బండి గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
విలీనం చేస్తున్నాను ట్యాగు: 2017 source edit |
జేవితం కొంత రాసాను. |
||
పంక్తి 1:
'''[[బంగోరె]]''' అనే పేరుతో ప్రసిద్ధుడైన బండి గోపాలరెడ్డి గొప్ప [[సాహిత్యం|సాహిత్య]] పరిశోధకుడు, విమర్శకుడు. జననం 1937. మరణం 1982 అక్టోబర్ 31 నెల్లూరు వి. ఆర్. కళాశాలలో ఇంటర్మీడియట్ , అనంతరం ఆంధ్రవిశ్వవిద్యాలయం లో యం కాం ఆనర్స్ చదివాడు. 1960లో కొద్దికాలం స్రవంతి పత్రికలో, తర్వాత మరి కొన్ని నెలలు ఆంధ్రజ్యోతి దినపత్రిక, విజయవాడలో ఉద్యోగం చేసి, కడప కో ఆపరేటివ్ బ్యాక్ లో పని చేసాడు. 1964లో నెల్లూరు జమీన్ రైతు వార పత్రికలో సహాయ సంపాదకుడుగా పనిచేసాడు.జమీన్ రైతు పత్రికలో వారం వారం "కూనిరాగాలు" శీర్హిక నిర్వహించి నెల్లూరు జిల్లా ప్రజాబాహుళ్యంలో విశేషమైన కిర్తి పొందాడు. ఈ శీర్షికను "లోకలిస్ట్ " కలంపేరుతో
1967 ప్రాంతంలో నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయానికి కార్యదర్శి అయ్యాడు. ఈ సమాజం ప్రతి సంవత్సరం కవిపండితుల జయంతులు జరుపుతుంది. ఆవిధంగా ఎందరో ప్రసిద్ధవ్యక్తుల పరిచయం, స్నేహం లభించింది. కావలి కళాశాల అద్యాపకులు కే.వి. ఆర్ స్నేహం తనపయి గొప్ప ప్రభావం కలిగించింది. 1969 మార్చి నెలలో గురజాడ అప్పారావు గారి మొదటి కన్యాశుల్కం ప్రతి సంపాదించి, దానికి నోట్సు రాసి, ఆరుద్ర ఉపోద్ఘాతంతో ప్రచురించాడు. ఈ పుస్తకం పరిశోధకుడుగా ఆయనకు అజరామరమయిన కిఇర్తిని తెచ్చిపెట్టింది.ఇందులో గురజాడవారి జన్మదినాన్ని నిర్దుష్టంగా నిరూపించాడు.
బంగోరె విద్యార్థి దశలోనే బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది నవల చదివి దాదాపు ఆ ప్రభావంలో బుచ్చిబాబుతో ఉత్తర ప్రతుత్తరాలు జరిపాడు. అంతకుముందు ఆచంట రాజారాం గారి అభిమానిగా ఉన్నాదు. 1967 ప్రాంతాలలో ఖలీల్ జిబ్రాన్ కవిత్వం మీద మిత్రులతో చర్చలు. జరుపుతుండేవాడు.
శ్రీ నేలనుతల శ్రీకృష్ణమూర్తి 1962-64 కాలంలో విక్రమ సింహపురి మండల సర్వస్వం సంపాదకులుగా దాన్ని వెలువరించడానికి కృషిచేస్తున్నారు. ఇందులో బంగోరి స్థానిక చరిత్ర మీద అనేక వాసాలు రాయడమే కాక, ఈ గ్రంధం సహాయ సంపాదకుడుగా పనిచేసాడు.
1971చివర వరకు జమీన్ రైతు లో పనిచేసి, మద్రాసులో usis లో బి.యస్.ఆర్. సంపాదకత్వంలో వెలువడుతున్న American Reporter పత్రిక లో పనిచేయడానికి వెళ్ళాడు. ఆ ఉద్యోగం ఒక ఏడాది మించి సాగలేదు.
==రచనలు==
# తాతాచారి కథలు - నాల్గవ ముద్రణ (సంపాదకత్వం)<ref>[http://pustakam.net/?p=4635 మొట్టమొదటి తెలుగు కథ నెల్లూరియునిదే]</ref>
|