419</ref><ref>నా జీవితగాధ-నవ్యాంధ్రము (1959) అయ్యదేవర కాళేశ్వరరావు పేజీ155-159</ref>,<ref>మిత్రులు నేను [[గొర్రెపాటి వెంకట సుబ్బయ్య]] (1970) పేజీ 186-193</ref>, గాంధీ వాది. [[మహాత్మా గాంధీ|గాంధీ]] ప్రవేశపెట్టిన అనే క సత్యాగ్రహ ఉద్యమములో వారి సేవ విశేషమైనది.<ref>[[ఆంధ్రజ్యోతి]] అక్టోబరు10,1966 "నేనెరిగిన శివరావుగారు" [[కాకాని వెంకటరత్నం]]</ref>. [[కారాగారము|జైలు]]<nowiki/>కు వెళ్ళటానికి ఏరోజుకారోజు సంసిధులైయ్యుండికూడా [[బ్రిటిష్]] ప్రభుత్వచేసే అన్యాయమును ప్రజలకు కాంగ్రెస్సు కార్యకర్తలకు తెలిసేటట్టు ఉదృతముగా ఆనేక రచనలు కాంగ్రెస్సువాదిగను వ్యక్తిగతముగను చేశారు. నిశతమైన [[న్యాయవాది]]గా వృత్తి రీత్యా వారు ప్రముఖులైనప్పటికి నీ వారు కేవలం వృత్తికే అంకితం అయి ధన సంపాదనే లక్ష్యం చేసు కోలేదు. విద్యార్థిగా చదువుకుంటున్న రోజలనుంచే దేశ చరిత్ర, స్వతంత్ర ఉద్యమాలకు తోట్పడుటకు దోహదం మైన వారి ఉపాధ్యాయుల ప్రసంగాలు, రచనలు, వారి పై ప్రభావం చూపటంవల్లం వారు వృత్తిలో ప్రవేశిస్తూనే ఆకాలంనాటి కాంగ్రెస్సు రాజకీయల్లో పాలుపంచుకుంటూ ఇంకో ప్రక్క ఏమాత్రం సమయం వృధాచేయకుండా వారు సాహిత్యకృషిలో మునిగి తేలుతూ వుండేవారు. చరిత్రకు సంబంధించి ఇంకా వెలుగు చూడని క్రొత్త విషయాలు చదవాలి వ్రాయాలి అనేది ఆయనకు లక్ష్యంగా వుండేది. అనేక పుస్తాకాలు చదివి చారిత్రాత్మకమైన అనే క అపురూపమైన వ్యాసములు, పుస్తకములు వ్రాశారు.<ref>" ప్రామాణిక చరిత్రకారులు ",అక్కిరాజు రమాపతి రావు ఆంధ్ర ప్రభ ఫిబ్రవరి 15,1988</ref> వారు నీతి నిజాయితీకి మరోపేరు.<ref>ఆంధ్రపత్రిక నవంబరు 9, 1986 "ద్రిషణా ధురంధరుడు" ప్రకాశచంద్ర శతపధి</ref> [[అవినీతి]] ఆటగోడుతనంసహించేవారు కాదు. కల్లాకపటం వారి దరిదాపుల్లోకి రావటానికి సాహచించేవికావు. 1930–1947 మధ్యకాలంలో గాంధీ గారి స్వాతంత్ర్యోద్యమం పిలుపులో వారు [[సాహిత్యం|సాహిత్య]], [[రాజకీయాలు|రాజకీయ]], [[న్యాయవాది|న్యాయవాద]] పరిజ్ఞానంతో చేసిన కృషి అపారం. [[ఉపన్యాసాలు]] ఇవ్వటం ఉపన్యాసాలకి వెళ్ళ టం వారు అరుదుగా చేశేవారు. [[స్వాతంత్ర్య సమరయోధులు]]<nowiki/>గా ఎటువంటి గౌరవాలు సన్మానాలు స్వీకరించేవారు కాదు. తను వృత్తిరీత్య న్యాయవాదినని, జైలుకు పోలేదని కారణాలు చెప్పి నిరాకరించేవారు. వినపట్టం కొంచంగా తక్కువ కావటంతోనే 1965 లోనే కోర్టుకు వెళ్లడం మానేశారు. అప్పటికి వారికి చాల పెద్ద పెద్ద కేసులు విచారణకుండేవి. ఆత్మగౌరవం వారికి సంధిపడరాని విషయం. కోర్టు మానేసినప్పటికీ వారి సలహాకోసం కక్షిదారులు వస్తూవుండేవారు. అలాగ వారు న్యాయ సలహాలు ఇస్తూ 1980 దాకా [[విజయవాడ]]లోనే వుండేవారు. వారి సతీమణి కమల 1978 లో పరమదించారు. 1980 లో 83 ఏండ్లు పైబడ్డ తరువారు శివరావుగారు [[హైదరాబాదు]]<nowiki/>లో వారి కుమార్ల వద్ద వుండేవారు. వారు [[సాహిత్యం|సాహిత్య]] కృషి మాత్రం మానకుండా జీవితాంతం చదవుతూ వ్రాస్తూ వుండి చివరకు 95 పైబడినతరువాత 03-10-1992 న [[భోపాల్]] నగరంలో “a narrative of the campaign in India which terminated the war with Tippusultan in 1792” అనే పుస్తకం చదువూతూనే వారి కుమారుని వద్ద చివరి శ్వాస వదిలారు. వారి సాహిత్య కృషే వారి జీవిత చరిత్రలో చాల పెద్ద పర్వం. వారు దాదాపుగా 40 పుస్తాకాలు, 400 వ్యాసాలు వాశారు. వారు వ్రాసిన [[వ్యాసాలు]] అనేక పత్రికల్లో ప్రకటితమయ్యేవి అనేక చారిత్రక విషయములు ఎక్కడెక్కడనుంచో త్రవ్వి బహువిధ కృషితో వాటిని తెలుగువారి కోసం సరళమైన తెలుగులో మంచి శైలిలో వెలుగులోకి తీసుకుచ్చారు. శివరావు గారు తన సమకాలికులు, మిత్రుల కంటే దీర్ఘ కాలం జీవించారు వారిజ్ఞాపక శక్తి అపారం. కచ్చితమైన తారీఖులు పేర్లు సంఖ్యలు వారికి కొట్టిన పిండి. వారి చేతివ్రేళ్ళమీద వుండేవి. కట్టల కట్టలుగా వ్రాసుకునియన్న నోట్సుల్లోంచి ఏ విషయంపైన కావలసినా చాల సునాయాసంగా బయటకు తీయగలిగేవారు. మొదటినుంచీ పుస్తకం చదువుతు న్నప్పుడే నోట్సు వ్రాసుకోటం వారికి చిరకాలపు అలవాటు. ఆ విధంగా వారు చరిత్ర పరిశోధన చేసి వ్రాసిపెట్టుకున్నఅనేక నోట్సుల కట్టలు చాలవిలువైన ఖజానాలాంటివి చరిత్రపరిశోధకులకు చాల ఉపయోగ పడగలవి ఇంకా ఉన్నాయి. వారి అముద్రిత గ్రంథములు, వ్యాసములు కూడా చాలవున్నవి. ముఖ్యంగా [[కథలు]] గాథలు 5 మరియ 6 భాగములు చాల విలువైనవి. వెంటనే ముద్రింప తగినవి. వారు చేసిన సాహిత్యకృషి వారి పుస్తకాలు వ్యాసాలు చెప్ప గలవు. న్యాయవాది వృత్తి, సాహిత్య కృషి, స్వాతంత్ర్యోద్యమములో [[కారాగారము|జైలు]]<nowiki/>కి వెళ్ళటం అనివార్యమైన స్థితిలో కూడా వారు వివిధరకాలుగా చేసిన కృషి విషేంచి చెప్పదగినవి. వాటిల్లో కొన్ని క్లుప్తంగా
# [[ఆంధ్ర]] [[మద్రాసు]] ప్రావిన్సల పై విపులమైన సమాచారము [[గాంధీ]]గారి హయామ్ లో కాంగ్రెసు అధిష్ఠానానికి పంపిచారు
# స్వాతంత్ర్యోద్యమములో [[కాంగ్రెసు]] కార్యకర్తలకు బోధపడేటట్లు కీలక [[రాజకీయాలు|రాజకీయ]] విషయములు, ప్రజాప్రభుత్వ విధానములు, బ్రిటిషవారు మనదేశంలో చేస్తున్నపక్షపాతపు పరిపాలన, వారు మనప్రజలను మన దేశ నిధులను ఏవిధంగా దోచుకుంటున్నదీ మొదలగు విషయముల గురించి అనేక కరపత్రములు వ్రాశారు
పంక్తి 66:
 
==సాహిత్య కృషి==
వృత్తి రీత్యా శివరావు గారు న్యాయ వాదైనా వారు సాహిత్యాభిలాషి. వారి జీవితం సాహిత్య కృషి కే అంకితం. శివరావు గారి సాహిత్యాభి రుచి చిన్నానాటి నుండే. పద్నాల్గెండ్ల ప్రాయంలో రెండవ ఫారంలో చదువుతుండగా 1912 లో వీరేశలింగం గారి సతీమణి గారి స్మారకోత్సవం శివరావు గారి ప్రార్థన భక్తచింతామణి పద్యాలు తోటి ప్రారంభం అయింది. అప్పట్ణుండీ [[రాజమహేంద్రవరం]]<nowiki/>లో సారస్వత సభలలో బాలుడైన శివరావు గారు చదవే భక్తచింతామణి పద్యాల ప్రార్థనతో ప్రారంభించటం పరిపాటి. వారు 3 వ ఫారంచదువతున్నప్పుడు చిలకమర్తివారి రామచంద్ర విజయమును పూర్తిగా వ్రాసినందుకు వారి క్లాస్ మాస్టారు భక్తచింతామణి (3వ సంకలనం) పుస్తకమును బహుకరించారు.. ఆరేళ్ల తరువాత, 1919 లో భక్తచింతామణి రచించిన [[వడ్ఢాది సుబ్బారాయుడు]]గారే స్వయంగా వారి చేతి దస్కత్తుతో భక్త చితామణి 8 వ సంకలన మును శివరావు గారికి బహుకరించారు. 1913 లోఆంధ్రభాషాభి వర్ధిని (చిలకమర్తి వారు స్దాపించి న సారస్వత సభ) లో సభ్యలుగా చేరారు. 1914 లో శివరావు గారి వ్యాసం “స్త్రీ విద్య” ఆలమూరు వెంకటరాజుగారి వ్యాసంతో పాటు గృహనిర్వాహకము అను చిన్నపుస్తకములో ముద్రింప బడింది. 1914 లో ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజము వార్షికోత్సనము అధ్యక్షుడుగా [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] గారు, కార్యదర్శిగా [[అద్దంకి సత్యనారాయణ శ]]ర్మగారు, సభ్యులుగా [[మైనంపాటి నరసింహ రావు]], [[అడవి బాపిరాజు]], బంధా వీరనారాయణదేవు, గుడిపాటి సూర్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, ఈరంకి నరసింహము, సూరంపూడి కనకరాజు, దిగవల్లి వెంకట శివరావు, పోణంగిపల్లి సత్యనారాయణ, చింతపెంటవెంకట రమణయ్య, వాసిరెడ్డి వీరభద్ర రావు, [[కవికొండల వెంకటరావు]] తదితరులు. ఆ వార్షికోత్సవాల సమావేశాలకు అనేక ప్రసిధ్ధ పురుషులు అధ్యక్షత వహించారు. వారిలో కొందరి పేర్లు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, శ్రీపాద కృష్ణమూర్తి గారు, [[చిలుకూరి వీరభద్రరావు]] గారు, [[వంగూరి సుబ్బారావు]] గారు, చెలికాని సుబ్బారావు గారు, నాళం కృష్ణారావుగారు, వడ్డాది సుబ్బారావుగారు,[[కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి]] గారు అలా 1914 లో జరిగిన సమావేశం లోశివరావు గారు స్త్రీ విద్య మీద ప్రసంగించారు. ఇంకో సారి “హిందూమహా జనులమతసభ, అనబడిన సమావేశం లో కందుకూరి వీరేశలింగం గారు కూడ హాజరైవున్నప్పుడు శివరావు గారు రామానుజాచారి పాత్ర వహించి తను రచించిన పద్యం చదవగా [[కందుకూరి వీరేశలింగం పంతులు|వీరేశలింగం]] గారు చాల ప్రసన్నులైయ్యారు. 1915-1916 సంవత్సరం లో SSLC క్లాసులో ఇంగ్లీషు పరీక్షలో ఉన్నత మార్కలుతో4 సెక్షన్ల మీద మొదటి స్దానం లో నిలిచినందుకు వారి క్లాస్ మాస్టారు గజవల్లి రామచంద్రరావు M.A గారు Life of Gladstone by John Morley 3 volumes బహుకరించారు. రాజమండ్రీ జ్ఞాపకాల్లో వారి డైరీ లో చిలకమర్తివారి కీ శ్రీపాద కృష్ణమూర్తిగారికి వకరిమీద వకరు ఎద్దేవపుర్వక వాదోపవాదాలు జరుగుతూవుండేవని వారి డైరీ లోరాజమండ్రీ జ్ఞాపకాలలో వ్రాసుకున్నారు. 