ఖైరతాబాదు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హైదరాబాదులోని ప్రాంతాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
సమాచారాన్ని సంబంధిత వ్యాసంలోకి చేర్చాను
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 6:
 
==ఖైరతాబాదు గణేశ్ ఉత్సవాలు==
వినాయక చవితికి ఇక్కడ జరిపే సంబురాలు దేశప్రఖ్యాతం. ఈ గణేశుని ఉత్సవాలు హైందవుల్లో తిరిగి సామరస్యతా భావాన్ని, ఐక్యతను పెంపొందించి ఆధ్యాత్మికంగా, రాజకీయంగా చైతన్యవంతం చేయడంలో విశెషమైన పాత్ర పోషిస్తున్నాయి. బాల గంగాధర తిలక్ వంటి వారు, ప్రజల్లో జాగృతి నింపి పోరాట బాట పట్టించుటకు, ఐక్యతకు వినాయకుని జయంతిని సమైక్యంగా నిర్వహించడం ప్రారంభించారు. ఆ స్ఫూర్తితో ఖైరతాబాదు నగరంలో 1954లో అప్పటి కౌన్సిలర్ [[సింగరి శంకరయ్య]] సమైక్య గణేశ్ ఉత్సవాలను నిర్వహించడం మొదలు పెట్టారు. ఆనాటి నుండి ఇవి నాయకత్వానికీ, ఐక్యతకు ప్రతిరూపంగా స్ఫూర్తిని నింపుతున్నాయి.
 
1954లో అప్పటి కౌన్సిలర్‌ సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాల ప్రతిష్ఠతో ప్రతిమ కూడా పెరుగుతూ వచ్చింది. అలా 60ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ ఆ తర్వాత తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ఏటా వైవిధ్యతను చాటుతున్నారు శంకరయ్యతో పాటు కలిసి పనిచేసిన ఆయన సోదరుడు సింగరి సుదర్శన్‌ ఇప్పుడు వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
 
===విశేషాలు===
* తొలి రోజుల్లో నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఇక్కడ 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు
* 1960లోఏనుగుపై వూరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
* ఇక్కడ 11 అడుగుల విగ్రహాన్ని తయారుచేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
* 1982లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు.
* 1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
* ఇక్కడ మొదటి నుంచి లడ్డూ ఏర్పాటు చేయడం లేదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు.
* గతేడాది 6వేల కిలోల లడ్డును చేతిలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరి నిమిషంలో 500 కిలోల లడ్డూను ఏర్పాటు చేశారు.
* ఓ సారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్‌బండ్‌కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్‌ రాకపోవడంతో నెల పాటు ట్యాంక్‌బండ్‌పై ఉంచారు.
* కదిలి వచ్చిన సినీ ప్రముఖులు: బుల్లి తెరలోనే కాకుండా 1983లోనే సినిమాల్లోనూ ఖైరతాబాద్‌ వినాయకుడు వెలుగువెలిగాడు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘సాగర సంగమం’ చిత్రం షూటింగ్‌ కోసం నటుడు కమలహాసన్‌తో ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు.ఎన్టీఆర్‌, శోభన్‌బాబుఅప్పట్లో గణపతిని దర్శించుకున్నారు.
* 150మంది కళాకారులు: తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్‌తో పాటు దాదాపు 150 మంది కళాకారులు మూడు నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు.
 
==రాజకీయాలు==
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు" నుండి వెలికితీశారు