వెలమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Chicknor (చర్చ) చేసిన మార్పులను Ch Maheswara Raju చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
[[తెలుగు]] వారి పౌరుషానికి, శౌర్యప్రతాపాలకు ప్రతీకలు '''వెలమ''' వంశములవారు. క్రీ. శ. 12వ శతాబ్దమునుండి వీరు ఆంధ్ర చరిత్రలో ప్రముఖ పాత్ర వహించారు. క్రీ. శ. 13611257 నుండి ఒక శతాబ్ద కాలము [[రాచకొండ]] మరియు [[దేవరకొండ]] రాజధానులుగా [[తెలంగాణా]] ప్రాంతము పాలిచారు. అటు పిమ్మట [[బహమనీ సుల్తానుల]]కు సామంతులుగా ఉన్నారు. [[విజయనగర సామ్రాజ్యము]]లో సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులు పొందారు.
వెలమ అనునది [[భారతదేశం]]లో ఒక [[కులం]]. వెలమ అను పదము మొదటిసారిగా [[నెల్లూరు]] మండలములో దొరికిన 16వ శతాబ్దమునాటి ఒక శాసనములో గలదు.
 
==చరిత్ర==
ప్రముఖ సాంఘికవేత్త, చరిత్రకారుడు ఎడ్గార్ థర్ స్టన్ ప్రకారము వెలమ, [[కమ్మ]] కులములు ఒకే మూలమునుండి విడిపోయినవి. ఈ ఘటనపై తెలుగు సాంప్రదాయములో బహు కథనాలు ప్రచారములోఉన్నాయి కాని దేనికీ చారిత్రకాధారములు లేవు. ఈ రెంటి కులములలోని ఆచారవ్యవహారములు, గోత్రములు, ఇంటిపేర్లలో చాల సామీప్యత గలదు. వెలమ అను పదము మొదటిసారిగా [[నెల్లూరు]] మండలములో దొరికిన 16వ శతాబ్దమునాటి ఒక శాసనములో గలదు. చరిత్రకారుల అభిప్రాయము ప్రకారము 11వ శతాబ్దములో వెలనాటినుండి ([[గుంటూరు]] మండలములోని ఒక భాగము) ఓరుగల్లుకు వెడలిన యోధుల వంశముల వారు వెలమలయ్యారు.
 
కాకతీయ చక్రవర్తి రుద్రుని కాలములో బడబానల భట్టు వెలమవారికి, కమ్మవారికి గోత్రములు నిర్ణయించాడు. దీనిని బట్టి వీరు పూర్వకాలములో బౌద్ధులు, జైనులు గా ఉండిఉండవచ్చును. వెలుగోటివారి వంశావళి, పద్మనాయక చరిత్ర వీరి చరిత్రకు కొంత ఆధారములు<ref>నేలటూరి వెంకటరమణయ్య, వెలుగోటివారి వంశావళి ఆంగ్ల అనువాదము</ref><ref>సర్వజ్ఞ సింగభూపాల, పద్మనాయక చరిత్ర</ref>. వ్యవసాయిక వృత్తిచేసుకొను కాపులు వెలమ, కమ్మవారిగా విడిపోయారు.
క్రీ. శ. 12వ శతాబ్దమునుండి వీరు ఆంధ్ర చరిత్రలో ప్రముఖ పాత్ర వహించారు. క్రీ. శ. 1361 నుండి ఒక శతాబ్ద కాలము [[రాచకొండ]] మరియు [[దేవరకొండ]] రాజధానులుగా [[తెలంగాణా]] ప్రాంతము పాలిచారు. అటు పిమ్మట [[బహమనీ సుల్తానుల]]కు సామంతులుగా ఉన్నారు. [[విజయనగర సామ్రాజ్యము]]లో సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులు పొందారు.
 
కాకతీయ చక్రవర్తి రుద్రుని కాలములో బడబానల భట్టు వెలమవారికి గోత్రములు నిర్ణయించాడు. దీనిని బట్టి వీరు పూర్వకాలములో బౌద్ధులు, జైనులు గా ఉండిఉండవచ్చును. వెలుగోటివారి వంశావళి, పద్మనాయక చరిత్ర వీరి చరిత్రకు కొంత ఆధారములు<ref>నేలటూరి వెంకటరమణయ్య, వెలుగోటివారి వంశావళి ఆంగ్ల అనువాదము</ref><ref>సర్వజ్ఞ సింగభూపాల, పద్మనాయక చరిత్ర</ref>. వ్యవసాయిక వృత్తిచేసుకొను కాపులు వెలమ, కమ్మవారిగా విడిపోయారు.
"....కాలచోదితమున కాకతీవరుగొల్చి కాపులెల్ల వెలమ, కమ్మలైరి"
 
Line 15 ⟶ 14:
====పద్మనాయకులు====
 
కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓరుగంటి దుర్గ రక్షణ 77 నాయకులకు అప్పగించాడు. వీరిలో అధికులు రేచెర్ల వంశము వారు <ref>ప్రతాపరుద్ర చరిత్రము, ఏకాంబరనాథకవి, సం: ముదిగొండ వీరేశలింగ శాస్త్రి, శైవప్రచారిణీగ్రంథమాల, వరంగల్</ref>. సింథియా టాల్బోట్ సిద్ధాంతము ప్రకారము పద్మనాయకులందరూ వెలమలు కారనియూ, వారిలోని రేచెర్ల వంశమువారే వెలమలనియూ వాదన<ref>Pre-colonial India in Practice: Society, Region and Identity in Medieval Andhra, C. Talbot, 2001, Oxford University Press, p. 191, ISBN:0195136616 </ref>. భీమేశ్వర పురాణము లో శూద్రులలో శాఖలుగా 'వెలమలు' 'పద్మనాయకులు' వేర్వేరుగా చెప్పబడిరి<ref>Musunuri Nayaks: A Forgotten Chapter of Andhra History, M. Somasekhara Sarma, 1948, Andhra University Press, Waltair </ref>. అటులనే ఒక తెలంగాణా శాసనములో (క్రీ. శ. 1613) ఒకనిని వెలమగా మరొకనిని పద్మనాయకునిగా పరిగణించబడిరి. దీనిని బట్టి పద్మనాయకులలో మహాయోధులైన పలు కులముల వారున్నారని చెప్పవచ్చును.
 
"....అందు పద్మనాయకులన, వెలమలన, కమ్మలన త్రిమార్గ గంగాప్రవాహంబులుంబోలె గొత్రంబులన్నియేని జగత్పవిత్రంబులై ప్రవహింపచుండ"<ref>శ్రీనాథ, భీమేశ్వర పురాణము</ref>.
"https://te.wikipedia.org/wiki/వెలమ" నుండి వెలికితీశారు