1916 లో మద్రాసు ప్రసిడెంసీ కాలేజీ లో ఇంటర్మీడియట్ చదువుతుండగా “హత్యా ఛాయ” అను నవల తెలుగులో వ్రాశారు. ఆ నవల ఆధారంగానే 1929 లో నీలాప నింద అను పుస్తకము ప్రచురించారు. 1918 లో[[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] ఫైనల్ వుడగా [[మద్రాసు]] రాజధాని కాలేజీ తెలుగు విద్యార్థుల ఆంధ్ర భాషావర్ధని సమాజం తరఫున శివరావు గారు ఆంధ్ర వాణి అనేటివంటి చేతివ్రాత పత్రికకి సంపాదకులుగా వుండేవారు ఆపత్రికలో “ విడువము” అనే పేరుతో వ్రాశిన సంపాదకీయ ప్రచురణను చాలమంది అభనందించారు శ్రీ నూతక్కి రామశేషయ్య గారు (తదుపరి జయపూరు దివాన్ గాచేశారు ) చాల అభినందించారు. భహ్మశ్రీ వావిలకొలను సుబ్బారావు గారు ఆ చేతివ్రాత పత్రిక అభిమానులు. అదే కాలంలో 1918 లో శివరావు గారికి మద్రాసు సాధు సంఘం వారు శివరావు గారు వ్రాసిన “ రాజ భక్తి” అను వ్యాసమునకు రజత పతాకం బహుకరించారు. ఆ పతకం మద్రాసు జిల్లా కలెక్టురు గారు ప్రోగ్రెసివ్ యూనియన్ హాలు జరిగిన బహిరంగ సభలో బహుకరించారు. 1919 లో శివారవు గారు బి.ఏ చదువుతుండగా శ్రీ కృష్ణదేవరాయలు మీద వ్రాసిన వ్యాసం ఎమ్.పి శర్మ గారు మద్రాసులో సంపాదకులు గావున్న విద్యావిశాఖ పత్రికలో ప్రచురించ బడింది. 1919–1920 సంవత్సరంలో శివరావుగారు వ్రాసిన ఆత్మ విశ్వాసము అను వ్యాసమునకు [[చెన్నై|మద్రాసు]] రాజధాని కాలేజీ వారు చిరకాలంగా ప్రతీఏటా 1875 నుంచీ ఇస్తూవచ్చిన రూ 20 బౌరదల్లన్ బహుమతి 1919 సంవత్సలో శివరావుగారికి వచ్చింది. అంతకు పూర్వం ఆ బౌరదల్లన్ బహుమతిని పొందినవారిలో 1875 లో [[తల్లాప్రగడ సుబ్బారావు]] ( 1850-1890) ( సుబ్బారావు గారు మద్రాసు థియోసఫికల్ సొసైటీకి శక్రటరీ చేశారు, అనిబిశంటు కన్నా ముందు ). తరువాత 1891 లో వేపారామేశం గారికి ( వేపారామేశం గారు మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు ) పానుగంటి రామారాయణింగారికి in 1892, పెద్దిభొట్ల వీరయ్యగారికి 1894 and [[దాసు విష్ణురావు]] గారికి 1895 లోను వచ్చినట్లుగా శివరావు గారి డైరీ లోవ్రాసుకున్నారు. చిన్ననాటినుండి వారు గాంధీగారి సత్యాగ్రహ ఉద్యమం, స్వాతంత్ర్యపోరాటానికి వారి ఉపాధ్యాయుల ప్రేరేపణ వారి మనస్సుకు బాగా నాటుకున్నాయ. 1913- 1914 సంవత్సరం పాఠశాల విద్యార్థిగానుండగనే రాజమండ్రీలో వారు గాంధీగారు [[దక్షిణాఫ్రికా]]లో చేసే [[సత్యాగ్రహం|సత్యాగ్రహ]] ఉద్యమసహాయానికి నిధులు పోగుచేశి పంపిచారు. 1920 లో లాకాలేజీలో జేరేట్టప్పటికే గాంధీగారి సహాయనిరాకరణోద్యమము కొనసాగుతుండటం వారి మనస్సు ఆందోళనకు గురై స్వాతంత్ర్యపోరాటంలో తను కూడా పాలు పంచుకోవాలనే ఒక గట్టి సంకలనం రావటం జరిగింది. వారు ఎలాగో లాకాలేజీ చదువు పూర్తిచేసుకుని బయట పడుతూనే కాంగ్రెస్ రాజకీయాల్లో తన శక్తికొలది బాధ్యతలు నిర్వహించారు. లాకాలేజీలో జేరబోయే ముందు 1919 సంవత్సరం ఎండా కాలపు శలవలకి శివరావుగారు బొంబాయికి వెళ్లారు . అవి రౌలట్ బిల్లు తిరస్కారానికి తీవ్ర ఆందోళన చెస్తున్న రోజులు. ఆక్కడ బోంబే క్రానికల్ పత్రిక (బి.జి హర్నిమన్ సంకలనంచేసే పత్రిక ) సత్యాగ్రహ ఉద్యమాన్ని చాల అనుకూలంగా ప్రచురించేటటువంటి పత్రిక (ఆకారణంగా హర్నిమన్ నుకు దేశాంతర శిక్ష విధించారు deported ) శివరావు గారు ఆ పత్రికలో ప్రచురించిన వ్యాసాలు, విశేషాలు కత్తిరించి ఒక ఫైలలో అతికించుకుని తిరుగు ప్రయాణంలో బెజవాడకు వస్తుండగా ఒక సి ఐ ఢి పోలీసు రైలు బండి లోకి వచ్చి ఆ ఫైలు తనతో అట్లా తీసుకును వెళి తే తంటాల్లో పడతావని హెచ్చరించాడుట. మద్రాసులో లా చదువుతూవుండగనే 1920 నవంబరులో లియో టాల్సాయి, రంబీంద్రనాధ్ రచించిన 23 కథలు “కోడి గృడ్డంత వడ్లగింజ , మేము మీకు పట్టముగట్టితిమి, పధ్నాలుగేండ్ల ప్రాయము” అను 23 కథలు వారు తెలుగులో వ్రాసిన వ్యాసాలు ఆంధ్ర పత్రికలో ప్రచురితమైనవి. 1891 లో దాసు కేశవరావు గారు బెజవాడలో నడుపుచున్న జ్ఞానోదయము అను వార పత్రికలో1922 ఆ ప్రాంతములో శివరావు గారు రచించిన వ్యాసములు హైందవ నాటకరంగము, హైందవ వనోద కథలు అను రెండు వ్యాసములు చురితమైనవి
[[దస్త్రం:చళ్ళ పిళ్ళ వెంకటశాస్త్రి గారు.pdf|thumbnail|కుడి|దిగవల్లి వేంకటశివరావు చెళ్ళపిళ్ళ వేంకటశివరావుకు వ్రాసిన ఉత్తరం]]
1922 నుండి న్యాయవాది వృత్తితోపాటు సాహిత్యం, స్వాతంత్ర్యపోరాటం
 
1922 లో న్యాయవాది వృత్తిలో ప్రవేశిస్తూనే వారు ఒకప్రక్క [[మహాత్మా గాంధీ|గాంధీ]]<nowiki/>గారి ఆధర్వాన జరిగే జాతీయ ఉద్యమాల ఆందోళనల దిశానిర్ధేశాల ప్రకారం కృష్ణా జిల్లాలో జరిగే ఆందోళనకు మదత్తుగా కృషి చేయటం ఇంకొక ప్రక్క ఏమాత్రం సమయం వృధా చేయకుండా సాహిత్య కృషి చేయటం న్యాయవాది వృత్తితోపాటు గణ నీయం. వారు చేసిన సాహిత్య కృషి ప్రశంసనీయము బెజవాడలో నున్న రామమోహన లైబ్రరీలో నున్న చరిత్ర సాహిత్యమీద వున్న అనేక పుస్తకాలు చదవటమే కాక మద్రాసులోని కొన్నెమరా లైబ్రరీ నుండి తనకు కావలసి న పుస్తకాలు ఇంటికి తెప్పించుకునే ఏర్వాటు రామమోహన లైబ్రరీ వారి ద్వారా చాలా సంవత్సారలుగా శివరావుగారికి వుండేది. ఆ విధంగా వారు అనే క పుస్తకాలు మద్రాసునుండి తెప్పించుకును బహు విధ కృషి చేసి అనేక చారిత్రాత్మక విషయాలు తెలుగు వారికోసం అనేక పుస్తకాలు వ్యాసాలు వ్రాయగలిగారు. 1922 బి యల్ ఆఖరి సంవత్సరంలో వుండగనే ఆంధ్రుల సం స్క్రుతిక చరిత్ర అనే వారి వ్యాసం బొంబాయి లోని తెలుగు సమాచార్ అనే పత్రికలో ప్రచిరుతమైనది. పట్టాపుచ్చుకుని జూన్ 1922 లో బెజవాడలో న్యాయవాది వృత్తిలో ప్రవేశించి న తరువాత శ్రీ [[కురుగంటి సీతారామయ్య]] గారు M.A (was Head Master) నడుపుచున్న విద్యార్థి అను పత్రికలో శివరావు గారి వ్యాసములు (1) భారతీయుల లలిత కళలు (2) జాతీయవిద్య ప్రచురితమైనవి. 1923-24 లో “చిన్న కథలు”, “మన దారిద్య్రము”, “ తెల్మా ([[నార్వే]] దేశపు నవలాధార కధ) అను వ్యాసములు శ్రీ [[దుగ్గిరాల రాఘవచంద్రయ్య]] గారు బెజవాడనుండి పచురించే స్వరాజ్య పత్రికలో ప్రచురించ బడినవి. 1922 లో ప్రెసిడెంసీ కాలేజీ లో వ్రాసిన పోటీ వ్యాసము పోతన-వేమనుల వారి కాలము, కృతులు నకు శివరావుగారికి 1924 పొవెల్ మోరహెడ్ ప్రాదేశిక భాషల బహుమతి రూ 150 ఇచ్చారు. ఈ వ్యాసము నే ఆధారంగా చేసు కు ని 1924 లో పోతన వేమనలయుగము అనే పుస్తకము ను ప్రచురించారు. ఆ పుస్తకము[[వావిలకొలను సూరయ్య]] గారు, [[కొడాలి ఆంజనేయులు]] గారు నడిపేటటువంటి శారదాభాండారు ప్రెస్సు లో ముద్రితమైనది. 1923 లో కాకినాడ కాంగ్రెస్సు సదస్సుకు శివరావరు గారు కూడ వాలంటరీ భాద్యత లో వెళ్లారు. 19/08/1922 టంగుటూరు ప్రకాశం గారు ఉత్తరంవ్రాసి వారి స్వరాజ్య పత్రికకు స్పెషల్ కరెస్పాండెంటు గా వుండమని వ్రశారు అందు కు అంగీకరించిన శివరావు గారు 1922 కాకినాడ కాంగ్రెస్సు కు వచ్చిన [[దుగ్గిరాల గోపాల కృష్ణయ్య]] గారిని ఇంటర్వ్యూ చేసి స్వరాజ్యకి పంపిన రిపోర్టు ప్రచురితమైనది. 1925 లో [[వేలూరి సత్యనారాయణ]] గారి పుస్తకం బౌధ్ధమహా యుగం లో శివరావుగారి గారి సాహిత్యకృషి ని గూర్చి చెప్పారు. ఆదే సంవత్సరం లో [[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారు [[సింగరాజు వెంకట సుబ్బారావు]] గారింట్లో వుండగా డా [[ఘంటసాల సీతారామ శర్మ]]గారు శివరావుగారికి మొదటిసారిగా [[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారిని పరిచయం చేయగా వారు శివరావుగారిని తమ భారతి మాస పత్రిక కు వ్యాసాలు వ్రాస్తు వుండమని అప్పట్ణుంచీ భారతి ని శివరావుగారికి కాంప్లిమెంటరీ గా పంపిచే ఏర్పాటు కూడా చేశారు. రాజమండ్రీలోని హితకారణి స్కూలుకు పూర్వవిధ్యార్ధుల సంఘం కోరిక పై 1925 వార్షికో త్సవం కు శివరావు గారు అధ్యక్షత వహించారు. [[అయ్యదేవర కాళేశ్వరరావు]] గారి ప్రేరేపణపై శివరావుగారు 1927 లో “దక్షిణాఫ్రికా” అనే పుస్తకం ప్రచురించారు. ఆ పుస్తకమును మహామత్మా గాంధీ గారికి అంకితమివ్వడానికి గాంధీ గారి అనుమతి కోరుతూ వ్రాయగా గాంధీ గారు శివరావు గారికి స్వయంగా చేతో జవాబు వ్రాశిన పోస్టు కార్డులో వ్రాసిన వాక్యాలు ఈ క్రింద ఇవ్వబడినవి .
 
<poem>
పంక్తి 87:
</poem>
 
శివరావు గారి సాహిత్య, రాజకీయ రంగాలలో అభిరుచి కలగడానికి విద్యార్థి దశనుండే వారి అధ్యాపకుల బోధనలు, గొప్ప పుస్తకాలు వారి జాతీయ భావాలను చిగుర్చి స్వతంత్ర పోరాటానికి దోహ దం చేశాయి. 1920 లో వారు లా కాలేజీలో జేరిన సంవత్సరం గాంధీగారి సహాయనిరాకరణోద్యమం అప్పటికే జోరుగా సాగుతున్న రోజులు వారి మనసు కలవర పరచ సాగింది. న్యాయ వాది చదువు దైవాధీనంగా పూర్తిచేసుకుని బయటపడుతూనే స్వతంత్ర పోరాటసమరాటం అనేక విధాలుగా తనపాలు పంచారు. 1966 లో వారి సన్మాన సభలో మాట్లాడుతూ ఇట్లా చెప్పారు “ I read Savarkar’s war of Independence in 1929 and had no sleep for three nights” ఆ విధంగా అనేక సందర్భాలలో వారి మనస్సు మీద స్వతంత్ర పోరాటానికి ప్రేరణ కలిగింది. 1927 డిశంబరు 2 న భహ్మశ్రీ [[వేదం వెంకట రామశాస్త్రి]] గారు అప్పటికి బెజవాడలో నున్న ఆంధ్రవిశ్వవిద్యాలయ కాన్వోకేషనుకు వచ్చియుండగా బెజవాడ మ్యునిసిపల్ కౌన్సిల్ వారు శాస్త్రి గారిని సన్మానించటానిక సభ ఏర్వాటు చేసి శివరావుగారిచే వ్రాయించిన సన్మాన పత్రం శాస్త్రి గారికి ఇచ్చారు, 1929 లో కోఆపరెటివ్ సొసైటీ న్యూస్ అను పత్రికలో శివరావుగారు ‘ భారతదెశ దారిద్యము’ అను వ్యాసము వ్రాశారు. ఆవ్యాసమును ఆధారము చేసే “ నిరభాగ్య భారతము” అను వ్యాసము కృష్ణా పత్రికలో ప్రచురించారు. 1930 లో పశ్చమ కృష్ణా జిల్లా న్యూస్ వారు శివరావుగారు రచించిన అనేక చిన్న పుస్తకములను ప్రచురించారు. పశ్చమ కృష్ణా జిల్లా మాహా సంఘం వారు రాజకీయ పరి జ్ఞానము అను పేరుతో చాల చిన్నపుస్తకములను ప్రచురించారు వాటిలో శివరావు గారు వ్రాసిన వి ఆరు పుస్తకములు ప్రచురించారు ఆంధ్ర గ్రంథాలయం వారు ముద్రించారు. అందులో మొదటిది “సత్యాగ్రహ చరిత్ర” 12/03/1930 తేదీనా డు వెలువడింది. రెండవది “నిర్భాగ్య భారతము” 6/04/1930 నాడు వెలువడింది. అలాగ మిగత నాలుగూ దరిద్ర నారాయణీయము, సత్యాగ్రహ భూమి, సత్యాగ్రహ విజయము, పంచాజ్ఞాయుగము ఒకదానితరువాత ఒకటిగా వెలువడ్డాయి. ఈ “రాజకీయపరిజ్ఞానము” అను ప్రచురణలను బ్రిటిష్ ప్రభుత్వము వారు1933 నవంబరులో నిషేధిచారు. 1933 లో సహకార వస్తు నిలయము, [[అధినివేశ స్వరాజ్యము]] (Dominion Status ), and భారతదేశ స్థితిగతులు ” అను చిన్న చిన్న పుస్తకములను ప్రచురించారు. వారి అధినివేశ స్వరాజ్యము చాల ప్రఖ్యతి గాంచింది. 1934 లో ఆచార్య ఎన్ జి రంగా గారు [[నిడుబ్రోలు]] లో రైతు బడినొక దానిని స్తాపించారు. ఆ రైతు బడిలో శివరావు గారి పుస్తకాలు ను పాఠ్య పుస్తకాలు గా పెట్టారు. రంగా గారు శివరావు గారిని నిడుబ్రోలు వచ్చి అందులో విజ్ఞాన సాధనకై వచ్చే రైతాంగానితో సంభోదించమని ఆహ్వానించారు. కానీ శివరావు గారు వెళ్లటానికి వారి సమయం చాలలేదు. శివరావు గారు 1939 నుండీ బ్రిటిష్ యుగ చరిత్ర మీద పరిశోధన ప్రారంభించి తీవ్ర కృషి సల్పి అనేక వ్యాసములు వ్రాయటం ప్రారంభిచారు అలా వారు వ్రాసిన వ్యాసాలు అమృత సందేశము [immortal Message] లో ప్రచురించారు. ఆ పత్రిక బెజవాడలో సి వి రెడ్డి మరియు డి.యస్ శర్మ గార్లు సంకలనం చేశావారు అదే పత్రికలో శివరావు గారివి ఇంకో రెండు వ్యాసాలు—“ Christianization of India” మరియు “Hindu Muslim Civilization” అనే రెండు ఆంగ్ల భాషలో వ్రాసిన వ్యాసములను 1939- 1940 లో అమృత సందేశంలో ప్రచురించారు.. ఆంధ్ర మహా సభ వారు ఆంధ్రదేశ చరిత్ర వ్రాయించటానికి రచయితల సంఘం ఏర్పరిచారు. అందులో శివరావుగారని సభ్యులుగా నియమించారు . అట్లా నియమించినట్లుగా ఆంధ్రపత్రికలో వెల్లడైనది కూడా. 04/11/1943 తారీఖునాడు చిలకమర్తి వారు శివరావుగారికి జాబు వ్రాస్తూ వీరి సాహిత్య కృషి ప్రశంసించారు. 13/04/1945 తేదీన శ్రీ ప్రణవానంద స్వామి వారు శివరావు గారికి స్వయముగా గాయత్రీ మంత్రార్ధ వివిరము తెలియ పరిచారు. ఆరోజులలో 1930 నుండి -1947 దాకా వారికి చాల ప్రముఖు ల వుత్తరాలు వ్రాసియున్నారు. అప్పట్లోవారి కన్నా చాల పెద్దవారు వ్రాసిన ఉత్తారలలో గజవల్లి రామచంద్ర రావు,[[వడ్డాది సుబ్బారాయడు]],[[చిలకమర్తి లక్ష్మీ నరసింహం]], [[వావిలకొలను సుబ్బారావు]], [[చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి]], [[వేటూరి ప్రభాకర శాస్త్రి]], [[వేలూరి శివరామశాస్త్రి]], [[మాడపాటి హనుమంతరావు]],[[అయ్యదేవర కాళేశ్వర రావు]] మొదలగు ప్రముఖులు. వారి సమకాలీకులైన సాహిత్యవేత్తలు ఇంకా చాలా మంది వారితో తరుచు ఉత్తర ప్రత్తుత్తరాలు జరిపినట్లుగా తెలుస్తున్నది. ఇక్కడ వారి పేర్లివ్వటం సాధ్యమైన విషయం కాదు. 1930 -40 మధ్యకాలంలో వారు సహకార సంస్ధలకు సంబందిచిన పని కూడా చేశారు. కృష్ణా జిల్లా సహకార బ్యాంకు, సహకార సంస్ధ నిబంధనలు, ఉప ప్రబంధనలు ఏప్రిల్ 1935 లోను, మరియు గోదావరి జిల్లా సహకార బ్యాంకు ఉపప్రబంధనలు 1935 మే నెలలోను, తెలుగులో వ్రాశారు వాటినే ఆయా సంస్దలవారు రిజస్టరు చేయంచి 1935 మేనెలలో ముద్రించారు. 1935 లో బెజవాడలో కృష్ణా సహకార స్టోర్సు పేరుతో వున్న సంస్ధకు కార్యదర్శిగా కూడా చేశారు. చెరుకుపల్లి వెంకటప్పయ్యగారు అధ్యక్షుడు గానుండేవారు తరువాత ఆంధ్ర కోఆపరేటివి ఇనసేటిట్యూట్ కు డైరెక్టరుగా పనిచేశారు.. 17/06/1937 శివరావు గారు Resignation and dismissal of ministers” అని హిందూ దిన పత్రికలో ఉత్తరం వప్రచురించారు. 01/02/1938 న హిందూ పత్రికలో శివరావు గారు సేకరించిన భారత దేశ రాజ్యాంగ విధానము (constitution) లో నున్న విషయాలు కొన్నిటిని ప్రచురించారు. [[సి యఫ్ యాండ్రూస్]] గారు కాంగ్రెస్ అగ్రగణ్యడుగా వ్రాశిన ‘rise and growth of Congress’ అను పుస్తకము నకు మద్రాసు & ఆంధ్ర ప్రావిన్సుల పరిస్థితులను శివరావుగారు సేకరించి వ్యాసరూపంలో వారికి పంచారు.యాండ్రూస్ గారు 23/05/1939 శివారవూగారికి కృత్రజ్ఞతాపూర్వకమైన లేఖ వ్రాశారు 09/08/1942 తేదీన క్విట్ ఇండియా ఆందోళన ప్రారంభించినట్లుగా కాంగ్రెస్సు అగ్రనాయకులు ఉద్ఘోషించగానే గాంధీ గారిని అరెస్టుచేసిన కోన్ని నిముషములో ఆంధ్రలో ప్రొవెన్సియల్ కాంగ్రెస్సు వారు క్విట్ ఇండియా వుద్యమం ప్రారంభిచటానికి ఆంధ్ర కాంగ్రెస్సు నాయకుడైన [[కళా వెంకట్రావు]]గారి 29/07/1942 తేదీన ప్రకటన కర పత్రం సరళమైన తెలుగులో రేడియోలో ప్రసార నిమిత్తము వ్రాసిపెట్టమని [[నూకల వీరరాఘవయ్య]]గారు (వారి మరో పేరు శ్రీమతే) శివరావుగారిదగ్గరకు రాగా శివరావుగారు తెలుగులో వ్రాసిన పత్రం ముద్రించి యావధ్ధాంధ్ర దేశం పంచపె ట్టటం క్విట్ ఇండియా ఆందోళనలో జరిగిన విషయాలు. శివరావుగారు ఆంధ్రీకరించిన ఆ ప్రకటన పత్రం ఆనాటి కాంగ్రెస్సు కార్యకర్తలో చాల ప్రఖ్యాతి గాంచింది. 1946 లో మద్రాసునుండి ప్రచురితమైయ్యే [[న్యూ టైమ్స]] అనే పత్రికలో సంపాదకుడు యమ్ తిరుమలరావు సంపాదకుని మాటల్లో టంగుటూరి ప్రకాశంగారి జీవత చరిత్రని విషమంగా వ్యాఖ్యానించి వ్రాశారు. దానికి స్పందనముగా శివరావు గారు 12/08/1946 తేదిన ఆ పత్రిక సంపాదకునికి బహిరంగ లేఖ ఘాటుగా “Stop this disgraceful vilification of Prakasam” అని వ్రాసి పంపిచారు. ఆలేఖ ముద్రించి దానిమీద బెజవాడ పౌరులు న్యాయవాదులు సంతకాలు చేసి గాంధీగారికి పంపిచారు. ఆకాశవాణి ఢిల్లీలో [[వారణాశి సుబ్రమణ్యం]] గారు ప్రోగ్రమ్ డారెక్టరుగానున్నారు. వారు ఒక ఉత్తరంలో అప్పట్లో ఆంధ్ర ప్రొవిన్సియల్ కాంగ్రెస్సుకు అధ్యక్షుడుగానున్న [[ఆచార్య రంగా]]గారు టెక్నికల్ టెరమ్సు ట్రాన్సలేషన్ నిమిత్తము కమిటీనేర్పాటు చేస్తున్నారన్నీ ను, దానికి శివరావుగారిని అధ్యక్షనిగా వేస్తున్నారని దానికి శివరావుగారిని వద్దనకుండా స్వీకరించమని వారణాశి సుబ్రమణ్యంగారు వ్రాశారు. 1947 లో [[కొండా వెంకటప్పయ్య]] గారు తాను రచించిన వేంకటేశ్వర శతకం శివరావుగారికి బహుకరించారు. అదే సంవత్సరంలో బెజవాడ మునిసిపాలిటీ ఎన్నికలు జరిగినవి అధ్యక్ష పదవికి డా ఘంటసాల సీతారామశర్మ గారు పోటీ చేయ నిశ్చయించగా, వారికి ఎన్నికలు మానిఫస్టో శివరావుగారు తయారు చేశారు. [[కొమర్రాజు లక్ష్మణరావు]]గారు రచించిన పుస్తకం శివాజీ 3 వ సంకలనం 11/09/1947 తేదీన ప్రకటితమై న పుస్తకమునకు పరిచయ వాక్యాలు శివరావుగారు వ్రాశారు. అలే గే 4 వ సంకలనానికి కూడా డా [[కొమర్రాజు అచ్చమాంబ]]గారి తమ్ముడు [[కొమర్రాజు వినాయకరావు]] గారు కోరినమీదట మరల పరిచయవాక్యాలు శివరావుగారే వ్రాశారు. 1955 లో [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ]] సమితి వారు పెట్టబోయే సమితికి శివరావుగారి సలహాలు కోరారు. [[కంభంపాటి సత్యనారాయణగారు]] 1957 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ సంపాదకలుగానున్నప్పడు శివరావుగారు పెట్టిన షరత్తుల ప్రకారం ఏమాత్రం మార్పులు చేయకుండా 1857 పూర్వరంగములు అను పుస్తకమును విశాలాంధ్ర వారు ప్రచురించారు. 1957 లోనే నవోదయా పబ్లిషింగ్ హౌసు శివరావు గారు రచించిన సన్యాసుల స్వాతంత్ర్య సమరములు, ఆదిమనవాసుల యుధ్ధములు, మధుర నాయకులు అను మూడు పుస్తకములను ముద్రించుటకు నిశ్చయించి మొదటి రెండిటినీ వెంటనే ముద్రించారు.[[కాటూరి వెంకటేశ్వరరావు]]గారు అప్పట్లో (1957) కృష్ణా పత్రికకు సంపాదకుడుగానున్న [[కాటూరి వెంకటేశ్వరరావు]] గారు శివరావు గారిని తమ పత్రికకు వ్యాసములువ్రాయమని కోరారు.
శివరావుగారి సాహిత్య పరిశోధన, రచనలు క్రమ క్రమంగా 1922 నుండి శర వేగంతో వృధ్ది అవుతూవచ్చి 1940 నుండి 1950 మధ్యలో అత్యదికంగావున్నవని చెప్పవచ్చును. వారు వ్రాసిన వ్యాసములు పది ఇరవై కాదు, ఒకటి రెండు పత్రికల్లో అనికాదు. అనేక వ్యాసాలు, వరుసగా శీర్షికలుగా వివిధ పత్రికల్లో, బెజవాడలోని పత్రికలే కాక ఆంధ్ర దేశంలో మారుమూలల నుండి ప్రచురితమైన పత్రికలవారు శివారువూగారి వ్యాసాలు కావలని కోరటం కొన్ని కొన్ని వ్యాసాలు అటువంటి కొన్ని చిన్న చిన్న పత్రికలకూడా పంపించి ప్రచురింటం కనబడుతున్నది. ఉదాహరణకు [[జ్ఞానోదయము]] [[ప్రజామిత్ర]], [[కొరడా]], [[అమృతసందేశము]], [[సమదర్శిని]], [[గ్రంథాలయసర్వస్వము]], [[వసుమతి]], [[ప్రభాతము]], [[మాత్రు భూమి]],[[గ్రామోద్యోగి]],[[సహకారమిత్ర]] [[సమదర్శిని]], [[విజయవాణి]], [[జామీను రైతు]],[[ఆంధ్ర లాజర్నల్]], [[సమాలోచన]] ఇత్యాదులు. ఇంక మద్రాసునుండి ఆతరువాత బెజవాడనుండి ఇంకాతరువాత హైదరాబాదునుండి క్రమ క్రమంగా వచ్చిన అనేకం రోజూవారి, వీక్లీ, పక్ష మాస పత్రికలు శివరావుగారి వ్యాసాలు ప్రచురించని పత్రికంటూ లేదనటం అతిశయేక్తి గదేమో. వారి వ్యాసాల సూచీ చివరలో పత్రికవారి, సంవత్సరం వారిగా సాధ్యమైనంతవరకూ తయారుచేసి చివరలో జతపరచడమైనది.
===శివరావుగారి వద్ద కల అరుదైన పత్రికల ప్రచురణ ప్రతులు, పుస్తకాలు===
"మన మణిమాక్యాలు" అని 1993 ఫిబ్రవరి 15 నాటి ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో డాక్టరు అక్కిరాజు రమాపతిరావుగారు రచించిన వ్యాసములో దిగవల్లి వేంకట శివరావుగారి వద్ద ఎన్నేన్నో అపురూపమైన అరుదైన, అలభ్యైన పత్రికల ప్రచురణలు, పుస్తకాలు వుండేవని వ్రాశారు.1871 లో ప్రారంభిచబడిన ఆంధ్ర భాషాసంజీవని, 1872 లో బందరు నుండి ప్రచురించబ డే పురుషార్ధ ప్రదాయనీ, పురాతన కృష్ణాపత్రిక ప్రచురితమైన వ్యాసముల ప్రతులు, 18- 19 వ శతాబ్ధ ప్రచురితమైన కొన్ని అలభ్యమైన పుస్తకములు 1833 లో ప్రచురించబడ్డ "ఏనుగుల వీరస్వామయ్య గారి కాశీయాత్రచరిత్ర" మొదటి సంకలనము, 1862 లో ప్రచురించ బడ్డ స్వామినీననీన నరసింహ్మ గారి "హితసూచనీ" పుస్తకము మొదలగు కొన్ని ఉదాహరణంగా చెప్పడమైనది. వారు ఏ విషయమునైన వ్రాశారంటే ములాధారము లేకుండా వుండదు.<ref name= "మన మణి మాక్యాలు">"మన మణి మాక్యాలు" డా అక్కిరాజు రమాపతి రావు ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక ఫిబ్రవరి 15,1993</ref>
===అలనాటివిశేషములు కలిగిన వారి చేతి వ్రాత ప్రతులు===
వారివి అప్రచురిత గ్రంథములు, అప్రచురిత వ్యాసములు కాకుండా ఎన్నో అలనాటి సంగతులు కలిగిన విశేష ప్రతులు (1) "నా జ్ఞాపకాలు" (2) "నా జ్ఞాపకాలు-అభిప్రాయాలు" (3) "18-19 శతాభ్దపు ఆంధ్ర ప్రముఖులు" (4) "chronological Notes" మొదలగునవి. వారి జావకాలు నోట్సులనుండి కొందరు విశేష ప్రముఖలు గురించి వ్రాసిన విశేషాలు తీసి తెలుగు వికీపీడయాలో విడివిగా వ్యాసాలు వ్రాయతగినవి. అందులో ఒకరిద్దరు పేర్లు ఉదహరించక తప్పదు: [[ధర్మానంద సరస్వతి స్వామి|ధర్మానంద సరస్వతి]] , [[దర్మేంద్ర సత్యార్ది]] మొదలగు వారు.
 
==దిగవల్లి- చెళ్ళపిళ్ళ వారి సమకాలీక వ్యాసములు==
పంక్తి 120:
1930 నుంచీ 1947 మధ్యకాలంలో కృష్ణాజిల్లాలో ముఖ్యంగా బెజవాడలో స్వతంత్రపోరాటోద్యమాలలో జరిగిన అనేక సంఘటనలు, ప్రముఖుల కార్యకాలపాలు శివరావు గారు తమ డయరీలో వ్రస్తూ 1930 సంవత్సర జనవరీ మొట్టమొదటి అంశం తమ డైరీలో ఇట్లా వ్రాశారు “I was restless with the civil disobedience movement that was in the offing after declaration of Independence in Lahore Congress.” పశ్చమ కృష్ణా జిల్లాకాంగ్రెస్సు మహా సంఘము అనేక చిన్న చిన్న పుస్తకములను కాంగ్రెస్సు కార్యకర్తలకు రాజకీయ పరిజ్ఞానము అను పేరుతో ప్రచురించారు. అందులో శివరావుగారు వ్రాసిన చిన్న పుస్తకములు కూడా ఆరు పుస్తకములు ప్రచురించారు. మొట్టమొదటిది “సత్యాగ్రహ చరిత్ర” 12-03-1930 లో ఆంధ్ర గ్రంథాలయం లోముద్రించబడింది. రెండవది “నిర్భాగ్య భారతము” 06-04-1930 లో ముద్రించబడింది. ఆ తరువాత ఇంకో నాలుగు దరిద్ర నారాయణీయము, సత్యాగ్రహ భూమి, సత్యాగ్రహ విజయము, పంచాజ్ఞాయుగము అను నాలుగు పుస్తకములు కృష్ణా జిల్లా కాంగ్రెస్సు వారి ద్వారా ప్రచురించ బడినవి. ఈ రాజకీయపరిజ్ఞానము అను కృష్ణాజిల్లా కాంగ్రెసేవారి ప్రచురణలను [[బ్రిటిష్]] ప్రభుత్వము వారు నవంబరు 1933 లో నిషేధించారు. 1930 నుంచీ కాంగ్రెస్సుకార్యకలాప్పాలలో శివరావుగారు ఈవిధంగా వెనుకనిలబడి పనిచేశారు. కృష్ణాజిల్లా కాంగ్రెస్సు పబ్లిసిటీ సమితికి శివరావుగారి అధ్యక్షతన జరిగేది. ఏ రాజనీతి పరిజ్ఞాన కర పత్రంమైనా, కాంగ్రెస్ నాయకుల వ్రాతప్రతుల తర్జుమా లైనా శివరావు గారి కలంతో జరిగేది. 11/04/1930 తారీఖునాడు ఉప్పుసత్యాగ్రాహికుల మొదటి విడతగా గంపలగూడెం కుమార రాజాగారి అధ్యక్షతన బెజవాడనుండి బందరు దగ్గరు చిన్నపురానికి బయలుదేరారు. వారితోపాటు డా ఘంటసాల సీతారామశర్మగారు కూడానున్నారు. 4/04/1930 తారీఖునాడు డా. వెలిదండ్ల హనుమంతరావుగారి అధ్యక్షతన రెండవవిడత బెజవాడనుండి పాదగమనంతో రైల్వేస్టేషన్ కు వెళ్ళి అక్కడనుండి రైలులో మచలీపట్ణానికి వెళ్లారు. అక్కడ రాత్రి డా. పట్టాభిసీతారామయ్యగారింట బస చేసి మర్నాడు ప్రొద్దున్న ముగ్గురు డాక్టర్లూ ( హనుమంతరావుగారు, సీతారామయ్యగారు, శర్మగారు) కలసి 15-04-1930 తారీఖున [[బందరు]] దగ్గర చిన్నపురం చేరుకున్నారు. మొదటగా బయలుదేరిన కుమార రాజాగారు చిన్నపురంలో చేసిన ఉప్పు జమచేసుకుని బందరు పట్టుకుచ్చి బందరు బజారులలో అమ్మకం చేశారు. సత్యాగ్రహ సమర ఉగ్రతంగా జరిగే రోజల్లో శివరావు గారు వ్రాసిన అనేక కర పత్రములు పడమర కృష్ణాజిల్లా కాంగ్రెస్సుకమిటీ వారి ప్రచురణల క్రింద కాంగెస్సు కార్యకర్తలకు బోధనానుకూలముగా ముద్రించబడేవి. వారు వ్రాసిన “భారతీయుల దారిద్య్రము” అను వ్యాసము సహకారము అనే పత్రికలో ను, 10/03/1930 తారీఖున వారి పుస్తకము “సత్యాగ్రహ చరిత్ర” ఆంధ్ర గ్రంథాలయ ప్రెస్ లో ముద్రించబడింది. ఈపుస్తక ఆవిష్కరణం పడమర కృష్ణాజిల్లా వారి రణభేరీతో “శుక్ల సంవత్సరము ఫాల్గుణ శు బుధవారము నాడు సత్యాగ్రహ సమర సుభముహూర్తమున దిగవల్లి వేంకట శివరావు రచించిన సత్యాగ్రహ చరిత్ర డా//ఘంటసాల సీతారామ శర్మ, చెరుకుపల్లి వెంకటప్పయ్య, మంచాల సుబ్బారావుగార్ల చే ప్రకటింపబడినది” అని ఉద్ఘోటించబడినది 06/01/1930 తారీఖున వారి ఇంకో పుస్తకం “నిర్భాగ్య భారతము” పడమర కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీవారిచే ప్రచురించబడి స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా విడుదల చేయ బడింది. ఆ కాలంలోనే బెజవాడ బార్ యసోసియేషన్ వారు ఒక ప్రస్తావనచేసి స్వాతంత్ర్యోద్యమానికి సమర్దనగా తీర్మానించారు ఆసందర్భములో శివరాపుగారి డైరీలో ఇలా వ్రాసుకున్నారు “I was in great excitement”. 1930 మార్చి నుంచీ జూన్ మధ్య కాలంలో శివరావుగారివి మరి కొన్ని పుస్తకాలు కాంగ్రెస్సు కమిటీవారు ప్రచురించినవి “ ఆంధ్ర పౌరుషము, కాంగ్రెస్ నిర్మాణ కార్యక్రమము, పాంచజన్యము, దరిద్రనారాయణీయము, బార్డోలీ సత్యాగ్రహ విజయము, విదేశ వస్త్ర బహిష్కారము, బ్రిటిష్ వస్తు బహిష్కారము and సత్యాగ్రహ బోధిని” ఈ పుస్తకాలు సాధారణ ప్రజానీకానికి, కాంగ్రెస్సు కార్యకర్తలకు మన దేశ ఆర్థిక రాజకీయ, రాజ్యాంగ విషయాలను సరళమైన తెలుగులో బోధించడానికి ఉద్దేశించి వ్రాయబడిన పుస్తకాలు. బ్రిటిష్ వారు పరిపాలనలో మనదేశ ప్రజలను ఏవిధంగా ఆర్థికంగా దోచుకుంటున్నదీ ఈ పుస్తకాలలో బోధింప బడినవి. సబర్మతీలో తయారైన ఉప్పును గాంధీగారు తీసుకువచ్చిన రోజుతో జతగా బెజవాడలో శివరావుగారి పుస్తకము సత్యాగ్రహబోధిని 04-05-1930 తారీఖున వెలువడించ బడింది. 08/05/1930 నాడు బెజవాడలో డా [[వెలిదండ్ల హనుమంతరావు]] గారి ఆధ్వర్యాన్న జరిగిన ఉప్పుసత్యాగ్రహ ఉరేగింపులో శివరావుగారు కూడా వెళ్ళారు. కాంగ్రెస్స వారి అధినియమం ప్రకారం మారుమూలల గ్రామాలలో నున్న ఆర్థికక్షీణత, అభివృధ్ధి శూన్యత మొదలుగు అంశాల వాస్తవిక స్థితిని బయటకు తీశే నిమిత్తం చేయబడిన ఒక ప్రశానావళిని శివరావు గారు 10/05/1930 తారీఖనాడు తయారుచేయగా కాంగ్రెస్సు అగ్రనాయకులు గ్రామాలకు వెళ్లినపుడు కాంగ్ర్రస్సు కార్యకర్తలకు ఆప్రశ్నావళి పంచపెట్టి దానిని పూర్తిచేయించి తిరిగి తీసుకుచ్చి శివరావు గారికివ్వటం వారు వాటిని సంకలితంచేయించి వ్యాఖ్యానంచేసి కాంగ్రెస్సు అధిష్ఠానంకి పంపిచేవారు. ఉప్పు సత్యాగ్రహ ఆందోళన కాలం 1930 లో కృష్ణాజిల్లా ముఖ్యంగా బెజవాడలో జరిగనటువంటి కార్యకలాపాలు ఈ క్రింది విధంగా వివరించారు:
 
15/04/1930 తారీఖునాడు గంపలగూడెం కుమార రాజాగారు మరియు డా వెలిదండ్ల హనుమంతరావు గారు రెండు విడతలుగా చిన్న పురం వెళ్ళి వారు తయారు చేసితీసుకుచ్చిన [[ఉప్పు]]ను అమ్మకం చేశారు. 19/04/1930 నాడు నందిగామ బ్యాచ్ అయ్యదేవర కాళేశ్వర రావుగారి ఆధ్వర్యంలో చిన్న పురం లోఉప్పు తయారు చేయటానికి మచిలీ పట్ణం వెళ్లారు. తత్ఫలితముగా 28/04/1930 నాడు కాళేశ్వరావారుగారికి కారాగార శక్ష విధిచారు. మెదటి బ్యాచ్ లో ఉప్పుచేసిన వారికి అప్పటికే జైలులో నిర్భందిచ బడిన వారైన కుమారాజా గారిని జైలునించి తీసుకుచ్చి కోర్టులో హాజరు పరచారు. ముద్దాయిగా వచ్చిన కుమార రాజాగారికి గౌరవచిహ్నంగా ఆసమయంలో కోర్టు హాలులోనున్న యావన్మంది ప్లీడర్లు (శివరావుగారుకూడ) లేచి నిలబడటంతో ఆకోర్టులోనున్న ఆంగ్ల మాజిస్ట్రేటు నిశ్చేస్టుడై వెలవెల పోయాడు. ఆసమయంలో కుమార రాజాగారికి శివరావు గారే అమికసే క్యూరీ. సత్యాగ్రహం ఉద్యమంలో పోలీసు వారిచే అరెస్టు కాబడిన చాల మంది ప్రముఖ కాంగ్రెస్సు నాయకులను కోర్టులో హాజరు పరచిన ప్పుడు శివరావరు గారు కోర్టు వారి అనుమతితో అమికస్ క్యూరి [ అంటే ప్రత్యర్థి తరఫు వకీలు, defendant lawyer ]గా వుండేవారు. గంపలగూడెం కుమార రాజా గారు, డా ఘంటసాల శర్మ గారు మొదలగు ప్రముఖలకు కూడా శివరావు గారే అమికస్ క్యూరీగా నున్నారు. శివరావు గారి మీద వచ్చిన మొదటి రాజద్రోహం కేసు నంబరు 46 of 1930. అందులో శివరావు గారు Respondent (దోషి, = ప్రత్యర్థి ), తనకు వకీలు తానే. 1930 సెప్టెంబరు 12 వ తారీఖునాడు సర్కిల్ ఇన్ స్పెక్టరు స్వామి గారిచ్చివ వాగ్మూలం ఈ విధంగా “I am the Circle inspector of Bezawdada . I know the respondent. He took active part in civil disobedience campaign and is assisting all most all the civil resisters who were prosecuted by giving legal assistance. I also found him in Congress building whenever I went to arrest members there”. ఆ వాగ్మూలాన్ని బట్టి శివరావు గారు న్యాయవాదిగా స్వాతంత్ర్యసమర యోధములో ఎంత కృషి చేసినది విశదమౌతుంది.
 
04/05/1930 నాడు బెజవాడలోని యావన్మంది ప్లీడర్లు ఆప్పటి మూడురంగుల జాతీయ పతాకమును పట్టుకుని రహదార్లలోఊరేగింపుగా వెళ్లారు. 1/05/1930 నుంచీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు ఉప్ప సత్యాగ్రహ ఆందోళన కారణంగా జేలుకు వెళ్ళటం వలన వారు బెజవాడ మునిసిపల్ కౌన్సిల్ కు ఆధ్యక్ష పదవి పోయినది వారి స్థానములో సీ. కోదండ రెడ్డిగారిని ఎన్నకునుట జరిగింది. వీరుl 01/12/1930 వరకు అధ్యక్షునిగాకొనసాగారు. డా ఘంటసాల సీతారామశర్మగారు 1930 మే మధ్యలో పలు గ్రామాలకు పర్యటనచేసి శివరావుగారు చేసిన ప్రశ్నావళి పూర్తిచేయించి తీసుకుచ్చి యిచ్చారు. అంతలో ఉప్పు సత్యాగ్రహకార్యకలాపాలకి వారికి కూడా 18 నెలల ఖటిన ఖారా గార శిక్ష విధించబట్టి వారు కూడా జైలుకు వెళ్లారు. వారి కేసులో శివరావుగారు అమికస్ క్యూరీ (amicus curie ) గా నున్నారు. 21/06/1930 తేదీన బెజవాడలోని ఆంధ్రరత్న భవనాన్ని పోలిసు వారు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో సెక్షన్ 144 విధించారు మీటింగులూ ప్రసంగాలు నిషేధించారు. 1930 జూన్ నెల 6 వతారీఖునాడు రాజమండ్రీ జైలులో నున్న డాక్టరు ఘంటసాలసీతారామ శర్మ, వెలిదండ్ల హనుమంతరావు, డాక్టరు రాయప్రోలు సీతారామ శాస్త్రీ వేలూరి యజ్ఞన్నారాయణ శాస్త్రి, నూకల వీర రాఘవయ్య బ్రహ్మాండం నరసింహం గార్లను రాజమండ్రీ జైలునుండి తెల్లవార్ఝామున పాసింజరు రైలు బండిలో [[వెల్లూరు]]కు విజయవాడమీదుగా తీసుకు వెళ్లారు. [[విజయవాడ]] రైలు స్టేషన్ లో వారిని చూడ్డానికి వచ్చిన దిగవల్లి శివరావుగారు ఇతర మిత్రులును పోలీసు వారి నిఘాలో బహుక్లుప్తంగా మాట్లాడనిచ్చారు. అప్పడు రైలుబండిలో ఖైదీలు గానున్న వారిలో కొందరు శివరావు గారికి చిన్న చిన్న చీటీలు మీద సమాచారాం వ్రాసి పోలీసులు చూడకుండా అందిచారు. డా శర్మగారి చిన్న ఉత్తరం ఆరోజు శివరావుగారి కిచ్చిన దాంట్లో వారిని వెలిదండ్ల హనుమంతరావుగారి నీ ఆ రోజు తెల్ల వార్ఝామున పోలీసు సార్జంటు కృూరంగా నిర్దయగా లాఠీతో కొట్టాడని వారి సామానులు జగ్గులు కళ్ల జోడులు, లాంతర్లను విరక్కొట్టాడని అలా ఎందుకు చేసినదీ మావల్ల తప్పుఏమిటో మాక్కూడాతెలీదు అని వ్రాసి ఇచ్చారు. ఆ వుత్తరం నకలు శివరావుగారి చేతి దస్తురీతో వారి నోట్సులో నున్నది. స్వతంత్రయోధుడు, వకీలును అగు పీసుపాటి సీతాకాంతం గారు [[తిరువూరు]] జైలులోనుండగా జఫర్ షరీఫ్ అనే పోలీసు హెడ్ పోలీసు బంట్రోత్తు సీతాకాంతం గారి ధోవతిని తీసివైచి దౌర్జన్యంగా కొట్టాడు అందుకు సీతాకాంతంగారు ఆపోలీసు మీద క్రిమినల్ కేసు పెట్టగా ఆ కేసు విచారించిన జాయింట్ మేజిస్ట్రేట్ ఆపోలీసుకు చాలా తక్కువ శిక్షతో రూ 20/-జుల్మానా విధించారు. ఆ తీర్పును పై అధికారైన ఆంగ్లేయ జిల్లా కలెక్టరు పక్షపాత దృష్టిలో ఆమాత్రపు శిక్షకూడాఇచ్చివుండకూడదని వెల్లడించి నట్లు తెలిసింది. స్వాతంత్ర్య సమరయోదులైన బారూ రాజారావు గారు, ధూలియా జైలునుండి విడుదలై వారి స్వగ్రామం రాజమండ్రీకి వెళుతూ బెజవాడలో దిగి శివరావుగారి ఆతిధ్యం స్వీకరించారు. గాంధీ ఇర్విన్ సంధి క్రింద పోలీసు కేసులు ఉపసంహరణ ఫలితం గా02/03/1931 తారీఖనాడు ఇదివరలో జప్తుచేసి న ఆంధ్ర రత్న భవనాన్ని తిరిగి కాంగ్రెస్సు వారికి అప్పగించటానికి బెజవాడలో కాంగ్రెస్సునాయకులందరూ జైలులో వుండబట్టి శివరావుగారిని తత్కాలీన నాయకునిగా ఎంచి వారికి అప్పచెప్పారు. శివరావుగారు వారి మిత్రుడు చెరుకుపల్లి వెంకటప్పయ్య ఇతర కాంగ్రెస్సు కార్యకర్తలు కలసి ఆంధ్రరత్న భనన్ కు సున్నంకొట్టించి రంగులు కొంతవారకూ స్వయంగానే వేసి జైలునుండి బ్యాచ్ లు బ్యాచ్ లుగా విడుదలై వచ్చిన స్వతంత్ర యోధులకు సన్మాన పుర్వకంగా ఆహ్వానం చేశారు. అప్పుడు కాంగ్రెస్సు వాలంటీర్సుచేసిన నినాదం “నహీ డరెంగే ” జైలు నుంచి వచ్చిన మొదటి బ్యాచిలో వున్నవారు జి. దుర్గాబాయి, సృంగార కవి, లక్షమణ్ రావు మొదలగు వారు. 07/03/1931 తారీఖున [[టంగుటూరి ప్రకాశం]]గారు ఆంధ్ర రత్నభవన్ కు వచ్చి జాతీయ జండా ఎగురవేశారు. 12/03/1931 తారీఖున డా శర్మ, నల్లూరి పాపయ్య చౌదరీ, వేలూరి యజ్ఞన్నారాయణ మొదలగు వారిని వెల్లూరు జైలు నుండి విడుద లచేశారు. దారిలో మద్రాసులో కొన్నిరోజులుండి వారు 4/03/1931 తారీఖున బెజవాడ చేరుకున్నప్పు డు శివరావు ప్రభృతులు రైలు స్టేషన్ కు వెళ్లి స్వాగతం చెప్పారు కృష్ణా పడమర జిల్లా కాంగ్రెస్ కమిటీ మీటింగు మార్చి1931న 10/03/1931న ముదునూరులో జరిగిన సత్యాగ్రహ సన్మాన సభకు డా శర్మ, మతం బాలసుబ్రమణ్యం వెళ్ళారు
పంక్తి 128:
==1930 ,1931 సంవత్సరములలో శివరావుగారి పై రాజద్రోహం కేసులు==
 
గాంధీజీ దండి యాత్రకు బయలు దేరిన తేదీ12/03/1930. ఆదే రోజున బెజవాడ బార్ యసోసియేషన్ వారు గాంధీజీ నిరాకరణోద్యమము (Civil Disobedience movement) కు మద్ధతుగా ఒక సంకల్పమును (రిజొల్యూషన్) పాస్ చేశి మినిట్సు రికార్డు చేశారు. అరోజునాటి తమ వ్యక్తిగత మనోభావన శివరావుగారు తన డైరీలో ఇట్లా వ్రాశారు “I was in great excitement”. వారు ప్రత్యక్షంగా ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఉప్పు తయారుచేయక పోయినప్పటికీ వారు కాంగ్రెస్ కార్యకర్తగానూ, కృష్ణాజిల్లా కాంగ్రెస్ పబ్లిసిటీ అధినేతగనూ వారు చేసిన అనేక రచనలవలన ప్రజలను కాంగ్రెస్సు కార్యకర్తలను బ్రిటిష్ ప్రభుత్వంచేసే దుష్టపరిపాలనకు వ్యతిరేకంగా ప్రోద్బలం చేస్తున్నందు వల్లనూ శివరావుగారిని ఏక్షణమునైనా పోలీసువారు నిర్బంధనలోకి తీసుకుంటారని అందరకూ అప్పట్లో విశదమైన విషయం. శివరావుగారు కూడాఎరిగన విషయమే. అందుకని వారి కుటుంబం పిల్లల క్షేమం చూసే దిక్కు తన తల్లిగారైన మాణిక్యాంబగారి పేరట 06/04/1930 తారీఖు న ఒక ట్రస్టుడీడ్ వ్రాసి తన పేరుమీదనున్న స్దిరాస్తిని అవసరమైనప్పుడు అమ్మకం చేసుకోవచ్చని చెప్పి జైలు కెళ్లటానికి సంసిధ్ధులుగా వున్నసమయానికే 23/06/1930 తేదీన పోలీసు వారు సర్కిల్ ఇనస్పెక్టరు ఎన్ యల్ యన్ స్వామి ఆధ్వర్యంలో శివరావుగారి ఇల్లు సోదా చేసి వారు రచించిన పుస్తకములేవైతే ప్రభుత్వము నిషేధించారో వాటిని పట్టుకుని జప్తుచేశారు. ఆ పుస్తకాలతో పాటు బార్ యసోసియేషన్ వారి మినిట్సు పుస్తకం దేంట్లోనైతే బార్ యసోషియేషన్ వారి సంకల్పంచేసి న రిజొల్యూషన్ వున్నదో దాన్నికూడా జప్తు చేయటానికి ప్రయత్నించారు. పోలీసువారు శివరావుగారి మీద 25/08/1930 తారీఖున Sec108 CRPC సెక్షన్ 108 సి ఆర్ పి క్రింద కేసు MC 46/30 దాఖలు చేశారు మేజిస్ట్రేటు కోర్టుకు హాజరుకమ్మని సమన్ పంపిచారు. అప్పటి మేజిస్ట్రేటు హెజ్మడే అను ఐ సి యస్ అధికారి. శివరావు గారు జైలు కెళ్లటానికి సంసిధ్ధమౌతుండగా బెజవాడలో నున్న ప్లీడర్లు చాలమంది సిడాంబి రాజగోపాలచారి (పెద్ద ప్లీడరు) గారితో సహా కలసి వారింటికుచ్చి ఆకేసును కంటెస్టు చెయమని తను కనుక జైలు కెళ్లిపోతే మిగతా ప్లీడర్లమీద కూడా అలాంటి కెసులు వస్తాయని (బార్ యసోసియేషన్ వారు సత్యాగ్రహాన్ని సమర్ధిస్తూ రిజొల్యూషన్ చేసినందుకు) పట్టుబట్టగా శివరావుగారు కోర్టులో హాజరై తనమీద అట్లాంటి రాజద్రోహం కేసులో గవర్మరు ఇన్ కౌన్సిల్ వారి ఆమోదం కావలసియుండును. అటువంటి ఆమోదం లేకుండా ఈ కేసు దాఖలు చేయటం చట్ట విరుధ్ధ మని కంటెస్టు చేస్తూ పెటిషన్ పెట్టారు. ఆమరుసటి రోజునే ( 26-08-1930) తేదీన శివరావు గారి తృతీయ కుమార్తె జననం అవటం అందుకామెకు జయలక్ష్మి అని పేరు పెట్టంటం జరిగింది. పోలీసు వారు శివరావుగారి న్యాయవాది పట్టా రద్దు చేయటానికి హైకొర్టుకి వ్రాసినట్లుగా పోలీసు వారు మాజిస్ట్రేటుతో జిరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు కోర్టులో దాఖలు చేసినదానిని బట్టి తెలిసింది.<ref>స్వకీయవిలేఖరి ఆంధ్రపత్రిక సెప్టెంబరు 1930</ref> శివరావుగారి పెటిషన్ విచారణలో సర్కిల్ ఇన్ స్పెక్టరు స్వామి కోర్టులో శివరావుగారి రచనలు ప్రభుత్వద్వేషముకలుగజేసి సహాయనిరకణ పెంపోందిచేలాంటివి అనిన్నూ, శివరావుగారు తన న్యాయసలహాలతో అప్పటిదాక అరెస్తు చేయబడ్డ చాలమంది స్వతంత్ర సమరయోధుల తరఫును అమికస్ క్యూరిగా కోర్టువారి అనుమతితోనే పనిచేస్తున్నారన్నీనూ పోలీసు వారు ఎప్పుడు కాంగ్రెస్సు కార్యాలయానికి వెళ్లునా శివరావు గారు అక్కడ పుండటం జరుగుతున్నదన్నీనూ సర్కిల్ ఇన్ స్పెక్టరు గారు కోర్టులో తన వాగ్మూలంలో పేర్కొన్నాడు. ఆకేసులో సాక్ష్యంకోసం [[వెల్లూరు]] జైలులో నున్న నల్లూరి పాపయ్యచౌదరీ, వేలూరి యజ్ఞన్నారాయణశాస్త్రి గార్లను వెల్లూరు సెంట్రల్ జైలునుండి పోలీసు యస్కార్టుతో బోళెడుడబ్బు ఖర్చుచేసి 16-10-1930 తారీఖు వాయిదాకు తీసుకుచ్చారు. ఆ కేసు విచారణలో సర్కిల్ ఇన్ స్పెక్టరు సమక్షంలో ఆంధ్ర గ్రంథాలయ ముద్రణాలయానికి చెందిన కర్లపాలెం కోదండరామయ్య గారి వాగ్మూలం, మరి యు అనేక మంది స్వతంత్రసమరయోధలును సాక్షులుగా తీసుకువచ్చారు. వారిలో ఉప్పలూరి లక్ష్మీనరసిహారావు, సి వి కృష్ణయ్య నాయడు విజయరాఘవులు నాయడు భైరవ స్వామి స్పెషల్ డ్యూటి సబ్ ఇన్ స్పెక్టరు సూర్యదేవర రామచంద్రరావు, మంచాల వెంకట సుబ్బారావు మొదలగు వార్లను సాక్షులుగా పేర్కొన్మారు ఆ వాయిదా తేదీ నాడు శివరావుగారి పెట్టిన పెటిన్ ను ఆమోదించతూ మేజిస్ట్రేటు హెజ్మాడె గారు పోలీసువారి కేసు కొట్టివేయటం (quashed) జరిగింది. పోలీసు వారికి పరాభవం ఉక్కురోషం కలిగి వెల్లూరు నుండి తీసుకుచ్చిన సాక్షులను మరల తిరుగు ప్రయణంలో వెనక్కు తీసుకుని వెళ్లారు. పోలీసు వారు వెంటనే [[గవర్నరు]] ఇన్ కౌంసిల్ ఆమోదం కోసం సన్నాహాలు ప్రారంభించి రెండో సారి మళ్లీ ఇంకో కేసు దాఖలు చేశారు.
 
==మళ్లీ రెండో రాజద్రోహం కేసు==
పంక్తి 140:
==1932 civil disobedience movement ఉద్యమంలో శివరావు గారి పాత్ర, వారి కృషి==
 
ఆంగ్ల ప్రభు భక్తి, ఆంగ్ల సంస్థానలపై సంయమనం కలిగియున్నంత కాలం దేశీయ ఉద్యోగులలోను సామాన్య ప్రజలలోను గూడా స్వపరిపాలనా కాంక్ష కలుగదని గ్రహించిన గాంధీగారు ఈ సహాయ నిరాకరణోద్యమము చేపట్టారని శివరావుగారు 1966 లోజరిగిన తన సన్మాన సభలో చేప్పారు. 1932 ఏప్రిల్ నెలలో కాకినాడ వాస్తవ్యులు కాంగ్రెస్సు అగ్రనేత అయినట్టి డా [[చెలికాని రామారావు]] గారు కాంగ్రెస్సు బోధనలు కార్యకలాపాలు మార్గదర్శనాలు మోదలగు విషయాల కరపత్రాలు రహశ్యంగా బెంగుళూరు నుండి ముద్రించి ఈ ప్రాంతల్లో పంచపెట్టతున్న రోజులలో బెజవాడనుండి శివరావుగారు మారు పేరుతో (వెంకట్రావను మారు పేరుతో) వారితో కలసి పనిచేస్తూ తపాలా పెట్టిలాగ జనార్దనరావు అనే ఒక ఇన్స్యూరెన్స ఏజెంటు ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపెవారు.. ఇంకో ఇద్దరు జగన్నాద దాసు, ధరణీప్రగడ సేషగిరి రావు మద్రాసులో నుండి కాంగ్రెస్ కార్యకాలపాలకు ధనం పోగుచేశి ఇక్కడికి పంపిచేవారు. అన్నే ఆంజనేయులుగారు కాంగ్రెస్సు కార్యకర్తలకోసం గ్రామాలలో ప్రచురించే “Ready” అనే పత్రికకు శివరావుగారు చేదోడుగా బెజవాడనుండి అదే పత్రికను సైక్లోస్టైల్ చేసినెలకు 40 మందికి మేజస్ట్రేట్, పోలీసు ఆఫీసర్లకు కూడా పంపిచేవారు. ఈ సైక్లోస్టైల్డు పత్రికనడపటానికి వేలూరి యజ్ఞన్నారాయణ గారు, నూకల రామస్వామిరామ గారు కృషి సల్పేవారు. ఇంతే కాక బ్రిటిష్ ప్రభు భక్తులైన ఉద్యోగస్తులను, పోలీసు వారిని హెచ్చెరిస్తూ కాంగ్రెస్సు ప్రభుత్వము త్వరలో రాబోవునని ఇప్పుడు బ్రిటిష భక్తులు వారి వారి దష్ట చర్యలకు జవాబుచెప్పుకునే రోజు త్వరలోనే రాబోవునని హెచ్చరిస్తూ శివరావుగారు వ్రాసిన కరపత్రములు అచ్చువేయించి కాంగ్రెస్సు కార్యకర్తలు వాటిని పంచపెట్టేవారు. 14/07/1932 నాడు శివరావుగారు మద్రాసు లెజిస్లెటివ్ కౌన్సిల్ కు ఒక ప్రార్థనా పత్రం పంపి కృష్ణాజిల్లాలో జరుగుతున్న పోలీసు వారి నిరంకుశత్వమైన లాఠీ చార్జీలును గూర్చి. ఆ పత్రంలో వారు పోలీసువారి లాఠీచార్జీలో దెబ్బలు తగిలి బెజవాడలోని పీపుల్సు హాస్పిటల్ అన బడే డా శివలంక మల్లిఖార్జునరావుగారి వైద్యశాలలో వైద్యసహాయం పొందిన వారి దిన దిన సంఖ్యలతో సహా పంపిచారు. ఆగస్టు 1932 లో శివరావుగారు కాంగ్రెస్ పశ్చమ కృష్ణా జిల్లా వారి తరఫునే కాకుండా ఆంధ్ర ప్రొవెస్సియల్ తరఫున రెండు వేరు వేరు రిపోర్టులు తయారుచేసి కాంగ్రెస్స అధిష్టానంలో మదన్ మోహన్ మాలవ్యా గారికి అప్పటి బనారస్ హిందూ విశ్వావద్యాలయ కాలేజీ ప్రిన్సిపాలుగా నున్న రుద్రాగారి ద్వారా పంపించారు. ఆరెండు రిపోర్టులు కాంగ్రెస్సు అధిష్ఠానం 15/10/1932 తారీఖునాటి ఎ ఐ సి సి వారి జాతీయ బులెటిన్ లో ముద్రించారు. అంతే కాక ఎ ఐ సి సి వారు తమ రిపోర్టులో పశ్చమకృష్ణా జిల్లా వారి ఈ రిపోర్టులను కొనియాడారు. 1932 సెప్టెంబరు 5 నాడు ఇండియా లీగు డెలిగేషన్ వారు బెజవాడ వచ్చినప్పుడు కాంగ్రెస్సు వారి తరఫున శివరావు గారు ఒక మేమొరాండమ్ వ్రాసి స్వయంగా లీగు సభ్యులను కలుసుకుని వారికి అందజేశారు. బెజవాడలో జనవరి 4 వతారీకు 1932 లో section 144 CRPC క్రింద మీటింగులు నిషేధిస్తూ చాటింపుచేసి ప్రత్యేకంగా డా శర్మగారు ప్రభ్రతుల పేరు పేరునా నోటీసు జారీ చేశారు. శివరావు గారు రచించిన 1930 లో ప్రచురించిన ఒక కరపత్రము “దరిద్రనారాయణ “ 1932 లో ప్రెస్స్ రెగ్యులేషన్ ఆర్డినెన్స క్రింద నిషేధించారు [ Saint George Gazette 1932 ]. శివరావుగారు రచించి న కరపత్రాలను ( నిర్భాగ్య భారతము, విదేశ వస్త్ర బహిష్కారము, బ్రిటిష్ వస్తు బహిష్కారము మొదలగు కరపత్రములును ) ఆయ్యదేవర కాళేశ్వరరావు, కాట్రగడ్డ మధుసూదన రావు, కాకుమాను లక్షయ్య చౌదరీ గార్లు పంచపెట్టారని నేరారోపణ కేసు మీద వీరి ముగ్గురును 09/01/1932 తేదీనాడు పోలీసువారు జాయింటు మేజిస్ట్రేటు యస్.ఏ వెంకట్రామన్ ఐ సి యస్ గారి కోర్టులో విచారణకు హాజరు పరిచారు. ఆ కరపత్రాలు చూచిన జాయింటుమేజస్ట్రేటు “ఈ కరపత్రాలు ఎవ్వరు వ్రాశారో గాని అవి చాల తీవ్రమైన ధాటిలోనున్నవి ” అని అన్నారట ఆ విచారణకు పోలీసు సూపరింటెండెంటు కూడా బెంచిమీద కూర్చుని వున్నాడట ( అలా కూర్చోటం అనుచితమే కాక అనర్హతమైన ట్టిది). 29/01/1932 తేదీ నాడు కాట్రగడ్డ మధుసూదనరావుగారి తల్లి రామశేషమ్మగారిని పోలీసులు నిర్బంధనలోకి తీసుకున్నారు ఎందుకంటే ఆమె మొగల్రాజ పురంలో 26/01/1932 తేదీన భారత స్వతంత్రదినోత్సవంగా పరిగణించి జరుపుకున్నారట అందుకు ఆమెకు 6 నెలల ఖారా గార శిక్ష మరియూ జల్మానావిధించారు. ఆవిడ జుల్మానా కట్టకపోతే ఆవిడచేతివి వారి కోడలు చేతి గాజులు జప్తుచేశారు ఆ విధంగా పోలీసుల దురహంకార చర్యలు చేశారు. ఇంకో చోట పోలీసువారు ఇద్దరు మహిళలు బట్టల కొట్టును ముట్టడించినందుకు వారిద్దరును నిర్బంధించి కొన్ని గంటల సేపు కదలనీవకుండా నిర్బంధించి కొట్టి 90 మైళ్ళ దూరం తీసుకు పోయి వదలి పెట్టారు . ఇంకో చోట ఒక గృడ్డి వాడైన భువనవడియం నాగభూషణం అనే వ్యక్తి మూడురంగుల జండా పట్టుకుని ఆనందిస్తున్నందుకు పోలీసులు నిర్బంధించి కొట్టారు. మరి ఇంకోచోట కాంగ్రెస్సు కార్యకర్త వేదాంతం సోమేస్వర శాస్త్రిని రక్తంచిమ్మే వరకూ చితక కొట్టారు. 13/04/1932 తేదీన కాంగ్రెస్సు వాలంటీర్లు జలియన్ వాలా బాగ్ కాల్పుల కర్మకాండ దినం జరుపుకున్నందుకు పోలీసులు కొట్టారు. 27/04/1932 తేదీన వాలంటీర్లు తపాలా కార్యాలయమును ముట్టడించారని నేరంపై కొట్టారు. ఆ విధంగా 14/02/1932 to 04/07/1932 మధ్య జిల్లాలో చేసిన పోలీసుల అత్యాచారాలను శివరావుగారు వ్రాసి మద్రాసు లెజిస్లేటివ అశంబ్లీలో ప్రశ్నించవలసినదని కృష్ణా జిల్లా నుండి ఎన్నికైన సభ్యులు మహాబూబ్ అలీ బైగ్ మరియు సి కోదండరామిరెడ్డి గార్లను కోరారు కానీ వారేమీ కలుగజేసుకో నందున శివరావుగారు వాస్తవిక స్ధితులతో కూడిన ఒక మెమొరాండమ్ తయారు చేసి తన సహోగ్యులైన 20 మంది న్యాయవాదులైన బెజవాడ బార్ మెంబర్లచేత సంతకాలు పెట్టించి తన చిననాటి మిత్రు డూ అప్పటి మద్రాసు లెజిస్లేటివ యశంబ్లీలో సభ్యలూనూ అయిన, మంగళూరులో వకీలుగాయున్న యూ సి భట్ గారికి పంపిచి కృష్ణాజిల్లాలో జరిగిన పోలీసు దుండగ చర్యలను యశంబ్లీ టేబుల్ పై పెట్టి ప్రశ్నంచగా అప్పుడు ప్రభుత్వము వారు దానిని ప్రింటు చేసి ఒక మెమొరాండమ్ ను విడుదల చేశారు అందులో జవాబుగా ప్రభుత్వమువారు ఏమీ చెప్పలేక నీరుకార్చారు. శివరావుగారు స్వతంత్రపోరాటములో చేసి న కృషి అలాగ బహుముఖములుగానున్నది.
 
==ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వమువారి గ్లాసరీ ( నిఘంటువు) కమిటీ లో శివరావుగారి కృషి==
 
1957 లో ఆంధ్రప్రదేశ్ శాసన సభాద్యక్షులైన ఆయ్యదేవర కాళేశ్వరరావుగారు వారు ఏర్పాటు చేయునున్న గ్లాసరీ సంస్థ గురించి ముందుగా ముఖ్యమైన నలుగురు ప్రముఖలుకు వారి అభప్రాయముకోరుతూ వ్రాయగా వారు నలుగురూ (గిడుగు సీతాపతి, నార్ల వెంకటేశ్వరరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ) ఏక ఖంఠంతో శివరావుగారిని సభ్యునిగా చేర్చమని వ్రాశారు. శివరావు గారు 1934 లోనే వ్యవహారిక పదకోశము మరియు శాస్త్ర పరిభాష రచించినవారైనందున వారి పేరు ఆ నలుగురు ప్రముఖులు వక్కాణించటమైనది. శివరావుగారి ఆ పుస్తకమును గూర్చి మద్రాసు హైకోర్టు ప్రముఖ న్యాయవాది అల్లాడి కృష్ణస్వామి20కృష్ణ20/1/1935 న ఇలా వ్రాశారు “this book is first of its kind and supplies a long felt need”. ఆ కమిటీ హైదరాబాదులో శాసన సభా మందిరంలో జరిగేది దానికి విజయవాడలోని రెండు ఉప సభల్లో నొకటి శివరావుగారి ఇంట్లో జరిగేది. మొట్టమొదట అక్టోబరు 1957 లో హైదరాబాదు కమిటీలో 32 మంది సభ్యులతో చేయబడింది. తరువాత డిసెంబరు 1958 లో సభ్యులని 16 మందిగా చేశారు తరువాత రెండు సబ్ కమిటీలు విజయవాడలోపెట్టారు. 1958నాటి విజయవాడ శివరావు గారింట్లో సబ్ కమిటీకి విశ్వనాధ సత్యనారాయణ గారిని అధ్యక్షునిగాను శివరావుగారిని కన్వీనరు. సభ్యులు కాటూరి వెంకటేశ్వరారావు,, గరికిపాటి కృష్ణమూర్తి, యమ్. ఆర్. అప్పారావు (శాసన సభ్యులు), [[గిడుగు వెంకట సీతాపతి]], రామస్వామిరామ నాయడు (శాసన సభ్యులు) మల్లంపల్లి సోమసేఖర శర్మ [[భమిడిపాటి కామేశ్వరరావు]] సభ్యులుగా ఉన్నారు. అదే సబ్ కమమిటీని తిరిగి మార్పుచేసి 1959 ఫిబ్రవరిలో శివరావుగారిని అధ్యక్షతన, రామస్వామిరామ నాయడు, గరికిపాటి కృష్ణమూర్తి, కంభంపాటి సత్యనారాయణ సభ్యులుగా యున్నారు. డిసెంబరు 1958 లో History Academy పునావర్దీకరించబడినది దాని గవర్నింగ్ కౌన్సిల్ మరియు ఎడిటోరియల కమిటీ కాళేశ్వరారావుగారి అధ్యక్షతన సభ్యులు శివరావుగారు, రాళ్లబండి సుబ్బారావు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారును. పుట్టపర్తి శ్రీనినివాసాచారి గారు కార్యదర్శి. 1959 లో శివరావుగారు వ్రాసిన ఆఫ్రికాజాతీయోద్యమము పుస్తకమును [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ చరిత్ర విజ్ఞాన అకాడమీ వారు ప్రచురణను. 21-08-1959 తేదీన భారత ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు పుస్తకావష్కరణ చేశారు. 1960 సెప్టెంబరులో కాళేశ్వరరావుగారు శివరావుగారిని భారత రాజ్యాంగమును తెనుగుసేతచేయమని కోరారు అటుతరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారు చరిత్ర విజ్ఞాన అకాడమీ వారి ఆధర్యములో ఇంకో కమిటీ వేసి అందులోకూడా శివరావుగారిని సభ్యులుగా నియమించారు. 1961 లో కాళేశ్వరారావు గారు శివరావుగారు రచించే పుస్తకము ఆంధ్రప్రదేశ్ చరిత్రను తొందరగా పూర్తిచేయమని ప్రేరేపించేవారు. ఈలోపల కాళేశ్వరరావుగారు 26-02-1962 లో పరమదించగా అప్పట్లో విద్యాశాఖా మాత్యులుగానున్న [[పి. వి. నరసింహారావు]]గారి అధ్యక్షతన అన్నికమిటీలు కొనసాగాయి. 11/05/1962 నాడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ముగ్గురు సభ్యలు గల కమిటీలో శివరావుగారిని నామినేట్ చేశారు. ఈ కమీటియొక్క వుద్దేశం విలువైన వ్రాత ప్రత్తులను మైక్రో ఫిల్మింగే చేసి ప్రచురించటం for arrangemts to take Micro film copies of Mackenzie manuscripts (to be microfilmed and published). అప్పట్లో జరుగుతున్న ట్రాన్సలేషన్ కమిటీలో సభ్యులుగానున్న శివరావు గారు [[హిందీ భాష|హిందీ]] మాటలను తెలుగులోకి తీసుకుస్తున్నందుకు శివరావుగారు ఆభ్యంతరం తెలిపి సభకు రాజీనామాచేశారు. పి. వి నరసింహరావుగారు అప్పటి విద్యా మంత్రి ఆ సభకు అధ్యక్షులు గానున్నారు. అలా హిందీ మాటలను తెలుగులోకి తీసురావటంగురించి శివరావు గారు హిందూ పత్రికలో లేఖవ్రాశారు. వారి రాజీనామాకి కారణం [[ఆంధ్రప్రభ]]వారు ప్రచురించారు.
 
==రాష్ట్రప్రభుత్వం పై కాపీరైటు వుల్లంఘన దావా==
పంక్తి 172:
==శివరావుగారి రచించిన పుస్తకాలను గూర్చి ఆభిప్రాయాలు==
 
శివరావుగారి పుస్తకాలను వ్యాసములు చదివి అభినందనలు తెలుపుతూ అనేక ప్రముఖ సాహిత్యకారులు, పండితులు, కవులు, కళాకారులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, పత్రికాప్రతినిధులే కాక ఆంధ్రదేశం నలుమూలనుంచీ పాఠశాల అధ్యాపకులు, కాలేజీ లెక్చరర్లు, వివిధ వృత్తులలో వారు వైద్యులు, వ్యాపారస్తులు దేశాంతరాలలో నున్న తెలుగువారు కూడా ఉత్తరాలు వ్రాశి ప్రశింసించారు. వారిలో [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]], [[చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి]], సురవరం ప్రతాపరెడ్డి, [[మాడపాటి హనుమంతరావు]], [[వేలూరి శివరామ శాస్రి|వేలూరి శివరామ శాస్త్రి]]. [[వేటూరి ప్రభాకర శాస్త్రి]], [[చిరంతానందస్వామి|స్వామీ చిరతానంద]], [[కట్టమంచి రామలింగా రెడ్డి]], అల్లాడి కృష్ణస్వామికృష్ణ అయ్యర్, [[అయ్యదేవర కాళేశ్వరరావు]], [[నార్ల వెంకటేశ్వర రావు]], [[గొట్టిపాటి బ్రహ్మయ్య]], [[ఖండవల్లి లక్ష్మీరంజనం]] మొదలగు ప్రముఖుల పేర్లు చెప్పక తప్పదు. 1928 లోధక్షిణాఫ్రికాలో ఇండియన్ మిషన్ లో పనిచేస్తన్నటువంటి ఒక తెలుగు వారు శివరావుగారి దక్షిణాఫ్రికా రివ్యూ చూసి వారికి ఉత్తరం వ్రాశాడు. పాశ్చాత్య దేశీయులు సాహిత్య సంశోధనచేస్తూ శివరావుగారిని సంప్రంతించిన వారిలో ఒక రిద్దరు [[ఫ్రాన్సు]]దేశస్తుడు, ఆంగ్లేయుడు కూడానున్నారు.
[[అక్కిరాజు చంద్రమౌళి కవి]] గారు1944 లో శివరావుగారు రచించిన కథలు-గాధలు మీద 1949 జూలై 27 తేదిన చెప్పిన అభిప్రయము [[చంపకమాల]] పద్యము